‘దండోరా’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్ లపై నటుడు శివాజీ చేసిన మిస్సోజినిస్టిక్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీని ‘అనాగరికుడు’ అని పిలిచిన కొద్ది రోజులకే, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయనపై మరోసారి తన విమర్శల దాడిని కొనసాగించారు.
రాజా సాబ్ హీరోయిన్లు

ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు ఈ మూవీ హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తమకు నచ్చిన దుస్తులు వేసుకుని వచ్చారు. ఈ హీరోయిన్లు తమ కంఫర్ట్ ఉన్న బట్టలోనే రావడాన్ని పేర్కొంటూ ఆర్జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ నైతికంగా మొరగడం గురించి ఎవరూ ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నాడు రామ్ గోపాల్ వర్మ.
మొరగడాన్ని పట్టించుకోకుండా
తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఆర్జీవీ ఒక చిత్రాన్ని పోస్ట్ చేశాడు. అందులో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రంలో ఆయనతో పాటు నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లతో సెల్ఫీ దిగుతూ కనిపించారు. ఈ పోస్ట్కు క్యాప్షన్గా ఆర్జీవీ ఇలా రాశాడు. ‘‘ప్రభాస్ రాజా సాబ్ ఈవెంట్లో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ ఈ ముగ్గురు హీరోయిన్లు శివాజీ, అతని విషపూరిత బృందం నైతికంగా మొరగడాన్ని పట్టించుకోలేదు. తాము కోరుకున్న దుస్తుల్లోనే వచ్చారు’’ అని ఆర్జీవీ పోస్ట్ చేశాడు.
హ్యాట్సాఫ్
{{/usCountry}}తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఆర్జీవీ ఒక చిత్రాన్ని పోస్ట్ చేశాడు. అందులో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రంలో ఆయనతో పాటు నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లతో సెల్ఫీ దిగుతూ కనిపించారు. ఈ పోస్ట్కు క్యాప్షన్గా ఆర్జీవీ ఇలా రాశాడు. ‘‘ప్రభాస్ రాజా సాబ్ ఈవెంట్లో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ ఈ ముగ్గురు హీరోయిన్లు శివాజీ, అతని విషపూరిత బృందం నైతికంగా మొరగడాన్ని పట్టించుకోలేదు. తాము కోరుకున్న దుస్తుల్లోనే వచ్చారు’’ అని ఆర్జీవీ పోస్ట్ చేశాడు.
హ్యాట్సాఫ్
{{/usCountry}}‘‘ఆ విలన్లకు గట్టిగా సమాధానం చెప్పిన ఈ ముగ్గురు హీరోలకు హాట్సాఫ్’’ అని రామ్ గోపాల్ వర్మ తన పోస్టును ముగించాడు. రాజా సాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం రిద్ది కుమార్ మెరిసే నల్లటి లెహంగాను ఎంచుకోగా, మాళవిక అందమైన తెలుపు చీరలో కనిపించింది. ఇక నిధి బూడిద రంగు చీరలో దర్శనమిచ్చింది.
శివాజీ ఏమన్నాడు?
మహిళలు పద్ధతిగా దుస్తులు ధరించకపోతే వారిని ‘దరిద్రపు ము***’ అని, వారి శరీర భాగాలను ‘సామాను’ అని అసంబద్ధమైన పదజాలంతో సంబోధించారని శివాజీ వివాదాన్ని రేకెత్తించాడు. అలా దుస్తులు ధరించకపోతే వారిని ‘దరిద్రపు స్త్రీ’గా పరిగణిస్తారని కూడా ఆయన అన్నాడు. ఈ విమర్శల తర్వాత, తాను అనుకోకుండా రెండు 'అసంబద్ధమైన' పదాలను ఉపయోగించానని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని ఆయన ఎక్స్ ఖాతాలో అంగీకరించాడు.
ఆర్జీవీ విమర్శలు
కొద్ది రోజుల క్రితం ఆర్జీవీ శివాజీని విమర్శిస్తూ ఇలా రాశాడు. ‘ఆ వ్యక్తి పూర్తి పేరు నాకు తెలియదు. అందుకనే ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నా. హే శివాజీ, నువ్వేమైతేనేమి, నీ ఇంట్లోని స్త్రీలు నీలాంటి అనాగరిక, అసహ్యకరమైన వ్యక్తిని సహించడానికి సిద్ధంగా ఉంటే, వారిపై నీతిబోధ చేసుకో. సమాజంలోని లేదా సినీ పరిశ్రమలోని ఇతర స్త్రీల విషయంలో, నీ అభిప్రాయాలను నీ దగ్గరే పెట్టుకో’’ అని ఆర్జీవీ ఫైర్ అయ్యాడు.