...
...
Next Story

పని మనుషుల కోసమే 51 కోట్ల ఫ్లాట్లు కొన్న హీరోయిన్ సోనమ్ కపూర్- వ్యతిరేకించిన లండన్ వాసులు- బెదిరిస్తున్నారంటూ ఆవేదన!

Sonam Kapoor Anand Ahuja Buys ₹51 Cr Flats For Servants: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా లండన్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో వందల కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారు. అయితే, తమ పని మనుషుల వసతి కోసం కొన్న 51 కోట్ల ఫ్లాట్ల విషయంలో లండన్ వాసులతో వివాదం తలెత్తింది.

Published on: May 24, 2026, 07:35:59 IST
Advertisement

Sonam Kapoor Anand Ahuja Buys 51 Cr Flats For Servants: బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్, స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఆమె భర్త, బిలియనీర్ బిజినెస్‌మెన్ ఆనంద్ అహుజా లండన్ నగరంలో అత్యంత వైభోగంగా జీవిస్తున్నారు. యూకేలోనే అత్యంత ఖరీదైన, లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ అయిన 'నాటింగ్ హిల్' ప్రాంతంలో ఈ దంపతులకు భారీ ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది.

పని మనుషుల కోసమే 51 కోట్ల ఫ్లాట్లు కొన్న హీరోయిన్ సోనమ్ కపూర్- వ్యతిరేకించిన లండన్ వాసులు- బెదిరిస్తున్నారంటూ ఆవేదన!
పని మనుషుల కోసమే 51 కోట్ల ఫ్లాట్లు కొన్న హీరోయిన్ సోనమ్ కపూర్- వ్యతిరేకించిన లండన్ వాసులు- బెదిరిస్తున్నారంటూ ఆవేదన!

మూడేళ్ల క్రితం వీరు అక్కడ ఒక పాత బంగళాను ఏకంగా 21 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 270 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేశారు. దానికి అదనంగా మరో 4.7 మిలియన్ పౌండ్లు (రూ. 60.4 కోట్లు) ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇద్దరు పిల్లలు వాయు, రుద్రలోక్‌లతో కలిసి సోనమ్ కపూర్ దంపతులు ఇక్కడే నివసిస్తున్నారు.

పని మనుషుల కోసం రూ. 51 కోట్ల ఫ్లాట్లు?

ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ లండన్‌లో ఒక సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. తమ బంగళాకు సమీపంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఐదు ఫ్లాట్లను వీరు దాదాపు 4 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 51.4 కోట్లు) కొనుగోలు చేసినట్లు బ్రిటీష్ మీడియా డెయిలీ మెయిల్ కథనం ప్రచురించింది.

అయితే, ఈ ఫ్లాట్లను తమ ఇంట్లో పనిచేసే సిబ్బందికి (Servant Quarters) కేటాయించేందుకు కొన్నారనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో ఆ బిల్డింగ్‌లో నివసించే మిగతా నివాసితులు సోనమ్ దంపతులపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భయాందోళనలో స్థానికులు.. బెదిరింపుల ఆరోపణలు

"వారు అంగబలం, అర్థబలం ఉన్న శక్తివంతులు కావడంతో, మేము నోరు విప్పడానికి భయపడేలా చేస్తున్నారు. ఇక్కడ మేమంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటున్నాం. కానీ, కొంతమంది బిలియనీర్లు మా నివాస ప్రాంతాన్ని వారి ఆటస్థలంగా మార్చేస్తున్నారు. మేము అభ్యంతరం చెబితే, ఈ ఫ్లాట్లను 'సోషల్ హౌసింగ్' (ప్రభుత్వ సాయంతో పేదలకు ఇచ్చే ఇళ్లు) కింద ఇస్తామని విచిత్రమైన బెదిరింపులకు దిగుతున్నారు. తెర వెనుక ఉండి మా ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు" అని ఒక స్థానిక నివాసి ఆరోపించారు.

ప్రతినిధుల వివరణ.. ఆనంద్ అహుజా నేపథ్యం

ఈ వివాదంపై సోనమ్ కపూర్ ప్రతినిధులు స్పందించారు. ఈ కొనుగోళ్లతో కపూర్ కుటుంబానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం భవిష్యత్తు పెట్టుబడి (Investment) కోసమే ఆయా ఫ్లాట్లను సదరు కంపెనీ కొనుగోలు చేసిందని వెల్లడించారు. సోనమ్ కపూర్ దంపతులకు లండన్‌లోనే కాకుండా ఢిల్లీ, ముంబైలలో కూడా సొంత ఇళ్లు ఉన్నాయి.

సోనమ్ భర్త ఆనంద్ అహుజా భారతదేశంలోని ప్రముఖ దుస్తుల ఎగుమతి సంస్థ 'షాహీ ఎక్స్‌పోర్ట్స్' బిలియనీర్ కుటుంబానికి చెందినవారు. ఆయన 'భానె' (Bhaane) బ్రాండ్‌కు సీఈఓగా వ్యవహరించడంతో పాటు 'వెజ్‌నాన్‌వెజ్' స్నీకర్ స్టోర్ కో-ఫౌండర్‌గా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు.

సోనమ్ కపూర్‌ దంపతులపై ఆరోపణలు

ఇదిలా ఉంటే, 2018లో పంజాబీ సంప్రదాయంలో వివాహం చేసుకున్న సోనమ్ కపూర్-ఆనంద్ అహుజా జంటకు ఈ ఏడాది మార్చిలోనే రెండో సంతానంగా రుద్రలోక్ జన్మించాడు. వ్యాపార సామ్రాజ్యం ఎంత పెద్దదైనా, లండన్ నివాసితుల నుంచి వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe