Rashmika Anand: మరిదితో రష్మిక మందన్నా డ్యాన్స్- ఆనంద్ దేవరకొండపై వదిన స్పెషల్ పోస్ట్-విజయ్ చెప్పిన విషయం గుర్తు చేస్తూ!
Rashmika Mandanna Anand Devarakonda Dance: తన మరిది ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రష్మిక మందన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండతో వివాహం తర్వాత మరిదితో తనకున్న అనుబంధాన్ని రష్మిక మందన్నా సరదాగా పంచుకున్నారు. దీంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
నేషనల్ క్రష్, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవలే విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయితే, విజయ్తో లవ్ రూమర్్స వినిపిస్తున్న సమయంలోనే ఆనంద్ దేవరకొండ, ప్రస్తుతం మరిదితో రష్మికకు మంచి అనుబంధం ఉండేది.

అరుదైన ఫొటోలు, వీడియోలు
అది ఇప్పుడు మరోసారి స్పష్టమైంది. ఆనంద్ 34వ పుట్టినరోజును పురస్కరించుకుని రష్మిక మందన్నా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని అరుదైన ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. మరిదిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుతూ రష్మిక మందన్నా రాసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
"ఆనందా.. హ్యాపీ బర్త్డే!"
ఆదివారం (మార్చి 15) ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా రష్మిక మందన్నా ఒక క్యూట్ ఫోటోను పంచుకున్నారు. అందులో రష్మిక, ఆనంద్ ఇద్దరూ ఆరెంజ్ కలర్ టీ-షర్టులు ధరించి ఒకేలా కనిపిస్తున్నారు.
"ఆనందా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు! నువ్వు షూటింగ్లో బిజీగా ఉన్నావు, నిన్ను మేమంతా మిస్ అవుతున్నాం. నీ వర్క్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ ఫోటో తీస్తున్నప్పుడు మేమిద్దరం చేపలను పిలుస్తున్నామట.. ఈ విషయాన్ని విజ్జు (విజయ్ దేవరకొండ) చెప్పాడు. మనం ఎప్పుడూ ఇలాగే సరదాగా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ రష్మిక రాసుకొచ్చారు.
మరిదితో డ్యాన్స్
అంతేకాకుండా, మరిదితో కలిసి డ్యాన్స్ వేసిన ఒక వీడియోను కూడా రష్మిక మందన్నా షేర్ చేశారు. మలయాళ వైరల్ సాంగ్ 'కళ్యాణి' బ్యాక్గ్రౌండ్లో వస్తుండగా, మరిదితో పోటీ పడి డ్యాన్స్ చేస్తున్న వీడియోను చూపిస్తూ "మనం ఎప్పుడూ ఇలాగే డ్యాన్స్ చేస్తూ ఉండాలి" అని రష్మిక ఆకాంక్షించారు.
వదినపై ఆనంద్ ప్రేమ
గత నెల ఫిబ్రవరి 26న జైపూర్లో విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆనంద్ తన అన్న, వదినల గురించి ఒక ఎమోషనల్ నోట్ రాశారు.
"బయట ఫ్యాన్స్ నన్ను ‘వదిన ఎలా ఉన్నారు?’ అని అడుగుతుంటే నాకు ఎలా స్పందించాలో తెలిసేది కాదు. ఈరోజు నా అన్న ప్రపంచంలోనే అత్యంత పాజిటివ్ పర్సన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు ఒక మంచి వదిన దొరికింది" అని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు.
వరుస సినిమాలతో బిజీగా దేవరకొండ బ్రదర్స్
ఇదిలా ఉంటే, విజయ్ రష్మిక జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే సినిమా రూపొందుతోంది. 19వ శతాబ్దం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది.


మరోవైపు, ఆనంద్ దేవరకొండ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్యతో కలిసి ఆయన 'ఎపిక్' (Epic) అనే సినిమాలో నటిస్తున్నారు. దేవరకొండ కుటుంబంలో రష్మిక చేరికతో ఆ ఇంట్లో సందడి రెట్టింపైందని, మరిది బర్త్డే వేడుకలే అందుకు నిదర్శనమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












