ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తన మధురమైన గొంతుతో దశాబ్దాలుగా కోట్లాది మంది సంగీత ప్రియులను అలరిస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో ఒక పాట హిట్టా కాదా అనేది యూట్యూబ్ వ్యూస్, ఇన్స్టాగ్రామ్ లైకులను బట్టి లెక్కేస్తున్నారు.

అయితే, శ్రేయా ఘోషల్ మాత్రం దీనితో ఏకీభవించడం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రేయా ఘోషల్ పాట అసలైన విజయం ఎక్కడ ఉంటుందో తనదైన శైలిలో వివరించారు.
అవన్నీ కొనుక్కోవచ్చు.. కానీ ప్రేక్షకుల ప్రేమను కాదు!
"ఈ రోజుల్లో లైకులు, వ్యూస్ అనేవి చాలా మోసపూరితమైనవి. ఎందుకంటే డబ్బు ఉంటే దేన్నైనా కొనేయొచ్చు (హర్ చీజ్ ఖరీదీ జా సక్తీ హై). కానీ, నేను ఒక కచేరీలో (కాన్సర్ట్) పాడుతున్నప్పుడు.. అక్కడి ప్రేక్షకులు నాతో కలిసి ఆ పాటను పాడుతుంటే, ఆ పాటను మనస్ఫూర్తిగా ఓన్ చేసుకుంటే.. అదే ఆ పాట సాధించిన అసలైన విజయం" అని శ్రేయా ఘోషల్ పేర్కొన్నారు.
మొదటిసారి పాడిన పాటను కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని, మళ్లీ పాడమని కోరినప్పుడే ఒక కళాకారుడికి దక్కే అతిపెద్ద గౌరవం అని శ్రేయా ఘోషల్ చెప్పుకొచ్చారు. కచేరీలలో కనిపించే ఆ 'మల్టిప్లిసిటీ ఎఫెక్ట్' మాత్రమే పాట సక్సెస్కు నిజమైన కొలమానం అని శ్రేయా వివరించారు.
సోషల్ మీడియా మ్యాజిక్
లైకులు, వ్యూస్ వెంట తాను పడనని చెబుతూనే, సోషల్ మీడియా వల్ల సంగీత రంగంలో వచ్చిన మార్పులను శ్రేయా ఘోషల్ ప్రశంసించారు. "సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. 2013లో వచ్చిన 'బేషరమ్' సినిమాలోని 'దిల్ కా జో హాల్ హై' పాట పదేళ్ల తర్వాత ఇప్పుడు ట్రెండ్ అవ్వడం, అలాగే 'సూపర్ 30'లోని 'జుగ్రాఫియా' పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదంతా సోషల్ మీడియా మ్యాజిక్" అని ఆమె కొనియాడారు.
ఇప్పుడు సంగీతం కేవలం కొందరి చేతుల్లో లేదని, ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వల్ల శ్రోతలే ఏది మంచి సంగీతమో నిర్ణయించే ప్రజాస్వామ్యం ఏర్పడిందని శ్రేయా ఘోషల్ తెలిపారు.
‘అన్స్టాపబుల్’ టూర్: ఒక వ్యక్తిగత ప్రయాణం
{{/usCountry}}ఇప్పుడు సంగీతం కేవలం కొందరి చేతుల్లో లేదని, ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వల్ల శ్రోతలే ఏది మంచి సంగీతమో నిర్ణయించే ప్రజాస్వామ్యం ఏర్పడిందని శ్రేయా ఘోషల్ తెలిపారు.
‘అన్స్టాపబుల్’ టూర్: ఒక వ్యక్తిగత ప్రయాణం
{{/usCountry}}త్వరలో ప్రారంభం కాబోతున్న 'ది అన్స్టాపబుల్ టూర్' (The Unstoppable Tour) గురించి శ్రేయ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. "గత మూడు నాలుగేళ్లుగా చేసిన 'ఆల్ హార్ట్స్ టూర్' అద్భుతంగా సాగింది. దాదాపు 50 నగరాల్లో షోలు అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. అయితే, ఈసారి ఏదో కొత్తగా చేయాలని భావించాం. అందుకే 'అన్స్టాపబుల్' టూర్ను సరికొత్తగా డిజైన్ చేశాం" అని శ్రేయా ఘోషల్ తెలిపారు.
సరికొత్త అనుభూతి
"ఇందులో నేను గాయనిగా ఎదిగిన ప్రయాణం, నా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను పాటల ద్వారా ప్రేక్షకులకు వివరిస్తాను. ఇది నా వ్యక్తిగత ప్రయాణానికి సంబంధించిన కథ" అని స్టార్ సింగర్ శ్రేయా ఘోషనల్ వెల్లడించారు. ఈ టూర్లో ప్రేక్షకులకు అస్సలు ఊహించని సరికొత్త అనుభూతి కలుగుతుందని ఆమె హామీ ఇచ్చారు.