Sandeep Reddy Vanga: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఎక్స్ టాక్ వైరల్ గా మారింది. వరంగంలోని మామనూరు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ పూర్తయిందని రేవంత్ రెడ్డి ఎక్స్ లో ప్రకటించారు. దీనికి స్పందించిన సందీప్ రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది.
రేవంత్ రెడ్డి ప్రకటన

వరంగల్ లోని మామనూర్ ఎయిర్ పోర్టు దిశగా కీలక అడుగు పడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తయిందని రేవంత్ రెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు. అందుకోసం రూ.295 కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. ఈ భూమిని ఇండియా ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి అప్పగించినట్లు తెలిపారు.
పేర్లు సూచించాలని
వరంగల్ లో నిర్మాణమయ్యే ఎయిర్ పోర్టుకు పేర్లు సూచించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనికి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా రియాక్టవుతున్నారు. ఎయిర్ పోర్టుకు పేర్లను సూచిస్తున్నారు.
సందీప్ రియాక్షన్
సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా రేవంత్ రెడ్డి పెట్టిన పోస్టుకు స్పందించారు. ‘‘నా సొంతూరు వరంగల్ లో అంతర్జాతీయ విమానాశ్రయం అనే కల నిజం కానుంది. నేను ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు’, ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు’ అనే పేర్లు సూచిస్తా. వరంగల్ వారసత్వం, కల్చరల్ స్పిరిట్ ఉండేలా పేరు పెట్టాలి. ఈ కలను నిజం చేస్తున్నా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు’’ అని సందీప్ పోస్టు పెట్టారు.
సీఎం రిప్లే
{{/usCountry}}సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా రేవంత్ రెడ్డి పెట్టిన పోస్టుకు స్పందించారు. ‘‘నా సొంతూరు వరంగల్ లో అంతర్జాతీయ విమానాశ్రయం అనే కల నిజం కానుంది. నేను ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు’, ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు’ అనే పేర్లు సూచిస్తా. వరంగల్ వారసత్వం, కల్చరల్ స్పిరిట్ ఉండేలా పేరు పెట్టాలి. ఈ కలను నిజం చేస్తున్నా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు’’ అని సందీప్ పోస్టు పెట్టారు.
సీఎం రిప్లే
{{/usCountry}}సందీప్ రెడ్డి వంగా పోస్టుకు రేవంత్ రెడ్డి రిప్లే ఇచ్చారు. ‘దట్ ఈజ్ ది స్పిరిట్’ అని పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి రిప్లే చూసి సందీప్ వంగా సర్ ప్రైజ్ అయినట్లు చెప్పారు.
‘‘నా సినిమా స్పిరిట్ లో సరిగ్గా ‘దట్ ఈజ్ ది స్పిరిట్’ అనే లైన్ రాశా. మీ నుంచి ఈ లైన్ రావడంతో సర్ ప్రైజ్ అయ్యా. సరిగ్గా ఇదే లైన్ రాసిన నేను ఎంతో ఎగ్జైట్ అవుతున్నా. సరైన వ్యక్తి నుంచి వచ్చే కొన్ని పదాలు డిఫరెంట్ గా ఉంటాయి’’ అని సందీప్ వంగా మళ్లీ పోస్టు పెట్టారు.
స్పిరిట్ గురించి
సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్. ఈ సినిమాను 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఆ దిశగా మూవీ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు.