Rashmika Mandanna Underwater Fight Scene Mysaa: భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా ఇప్పుడు సరికొత్త రికార్డుకు సిద్ధమయ్యారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా యాక్షన్ వైపు అడుగులు వేస్తున్న రష్మిక.. తన తాజా చిత్రం 'మైసా' (Mysaa) కోసం నెక్ట్స్ లెవెల్ రేంజ్లో శ్రమించారు.
హై వోల్టేజ్ యాక్షన్

భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక మహిళా నటి నీటి అడుగున చేసే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ను రష్మిక మందన్నా పూర్తి చేశారు. ఈ ఫైట్ సీన్ కోసం ఆమె ఎలాంటి డూప్ లేదా బాడీ డబుల్ను వాడకపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
నీటి అడుగున 20 గంటల పోరాటం
కాగా మెసా చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రష్మిక వెట్సూట్ ధరించి, డైవర్ల మధ్య నిలబడి సీన్కు సంబంధించిన సూచనలను వింటున్న దృశ్యాలు ఆ ఫోటోల్లో కనిపిస్తున్నాయి.
ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం రష్మిక కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 20 గంటల పాటు నీటి అడుగునే గడిపినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. మరో ఫోటోలో ఆమె వీపు భాగంలో గాయాల గుర్తులు కనిపిస్తున్నాయి.
"భారతీయ చలనచిత్ర రంగంలో ఒక మహిళా నటి నేతృత్వంలో నీటి అడుగున జరిగిన మొట్టమొదటి ఫైట్ సీక్వెన్స్ ఇది. మన ఊహలకు అందని విధంగా, నీటి లోతుల్లో జరిగే ఒక మహా యుద్ధాన్ని ప్రేక్షకులు స్క్రీన్పై చూడబోతున్నారు. ఆ ఉగ్రరూపాన్ని చూడటానికి సిద్ధమవ్వండి" అని దర్శకుడు రవీంద్ర పుల్లె ధీమా వ్యక్తం చేశారు.
నా జీవితంలోనే అతిపెద్ద సవాలు
ఈ యాక్షన్ షెడ్యూల్ విజయవంతంగా ముగిసిందని, త్వరలోనే మైసా సినిమా టీజర్కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రమాదకరమైన ఫైట్ సీక్వెన్స్ అనుభవాన్ని రష్మిక మందన్నా సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కొన్నాళ్లుగా తాను సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడానికి ఈ షూటింగే కారణమని చెప్పారు.
{{/usCountry}}ఈ యాక్షన్ షెడ్యూల్ విజయవంతంగా ముగిసిందని, త్వరలోనే మైసా సినిమా టీజర్కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రమాదకరమైన ఫైట్ సీక్వెన్స్ అనుభవాన్ని రష్మిక మందన్నా సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కొన్నాళ్లుగా తాను సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడానికి ఈ షూటింగే కారణమని చెప్పారు.
{{/usCountry}}"నేను సోషల్ మీడియాకు కాస్త దూరమయ్యానని నాకు తెలుసు. కానీ, మేమంతా ఈ ప్రాజెక్ట్ పనిలోనే బిజీగా ఉన్నాం. నా జీవితంలో నేను చేసిన అత్యంత కష్టమైన, సవాలుతో కూడిన పని ఇదొక్కటే. ఈ సీన్ కోసం మేమంతా పిచ్చిగా కష్టపడ్డాం. కానీ, ఆ కష్టమే నన్ను మరింత ఉత్సాహపరిచింది" అని రష్మిక మందన్నా రాసుకొచ్చారు.
గిరిజన నేపథ్యంలో పాన్ ఇండియా యాక్షన్
'మైసా' చిత్రాన్ని అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్నా కెరీర్లోనే లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా యాక్షన్ చిత్రంగా ఇది రానుంది.
మైసా ఫస్ట్ లుక్ పోస్టర్
గత ఏడాది జూలైలో విడుదల చేసిన మైసా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. అందులో రష్మిక ఒంటి నిండా రక్తంతో, చేతిలో ఆయుధం పట్టుకుని కోపంతో గాండ్రిస్తున్నట్లు కనిపించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.