విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జంట గురువారం (ఫిబ్రవరి 26) పెళ్లితో ఒక్కటవడం, ఆ పోస్టును రష్మిక షేర్ చేయడం, ఆ వెంటనే గంటల్లోనే ఇది రికార్డులు బ్రేక్ చేయడం చూస్తుంటే వీళ్ల పెళ్లికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
కియారా రికార్డును బ్రేక్ చేసిన రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి తర్వాత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన్న తన పెళ్లి గురించి పెట్టిన పోస్ట్కు వచ్చిన స్పందన చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ పోస్ట్ షేర్ చేసిన కేవలం 16 గంటల్లోనే 18 మిలియన్లకుపైగా (కోటి 80 లక్షలు) లైకులను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ న్యూస్ రాసే సమయానికి 18.7 మిలియన్ల లైక్స్ రావడం విశేషం.
గతంలో నటి కియారా అద్వానీ వెడ్డింగ్ పోస్ట్కు వచ్చిన 15.8 మిలియన్ల లైకులే ఇప్పటివరకు అత్యధికం. ఇప్పుడు రష్మిక ఆ రికార్డును సునాయాసంగా అధిగమించి, తన గ్లోబల్ క్రేజ్ను మరోసారి నిరూపించుకుంది. అభిమానులు తమ అభిమాన జంటపై కామెంట్ల రూపంలో ప్రేమను కురిపిస్తూ సోషల్ మీడియాను ఒక వర్చువల్ సెలబ్రేషన్గా మార్చేశారు.
ప్రధానికి రిసెప్షన్ ఆహ్వానం
మరోవైపు ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్న విజయ్, రష్మిక దంపతులు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మార్చి 4న హైదరాబాద్లో జరగనున్న తమ పెళ్లి రిసెప్షన్కు రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. ఈ కపుల్ తమ పెళ్లి వేడుకల సందడి ఇంకా తగ్గకముందే ఢిల్లీలో ప్రత్యక్షమైంది.
ప్రధానిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్న ఈ జంట.. మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించనున్న తమ వెడ్డింగ్ రిసెప్షన్కు రావాల్సిందిగా వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కలయికకు సంబంధించిన వార్త ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పెళ్లికి ముందు రోజు మోదీ కూడా ఈ జంటకు ప్రత్యేకంగా పెళ్లి విషెస్ పంపిన విషయం తెలిసిందే.
{{/usCountry}}ప్రధానిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్న ఈ జంట.. మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించనున్న తమ వెడ్డింగ్ రిసెప్షన్కు రావాల్సిందిగా వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కలయికకు సంబంధించిన వార్త ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పెళ్లికి ముందు రోజు మోదీ కూడా ఈ జంటకు ప్రత్యేకంగా పెళ్లి విషెస్ పంపిన విషయం తెలిసిందే.
{{/usCountry}}వచ్చే వారం హైదరాబాద్ లో సినీ ప్రముఖులతోపాటు తమ సన్నిహితులకు విజయ్, రష్మిక జోడీ గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
త్వరలోనే షూటింగ్స్లో బిజీ..
ప్రస్తుతం ఈ 'రణబాలి' స్టార్స్ పెళ్లి తర్వాత జరగాల్సిన సంప్రదాయబద్ధమైన క్రతువుల్లో మునిగిపోయారు. కొద్దిరోజుల పాటు ఈ మధుర క్షణాలను ఆస్వాదించాక, వచ్చే నెల నుంచి మళ్లీ తమ సినిమా షూటింగ్స్తో బిజీ కానున్నారు. విజయ్ రణబాలితోపాటు మైసా అనే మరో సినిమాలోనూ రష్మిక నటిస్తోంది.