ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబ్ట్రాటర్ ఈవెంట్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్ ఖరారు అయినట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈవెంట్కు హాజరయ్యారు. వీళ్లను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు.
ప్రియాంక చోప్రా లుక్

ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఈ సందర్భంగా తెల్లటి దుస్తుల్లో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. గ్లోబ్ట్రాటర్ ఈవెంట్లోకి అడుగుపెడుతూ ఆమె నమస్కారం చేసి, అభిమానులను పలకరించారు. ప్రియాంక తెల్లటి లెహంగా దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు. వాటికి సంప్రదాయ ఆభరణాలను జోడించారు. ఆమె లుక్ తెగ వైరల్ అవుతోంది. ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.
రాణిలా
నటి లుక్పై స్పందిస్తూ ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించారు. “ప్రియాంక ఒక రాణిలా కనిపిస్తోంది! భారతీయ సినిమాల్లోకి ఆమె కమ్బ్యాక్ కోసం వేచి ఉండలేను!” అని పేర్కొన్నారు. “ఆమె ప్రియాంక చోప్రా జోనాస్! ఎంత అద్భుతంగా ఉందో చూడండి!” అని మరో అభిమాని పేర్కొన్నారు. “అద్భుతమైన అందం” అని మరొకరు జోడించారు.
{{/usCountry}}నటి లుక్పై స్పందిస్తూ ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించారు. “ప్రియాంక ఒక రాణిలా కనిపిస్తోంది! భారతీయ సినిమాల్లోకి ఆమె కమ్బ్యాక్ కోసం వేచి ఉండలేను!” అని పేర్కొన్నారు. “ఆమె ప్రియాంక చోప్రా జోనాస్! ఎంత అద్భుతంగా ఉందో చూడండి!” అని మరో అభిమాని పేర్కొన్నారు. “అద్భుతమైన అందం” అని మరొకరు జోడించారు.
{{/usCountry}}మందాకినిగా
మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా మందానికి క్యారెక్టర్ చేస్తోంది. రీసెంట్ గా ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రాజమౌళి సోషల్ మీడియాలో మందాకినిగా ప్రియాంక పోస్టర్ను ఆవిష్కరించారు.
దానిని షేర్ చేస్తూ ఆయన.. “ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ. తిరిగి స్వాగతం, దేసీ గర్ల్! ప్రియాంక చోప్రా. మందాకినిగా మిమ్మల్ని చూడటానికి వేచి ఉండలేను’’ అని పేర్కొన్నారు.