Ram Charan Peddi: పెద్ది వాయిదా పడటం లేదు.. కొంచెం ప్రమోట్ చేసి చెప్పండి: రాకాస టీమ్‌ను కోరిన రామ్ చరణ్

Ram Charan Peddi: రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది' విడుదలపై వస్తున్న వాయిదా వార్తలకు స్వయంగా చరణ్ చెక్ పెట్టాడు. ఏప్రిల్ 30న సినిమా రాబోతోందని, పుకార్లను నమ్మవద్దని అతడు స్పష్టం చేయడం ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Published on: Apr 1, 2026, 21:20:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Charan Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'పెద్ది' (Peddi) సినిమా చుట్టూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ నడుస్తోంది. చిత్ర బృందం ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

Ram Charan Peddi: పెద్ది వాయిదా పడటం లేదు.. కొంచెం ప్రమోట్ చేసి చెప్పండి: రాకాస టీమ్‌ను కోరిన రామ్ చరణ్
Ram Charan Peddi: పెద్ది వాయిదా పడటం లేదు.. కొంచెం ప్రమోట్ చేసి చెప్పండి: రాకాస టీమ్‌ను కోరిన రామ్ చరణ్

అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. కొందరు డిస్ట్రిబ్యూటర్లకు కూడా వాయిదాకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు అందాయనే వార్తలు ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. కానీ రామ్ చరణ్ వీటికి చెక్ పెట్టాడు.

రామ్ చరణ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి?

ఈ సందిగ్ధత కొనసాగుతున్న సమయంలోనే రామ్ చరణ్ స్వయంగా స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా 'రాకాసా' (Raakaasaa) చిత్ర బృందం తమ సినిమా ప్రమోషన్లలో భాగంగా 'పెద్ది' షూటింగ్ సెట్స్‌లో రామ్ చరణ్‌ను కలిశారు.

ఆ సమయంలో చరణ్ వారి ప్రమోషనల్ కంటెంట్‌ను అభినందిస్తూనే, తన సినిమా గురించి ఒక కీలక ప్రకటన చేశారు. "పెద్ది సినిమా వాయిదా పడుతోందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా సినిమా వాయిదా పడటం లేదని అందరికీ తెలియజేయండి. ఆ పుకార్లకు అడ్డుకట్ట వేయండి," అని అతడు సదరు బృందాన్ని కోరడం విశేషం.

అయోమయంలో అభిమానులు.. ఇండస్ట్రీ

రామ్ చరణ్ ఇంత స్పష్టంగా వాయిదా వార్తలను ఖండించినప్పటికీ, సినీ వర్గాల్లో మాత్రం ఇంకా అనుమానాలు తొలగలేదు. ఒకవైపు హీరో సినిమా వాయిదా పడటం లేదని నొక్కి చెబుతుంటే, మరోవైపు ఇండస్ట్రీలోని అంతర్గత చర్చలు మాత్రం వేరేలా ఉన్నాయి. సినిమా అనుకున్న సమయానికి రావడం కష్టమనే సంకేతాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో చరణ్ వ్యాఖ్యలు కేవలం అభిమానులను శాంతింపజేయడానికేనా? లేక నిజంగానే ఏప్రిల్ 30కి సినిమా రెడీ అవుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏది ఏమైనా రామ్ చరణ్ నోటి నుంచే నేరుగా 'నో డిలే' అనే మాట రావడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. 'పెద్ది' సినిమా అధికారిక విడుదల తేదీ ఏది?

నిర్మాణ సంస్థ ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న విడుదల కావాల్సి ఉంది.

2. రామ్ చరణ్ వాయిదా వార్తలపై ఏమని స్పందించారు?

తన సినిమా వాయిదా పడుతోందనే వార్తలను రామ్ చరణ్ ఖండించారు. 'పెద్ది' వాయిదా పడటం లేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.

3. వాయిదా వార్తలు ఎందుకు మొదలయ్యాయి?

సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఏప్రిల్ 30కి సినిమా సిద్ధమవ్వడం కష్టమంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More