...
...
Next Story

Rashi Singh: నచ్చకపోతే సబ్‌స్క్రైబ్ చేయకండి.. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై హీరోయిన్ రాశి సింగ్ సంచలన వ్యాఖ్యలు!

Rashi Singh: ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌పై వస్తున్న విమర్శలపై టాలీవుడ్ హీరోయిన్ రాశి సింగ్ రియాక్టయింది. నచ్చని వారు సబ్‌స్క్రైబ్ చేసుకోకుండా ఉండొచ్చంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. రాశీ సింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Published on: Aug 21, 2026, 12:05:23 IST
Advertisement

Rashi Singh: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, కంటెంట్ క్రియేటర్లు ఆదాయం పొందేందుకు అందుబాటులోకి వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ 'సబ్‌స్క్రిప్షన్' (Instagram Subscriptions) ఫీచర్‌పై గత కొద్దిరోజులుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో న్యూడ్ ఫొటోలు, వీడియోలు పెడుతూ చెడగొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

రాశి సింగ్ రియాక్షన్

నచ్చకపోతే సబ్‌స్క్రైబ్ చేయకండి.. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై హీరోయిన్ రాశి సింగ్ సంచలన వ్యాఖ్యలు!
నచ్చకపోతే సబ్‌స్క్రైబ్ చేయకండి.. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై హీరోయిన్ రాశి సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ పేరుతో సెలబ్రిటీలు తమ సబ్ స్క్రైబర్ల నుంచి నెలకు రూ.399 అలా మనీ ఛార్జ్ చేస్తున్నారు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ను వాళ్లకు మాత్రమే అందిస్తున్నారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు అర్ధనగ్న ఫొటోలు, ఎక్స్ పోజింగ్ వీడియోలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రాశి సింగ్ రియాక్టయింది.

అభిమానుల నుంచి నెలవారీగా డబ్బు చేయడంపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ఈ అంశంపై టాలీవుడ్ కథానాయిక రాశి సింగ్ (Rashi Singh) చాలా స్పష్టంగా స్పందించింది.

అది వారి ఖాతా.. వారి ఇష్టం!

ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ల విధానంపై జరుగుతున్న ప్రచారంపై రాశి సింగ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించింది. "ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్స్ విధానంలో నాకు ఎలాంటి తప్పు కనిపించడం లేదు. అది వారి వ్యక్తిగత ఖాతా, వారి ఇష్టం.

ఆ సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌తో మీకు ఏమైనా అభ్యంతరం లేదా సమస్య ఉంటే, సింపుల్‌గా సబ్‌స్క్రైబ్ చేసుకోకండి. అంతేకానీ విమర్శలు చేయడం సమంజసం కాదు" అని రాశి సింగ్ సంచలన కామెంట్లు చేసింది. దీంతో క్రియేటర్లకు తమ ఖాతాల ద్వారా సంపాదించుకునే హక్కు ఉందనే సంకేతాన్ని ఆమె ఇచ్చినట్లయింది.

ఆదాయం కోసం

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాశి సింగ్ తెలుగులో హీరోయిన్ గా కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. మొదట ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసి ఆ తర్వాత 'శశి' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'ప్రసన్న వదనం', 'భూతద్దం భాస్కర్ నారాయణ', 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' వంటి సినిమాలతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్‌లలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాలో రాశి సింగ్ నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ కానుంది.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖులు ప్రత్యేక ఫోటోలు, వీడియోలు లేదా లైవ్ సెషన్ల కోసం సబ్‌స్క్రిప్షన్ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నారు. దీనిపై నెటిజన్ల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

క్రియేటర్లు పడే శ్రమకు ఇది ఒక ప్రతిఫలమని కొందరు మద్దతు తెలుపుతుంటే, ఉచితంగా చూసే ప్లాట్‌ఫామ్‌పై చార్జీలు విధించడం సరికాదని మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాశి సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe