దురంధర్ తో కలెక్షన్ల పోరుకు సై అంటోంది యానిమల్ మూవీ. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా కలెక్షన్లను దురంధర్ దాటేసింది. దీంతో దురంధర్ ను మళ్లీ వెనక్కి నెట్టేలా యానిమల్ డైరెక్టర్ సందీప్ పెద్ద ప్లాన్ వేశాడు. యానిమల్ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు.
జపాన్ లో యానిమల్

అధికారిక ప్రకటన వచ్చేసింది! సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమా రెండేళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈసారి ఈ చిత్రం జపాన్ లో మాత్రమే రిలీజ్ కానుంది. ఇటీవల కాలంలో భారతీయ సినిమాలకు జపాన్లో మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో యానిమల్ ను అక్కడ రిలీజ్ చేస్తున్నారు.
రిలీజ్ డేట్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంతో రణ్బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ జపాన్ లో భారీగా రిలీజ్ కానుంది. 2026, ఫిబ్రవరి 13న అక్కడి థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలలో ఒకరైన భద్రకాళి ఫిల్మ్స్ ప్రకటించింది.
"కోనో ఒటోకో వా డరేనిమో టోమెరెనై" (ఈ వ్యక్తిని ఎవరూ ఆపలేరు). అత్యంత చర్చనీయాంశమైన, వివాదాస్పదమైన, మరపురాని సినిమాటిక్ అనుభవం జపాన్కు రానుంది. యానిమల్ ఫిబ్రవరి 13, 2026న జపాన్ థియేటర్లలో విడుదల అవుతుంది" అని పోస్టు చేశారు.
యానిమల్ కలెక్షన్లు
2023 డిసెంబర్ రిలీజైన యానిమల్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. భారతదేశంలో రూ.553 కోట్లు నెట్ వసూలు చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.915 కోట్లు గ్రాస్ను రాబట్టింది. అత్యధిక వసూళ్లు సాధించిన 9వ భారతీయ చిత్రంగా నిలిచింది. కానీ ఈ రికార్డును ఇప్పుడు దురంధర్ బ్రేక్ చేసింది.
రూ.1000 కోట్ల దిశగా
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5, 2025న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఈ మూవీ బుధవారం (డిసెంబర్ 25) వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.935 కోట్ల గ్రాస్ సాధించినట్లు సక్నిల్క్ తెలిపింది. ఇది రూ.1000 కోట్ల దిశగా సాగుతోంది. ఈ క్రమంలోనే యానిమల్ రూ.915 కోట్ల కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసింది దురంధర్.
యానిమల్ మళ్లీ
{{/usCountry}}రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5, 2025న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఈ మూవీ బుధవారం (డిసెంబర్ 25) వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.935 కోట్ల గ్రాస్ సాధించినట్లు సక్నిల్క్ తెలిపింది. ఇది రూ.1000 కోట్ల దిశగా సాగుతోంది. ఈ క్రమంలోనే యానిమల్ రూ.915 కోట్ల కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసింది దురంధర్.
యానిమల్ మళ్లీ
{{/usCountry}}దురంధర్ దక్కించుకున్న స్థానాన్ని యానిమల్ తిరిగి సొంతం చేసుకోవాని చూస్తోంది. యానిమల్ నిర్మాతలు ఈ సినిమా జపాన్ బాక్సాఫీస్ వసూళ్లతో రూ.1000 కోట్ల మార్కును చేరుకుంటుందని ఆశిస్తున్నారు. ఇటీవల కాలంలో జపాన్లో భారతీయ చిత్రాలు మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ అక్కడ 2.4 బిలియన్ యెన్ లు (రూ.150 కోట్లకు పైగా) వసూలు చేయగా, కేజీఎఫ్ చాప్టర్ 2 ఏమో 1.1 బిలియన్ యెన్ లు (రూ.70 కోట్లు) రాబట్టింది. యానిమల్ కూడా ఈ రెండు సినిమాల్లాగే జపాన్ లో మంచి ప్రదర్శన చేస్తే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది.