తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ కూతురు నుంచి బెదిరింపులు- 2 కోట్లు ఇచ్చి రిలీజ్ చేయాలని నోటీసులు- షేక్ సంచలన డిమాండ్స్!

తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ హిందీ సినిమా ఓ రోమియో. షాహిద్ కపూర్ హీరోగా చేసిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదంలో ఇరుక్కుంది. ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కుటుంబం నుంచి ఓ రోమియో మూవీని నిలిపివేయాలంటూ వార్నింగ్ వచ్చింది. హుస్సేన్ ఉస్తారా కుమార్తె లీగల్ నోటీసులు పంపండం సంచలనంగా మారింది.

Published on: Jan 13, 2026 9:10 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తమన్నా భాటియా బాలీవుడ్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ఓ రోమియో. ఈ సినిమాలో హీరోగా షాహిద్ కపూర్ చేశాడు.

తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ కూతురు నుంచి బెదిరింపులు- 2 కోట్లు ఇచ్చి రిలీజ్ చేయాలని నోటీసులు- షేక్ సంచలన డిమాండ్స్!
తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ కూతురు నుంచి బెదిరింపులు- 2 కోట్లు ఇచ్చి రిలీజ్ చేయాలని నోటీసులు- షేక్ సంచలన డిమాండ్స్!

రూ. 2 కోట్లు ఇస్తేనే విడుదల!

అయితే, వెర్సటైల్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ రోమియో’ (O Romeo). ఇటీవల విడుదలైన ఓ రోమియో టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు అనూహ్యంగా అండర్‌ వరల్డ్ వివాదంలో చిక్కుకుంది.

గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ నుంచి బెదిరింపులు

ముంబైకి చెందిన దివంగత గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా ఫ్యామిలీ నుంచి ఓ రోమియో చిత్రబృందానికి బెదిరింపులు వచ్చాయి. ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కుమార్తె సనోబర్ షేక్ ఓ రోమియో చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా, దర్శకుడు విశాల్ భరద్వాజ్‌లకు నోటీసులు పంపడం ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

సంచలన డిమాండ్స్

ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ షేక్ (హుస్సేన్ ఉస్తారా) కుమార్తె సనోబర్ షేక్ తన లీగల్ నోటీసులో సంచలన డిమాండ్లు చేశారు. ఈ సినిమాలో తన తండ్రి హుస్సేన్ ఉస్తారా పాత్రను తప్పుగా చూపిస్తూ, తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆమె ఆరోపించారు.

రూ. 2 కోట్లు ఇస్తేనే విడుదల!

ఇందుకు పరిహారంగా రూ. 2 కోట్లు చెల్లించాలని, తన అభ్యంతరాలన్నీ తీరే వరకు ఓ రోమియో సినిమా విడుదలను నిలిపివేయాలని సనోబర్ షేక్ డిమాండ్ చేశారు. అయితే, ఈ నోటీసులపై చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

హుస్సేన్ ఉస్తారా - దావూద్ ఇబ్రహీం వైరం నేపథ్యమా?

ముంబై అండర్‌ వరల్డ్ చరిత్రలో హుస్సేన్ ఉస్తారా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అప్పట్లో అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఆయనకు తీవ్రమైన వైరం ఉండేది. ఈ సినిమా టీజర్‌లో షాహిద్ కపూర్ గన్‌మెన్‌గా కనిపిస్తుండటం, భారీ యాక్షన్, హింసాత్మక సన్నివేశాలు ఉండటంతో.. ఇది హుస్సేన్ ఉస్తారా జీవితం ఆధారంగానే తెరకెక్కినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా ధృవీకరించలేదు.

విశాల్ - షాహిద్ హ్యాట్రిక్ మూవీ

‘కమీనే’, ‘హైదర్’ వంటి క్లాసిక్ హిట్ సినిమాల తర్వాత విశాల్ భరద్వాజ్ - షాహిద్ కపూర్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్రాంత్ మాస్సే, నానా పటేకర్, అవినాష్ తివారీ, తమన్నా భాటియా, దిశా పటానీ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఫిబ్రవరి 13న రిలీజ్

ఈ వివాదాల మధ్య ‘ఓ రోమియో’ అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, ఓ రోమియో సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది.