బాలీవుడ్ వెటరన్ నటుడు రాకేష్ బేడీ ప్రస్తుతం ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే, ఈ సంతోష సమయంలోనే గతంలో తన చుట్టూ అల్లుకున్న ఒక వివాదంపై రాకేష్ బేడీ మరోసారి స్పందించారు.
సారా అర్జున్ను పలకరించిన తీరుపై

గతేడాది నవంబర్లో ధురంధర్ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మూవీ హీరోయిన్ సారా అర్జున్ను ఆయన పలకరించిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న రాకేష్ బేడీ ఆరోజు అసలేం జరిగిందో వివరించారు.
అసలు వివాదం ఏంటి?
'ధరంధర్' చిత్రంలో 71 ఏళ్ల రాకేష్ బేడీ రాజకీయ నాయకుడు జమీల్ జమాలిగా నటించగా 20 ఏళ్ల సారా అర్జున్ ఆయన కూతురు యాలీనా పాత్ర చేసింది. ధురంధర్ ఫస్ట్ పార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాకేష్ బేడీ స్టేజ్ మీదకు రాగానే సారాను హత్తుకుని పలకరించారు. ఆ సమయంలో సారు అర్జున్ భుజంపై రాకేష్ బేడీ ముద్దు పెట్టినట్లుగా ఉన్న ఒక క్లిప్ వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు రాకేష్ బేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తండ్రిలా పలకరిస్తే తప్పుగా చూస్తారా?
ఈ విమర్శలపై రాకేష్ బేడీ తాజాగా ఘాటుగా స్పందించారు. "షూటింగ్ సమయంలో సారా ఎప్పుడు సెట్స్కు వచ్చినా నేను ఒక తండ్రిలా ఆమెను హత్తుకుని, నుదుటిపై ముద్దు పెట్టుకుని ప్రోత్సహించేవాడిని. ట్రైలర్ లాంచ్ రోజు కూడా అదే ప్రేమతో పలకరించాను. కానీ, జనం రకరకాలుగా రాశారు. నేను ఎప్పుడూ ఆమెను నా బిడ్డలాగే చూశాను" అని రాకేష్ బేడీ పేర్కొన్నారు.
జనం ఏదో ఒకటి అంటూనే ఉంటారు
"ప్రజలకు ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకోవడానికి కారణం కావాలి. 'కుచ్ తో లోగ్ కహేంగే..' (జనం ఏదో ఒకటి అంటూనే ఉంటారు) అన్నట్లుగా కొందరు నాపై విమర్శలు చేసినా, మరికొందరు నాకు మద్దతుగా నిలిచారు" అని రాకేష్ బేడీ చెప్పుకొచ్చారు.
{{/usCountry}}"ప్రజలకు ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకోవడానికి కారణం కావాలి. 'కుచ్ తో లోగ్ కహేంగే..' (జనం ఏదో ఒకటి అంటూనే ఉంటారు) అన్నట్లుగా కొందరు నాపై విమర్శలు చేసినా, మరికొందరు నాకు మద్దతుగా నిలిచారు" అని రాకేష్ బేడీ చెప్పుకొచ్చారు.
{{/usCountry}}"పబ్లిక్గా స్టేజ్ మీద, ఆమె (సారా అర్జున్) తల్లిదండ్రులు ఉన్నప్పుడే నేను చెడు ఉద్దేశంతో ఎందుకు ప్రవర్తిస్తాను? సోషల్ మీడియాలో ఏమీ లేని విషయాన్ని పెద్దది చేయడం కొందరికి అలవాటుగా మారింది" అని రాకేష్ బేడీ అసహనం వ్యక్తం చేశారు.
సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న 'జమీల్ జమాలి'
ఇక వివాదాలను పక్కన పెడితే రాకేష్ బేడీ ప్రస్తుతం 'ధరంధర్ 2' సాధిస్తున్న రికార్డు వసూళ్లతో చాలా సంతోషంగా ఉన్నారు. మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 చిత్రం ఇప్పటికే భారతదేశంలో రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
క్లైమాక్స్ ట్విస్ట్
రణ్వీర్ సింగ్ గూఢచారిగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో రాకేష్ బేడీ పోషించిన రాజకీయ నాయకుడి పాత్రకు మంచి గుర్తింపు లభించింది. క్లైమాక్స్లో జమీల్ జమాలి ఇచ్చే ట్విస్టుకు ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. ఇలాంటి భారీ హిట్ కెరీర్లో అరుదుగా వస్తుందని, ఈ విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నానని రాకేష్ బేడీ తెలిపారు.