Singer Sona Mohapatra Criticizes Music Industry: బాలీవుడ్లో లింగ వివక్ష, మహిళలను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూపించడంపై ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా మాట్లాడే సింగర్ సోనా మోహపాత్ర తాజాగా మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు.
మహిళా గాయనీల ప్రాధాన్యత

కేవలం సినిమాల్లోనే కాదు, సంగీత ప్రపంచంలోనూ మహిళల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతోందని సోనా మోహపాత్ర మండిపడ్డారు. ప్రత్యేకించి ప్రేమ, విరహ గీతాలలో (Heartbreak songs) మహిళా గాయనీలకు ఇచ్చే ప్రాధాన్యత నానాటికీ తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేరళలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో (Literature Festival) సోనా మోహపాత్ర ఈ వ్యాఖ్యలు చేశారు. అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛకు కేరళ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని, అందుకే ఇక్కడ ఈ నిజాలు మాట్లాడుతున్నానని ఆమె పేర్కొన్నారు.
కొత్తగా లేడి స్టార్ సింగర్స్
గత రెండు దశాబ్దాలుగా బాలీవుడ్లో వస్తున్న మార్పులను గమనిస్తే, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్ లాంటి కొద్దిమంది మినహా కొత్తగా లేడి స్టార్ సింగర్లు రాకపోవడానికి ఈ వివక్షే కారణమని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదే తరహా ధోరణి సౌత్ ఇండస్ట్రీలోనూ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుందని కొందరు గుర్తుచేస్తున్నారు.
డ్యూయెట్ పాటల్లో చివరి కోరస్కే పరిమితమా?
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో క్లిప్లో సోనా తన చేదు అనుభవాలను పంచుకున్నారు. బాలీవుడ్లో బాధను వ్యక్తపరిచే హార్ట్ బ్రేక్ సాంగ్స్ అన్నీ కేవలం మగవారికే రిజర్వ్ చేశారని సోనా మోహపాత్ర ఆరోపించారు. ప్రస్తుత కాలంలో కేవలం మగవారికి మాత్రమే హృదయ విదారక బాధలు, ప్రేమ భావనలు ఉంటాయా అని ప్రశ్నించారు.
తను పాడిన డ్యూయెట్ పాటల్లో ఎక్కువ శాతం కేవలం ముగింపు కోరస్ పాడటానికే పిలిచేవారని చెప్పారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘రాయీస్’ (2017) సినిమాలోని ‘జాలిమా’ అనే పాట రికార్డింగ్ సమయాన్ని సోనా ఈ సందర్భంగా ఉదహరించారు.
{{/usCountry}}తను పాడిన డ్యూయెట్ పాటల్లో ఎక్కువ శాతం కేవలం ముగింపు కోరస్ పాడటానికే పిలిచేవారని చెప్పారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘రాయీస్’ (2017) సినిమాలోని ‘జాలిమా’ అనే పాట రికార్డింగ్ సమయాన్ని సోనా ఈ సందర్భంగా ఉదహరించారు.
{{/usCountry}}"జాలిమా పాటలో ముఖ్డా, అంతరా.. ఇలా అన్నీ మగ గాయకుడే పాడేశారు. ఆ పాట పాడుతున్న అర్జిత్ సింగ్ తప్పేమీ లేదు, ఆయన గొప్ప ఆర్టిస్ట్. కానీ ఆడవాళ్ల గొంతు కేవలం పాట చివర్లోనే ఎందుకు రావాలి? ఆ పాట కంపోజ్ చేసిన ప్రీతమ్ను (సంగీత దర్శకుడు) నేను ఒకటే అడిగాను.. ఆ మగాడు తనను తానే ప్రేమించుకుంటున్నాడా? ఇదెలాంటి డ్యూయెట్ సాంగ్ అవుతుంది?" అని సోనా మోహపాత్ర ప్రశ్నించారు.
మహిళా స్టార్ సింగర్స్ ఎందుకు పుట్టడం లేదు?
సదరు 'జాలిమా' గీతాన్ని అర్జిత్ సింగ్తో పాటు హర్ష్దీప్ కౌర్ ఆలపించగా, అది షారుఖ్ ఖాన్, మాహిరా ఖాన్లపై పిక్చరైజ్ చేశారు. కేవలం వేదికపైనే కాకుండా, ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కామెంట్ సెక్షన్ ద్వారా కూడా ఆమె తన చర్చను కొనసాగించారు.
ఇది కేవలం పాటల గురించిన విషయం కాదు, ఇండస్ట్రీలో మహిళల ప్రాతినిధ్యం (Representation) గురించిన చర్చ అని స్పష్టం చేశారు. ఒక పరిశ్రమ ఐకానిక్ మహిళా కథనాలను, భావోద్వేగాలను సృష్టించడం ఆపేస్తే, కాలక్రమేణా అక్కడ మహిళా స్టార్ సింగర్స్ పుట్టడం కూడా ఆగిపోతుందని హెచ్చరించారు. భారత దేశంలో దీని గురించి ఎవరు పట్టించుకుంటారు అని సోనా మోహపాత్ర నిలదీశారు.
రాయడమే తగ్గించేసిందని
"మహిళలు ఎప్పుడూ విరహ గీతాలు పాడలేదని నా ఉద్దేశం కాదు. బాలీవుడ్ అలాంటి పాటలు రాయడమే తగ్గించేసిందని నా పాయింట్. గత రెండు దశాబ్దాలుగా పెద్ద పెద్ద రొమాంటిక్, హార్ట్బ్రేక్ సాంగ్స్లో 80 నుంచి 90 శాతం కేవలం మగ గాయకులకే ఇస్తూ పోతే, మగవారితో సమానంగా మహిళా మ్యూజిక్ స్టార్లు ఎందుకు రావడం లేదని ఆశ్చర్యపోవడంలో అర్థం లేదు. ఇది ఒక వ్యవస్థ లోపం, బాధితుల సమస్య కాదు. పాటలను లెక్కబెట్టి అప్పుడు మాట్లాడదాం" అని సోనా మోహపాత్ర గట్టిగా సమర్థించుకున్నారు.
ఎలాంటి రిస్క్ తీసుకోకుండా
బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా కేవలం సేఫ్ జోన్లో సాగిపోతోందని, అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని సోనా మోహపాత్ర ముగించారు. ప్రస్తుతం సోనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.