Virosh Reception: రష్మికకు రక్షణ కవచంలా విజయ్ దేవరకొండ- రిసెప్షన్‌లో అతడితో ఉదర్ దేఖ్ అంటూ వేలు చూపించిన రౌడీ హీరో!

Virosh Reception Vijay Devarakonda Protects Rashmika Mandanna: పెళ్లి తర్వాత టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్ ఇచ్చారు. విరోష్ రిసెప్షన్‌లో భార్య రష్మిక మందన్నాకు రక్షణ కవచంలా ఉండి కాపాడుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆ వీడియో వైరల్‌గా మారింది.

Mar 5, 2026, 10:12:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల (Virosh Wedding) వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఫిబ్రవరి 26న ఒక్కటైన ఈ జంట, బుధవారం (మార్చి 4) రాత్రి హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ (Virosh Reception) ఏర్పాటు చేశారు. ఈ వేడుక ముగిసిన తర్వాత కెమెరా కళ్లకు చిక్కిన ఒక దృశ్యం ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

రష్మికకు రక్షణ కవచంలా విజయ్ దేవరకొండ- రిసెప్షన్‌లో అతడితో ఉదర్ దేఖ్ అంటూ వేలు చూపించిన రౌడీ హీరో!
రష్మికకు రక్షణ కవచంలా విజయ్ దేవరకొండ- రిసెప్షన్‌లో అతడితో ఉదర్ దేఖ్ అంటూ వేలు చూపించిన రౌడీ హీరో!

భార్యను రక్షించుకున్న రౌడీ స్టార్!

రిసెప్షన్ వేడుక ముగిశాక విజయ్, రష్మిక కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో అభిమానులు, ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. రష్మికకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విజయ్ తన చేతులతో ఆమెను దగ్గరకు తీసుకుని, రక్షణ కవచంలా నిలబడ్డారు.

వేలు చూపిస్తూ

జనం ఒత్తిడి ఆమెపై పడకుండా జాగ్రత్త పడుతూనే.. ఎటో చూస్తున్న ఒక ఫోటోగ్రాఫర్‌ను ఉద్దేశించి హిందీలో "ఉదర్ దేఖ్" (అటు చూడు) అంటూ కెమెరా వైపు వేలు చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రౌడీ హీరో తీరును

"తన భార్యను తాను రక్షించుకుంటున్న తీరు అద్భుతం.. వీరు నిజంగా 'మేడ్ ఫర్ ఈచ్ అదర్'" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, "విజయ్ హిందీ చాలా బాగుంది" అని మరొకరు మెచ్చుకున్నారు. మొత్తానికి ఈ జంట ‘హజ్బెండ్-వైఫ్ గోల్స్’ సెట్ చేస్తున్నారని నెటిజన్లు మురిసిపోతున్నారు. భార్యను హత్తుకుని కాపాడిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ తీరును నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.

వేడుకలో సందడి చేసిన తారలు

ఇకపోతే విరోష్ రిసెప్షన్ వేడుకలో విజయ్ క్రీమ్ కలర్ కుర్తా, ధోతీలో ఎంతో హుందాగా కనిపించగా.. రష్మిక మందన్నా ఎరుపు, బంగారు రంగు కలనేతలో ఉన్న పట్టుచీర, భారీ బంగారు ఆభరణాలు, నుదుటన సింధూరంతో మెరిసిపోయారు.

అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోవాలనుకుంటున్నాం

ఫోటోగ్రాఫర్లతో సరదాగా మాట్లాడిన విజయ్ దేవరకొండ "ఈ వేడుక ముగిశాక మేమిద్దరం ఎవరికీ తెలియకుండా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోవాలనుకుంటున్నాం (అంటే ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాం)" అని జోక్ చేయడంతో అక్కడ నవ్వులు విరిశాయి.

మెరిసిన టాలీవుడ్ తారలు

విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, నాని వంటి టాలీవుడ్ దిగ్గజాలతో పాటు బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, కృతి సనన్, మృణాల్ ఠాకూర్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ప్రేమ నుంచి పెళ్లి దాకా..

చాలా కాలంగా ప్రేమలో ఉన్నారన్న వార్తలపై ఎప్పుడూ నోరు విప్పని విరోష్ జంట గత ఏడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫిబ్రవరిలో తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించి, ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. తమ సంతోషాన్ని పంచుకుంటూ వివిధ నగరాల్లోని అభిమానులకు మిఠాయిలు పంపడంతో పాటు, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా అభిమానుల కోసం విందు కూడా ఏర్పాటు చేయడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More