...
...
Next Story

మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా.. వారికి మాత్రమే అన్ని విషయాలు చెప్పగలం.. రష్మిక మందన్నా కామెంట్స్

రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. తాజాగా ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మూవీ ట్రైలర్ లాంచ్‌లో రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Published on: Oct 26, 2025, 06:42:36 IST
Advertisement

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవలే రష్మిక మందన్నా నటించిన థామా మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు మరో సినిమాతో అలరించేందుకు రెడీ అయింది బ్యూటిపుల్ రష్మిక మందన్నా. ఆ సినిమానే "ది గర్ల్‌ఫ్రెండ్".

హీరో కమ్ డైరెక్టర్ దర్శకత్వం

మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా.. వారికి మాత్రమే అన్ని విషయాలు చెప్పగలం.. రష్మిక మందన్నా కామెంట్స్
మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా.. వారికి మాత్రమే అన్ని విషయాలు చెప్పగలం.. రష్మిక మందన్నా కామెంట్స్

ఈ సినిమాలో హీరోగా దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.

ఐదు భాషల్లో ది గర్ల్‌ఫ్రెండ్ రిలీజ్

ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.

ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్

ఈ నేపథ్యంలో తాజాగా అక్టోబర్ 25న ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇలాంటి లవ్ స్టోరీని

హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ.. "ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటిదాకా మనం చూడలేదు అనిపించింది. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీల్ కలిగింది" అని అన్నారు.

ముఖ్యమని భావించా

"నాకు బాక్సాఫీస్ నెంబర్స్, సక్సెస్ కంటే మంచి మూవీ చేయాలి, మంచి కథను ఆడియెన్స్‌కు చెప్పాలనే అనిపిస్తుంది. నా మూవీ థియేటర్స్‌కు వెళ్లి చూసిన ఆడియెన్స్ ఏదో ఒక మంచి ఫీల్‌తో బయటకు వెళ్లాలని కోరుకుంటాను. నేను నా కెరీర్‌లో రైట్ టైమ్‌లో కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది" అని రష్మిక మందన్నా తెలిపింది.

మన డ్రీమ్స్ నిజం కావు

"ఇలాంటి మంచి టీమ్ లేకుంటే మన డ్రీమ్స్ నిజం కావు. దీక్షిత్ లాంటి కో స్టార్‌తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా" అని తన స్పీచ్ ముగించిండి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe