బాలీవుడ్ పాపులర్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ లో లింగ వివక్ష, ఈక్వెల్ రెమ్యునరేషన్ పై అతను చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అమ్మాయిలు అనే కారణంతో మహిళా ఆర్టిస్టులకు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని ఈ దేవర విలన్ ఖండించాడు.
సైఫ్ అలీ ఖాన్ కామెంట్లు

సైఫ్ అలీ ఖాన్ కామెంట్లు వైరల్ గా మారాయి. సినిమా పరిశ్రమలో వేతన సమానత్వంపై తన కామెంట్లతో మరో చర్చకు తెరతీశాడు. ఇటీవల తన సోదరి సోహా అలీ ఖాన్ హోస్ట్ చేసిన పాడ్కాస్ట్లో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడాడు. బాలీవుడ్లో లింగ వేతన వ్యత్యాసంపై చాలా కాలంగా జరుగుతున్న చర్చను నటుడు ప్రస్తావించాడు. అందరికీ రెమ్యునరేషన్ పరంగా న్యాయంగా వ్యవహరించాలని సైఫ్ అన్నాడు.
బాక్సాఫీస్ లెక్కలతో
బాలీవుడ్లో ఈక్వెల్ రెమ్యునరేషన్ పై సైఫ్ అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. తన సిస్టర్ సోహా అలీ ఖాన్, ఆమె భర్త కునాల్ ఖేముతో కలిసి హోస్ట్ చేసిన పాడ్ కాస్ట్ లో సైఫ్ పాల్గొన్నాడు. సమాన స్థాయి కలిగిన నటులు ఒకే రెమ్యునరేషన్ పొందాలని తాను భావిస్తున్నట్లు సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. అయితే సినిమా బిజినెస్ లో వ్యవహారం మొత్తం బాక్సాఫీస్ లెక్కలతో ముడిపడి ఉంటుందని సైఫ్ అన్నాడు.
థియేటర్లో ఆడియన్స్
‘‘ఒకే రేంజ్ లో ఉన్న నటులకు ఒకే రకమైన రెమ్యునరేషన్ ఇవ్వాలి. అయితే ఇందులో బిజినెస్ లెక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. మీరు థియేటర్లలో ఆడియన్స్ నింపగలిగే దాన్ని బట్టి రెమ్యునరేషన్ లెక్కలు ఆధారపడి ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారు’’ అని సైఫ్ పేర్కొన్నాడు.
అమ్మాయి అని కాదు
‘‘స్టార్ డమ్ ఆధారంగా అందరికీ ఒకే రకంగా రెమ్యునరేషన్ ఉండాలి. అమ్మాయిలు అని తేడా చూపొద్దు. ఇందులో లింగ వివక్ష ఉండకూడదు. అమ్మాయిలు అని చెప్పి తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వకూడదు. థియేటర్లలోకి ప్రేక్షకులను వాళ్లు రప్పిస్తున్నారా? లేదా? అనేది చూడాలి’’ అని సైఫ్ అలీ ఖాన్ చెప్పాడు.
దేవరలో విలన్
{{/usCountry}}‘‘స్టార్ డమ్ ఆధారంగా అందరికీ ఒకే రకంగా రెమ్యునరేషన్ ఉండాలి. అమ్మాయిలు అని తేడా చూపొద్దు. ఇందులో లింగ వివక్ష ఉండకూడదు. అమ్మాయిలు అని చెప్పి తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వకూడదు. థియేటర్లలోకి ప్రేక్షకులను వాళ్లు రప్పిస్తున్నారా? లేదా? అనేది చూడాలి’’ అని సైఫ్ అలీ ఖాన్ చెప్పాడు.
దేవరలో విలన్
{{/usCountry}}జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ క్యారెక్టర్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సైఫ్ అడుగుపెట్టాడు. ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. దేవర మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.