...
...
Next Story

ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ మరో సినిమా- పెంపుడు కుక్కను వెతుకుతూ మాఫియాలోకి- మలయాళ కామెడీ థ్రిల్లర్- 8.5 ఐఎండీబీ రేటింగ్

ఈ ఏడాది వరుస సినిమాలతో జోరుమీదుంది అనుపమ పరమేశ్వరన్. ఆమె నటించిన మరో మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మలయాళ కామెడీ థ్రిల్లర్ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది.

Published on: Nov 23, 2025, 18:08:18 IST
Advertisement

ఓటీటీలోకి మరో మలయాళ కామెడీ థ్రిల్లర్ రానుంది. అనుపమ పరమేశ్వరన్, శరఫుద్దీన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ‘ది పెట్ డిటెక్టివ్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడన్నది ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. ఈ మలయాళ కామెడీ థ్రిల్లర్ కు ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉంది.

ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ

ఓటీటీలోకి మలయాళ కామెడీ థ్రిల్లర్ (Instagram/sharaf_u_dheen)
ఓటీటీలోకి మలయాళ కామెడీ థ్రిల్లర్ (Instagram/sharaf_u_dheen)

శరఫుద్దీన్, అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మలయాళ చిత్రం 'ది పెట్ డిటెక్టివ్' ఈ నవంబర్‌లోనే ఓటీటీలో విడుదల కానుంది. గందరగోళ హాస్యం, వేగవంతమైన యాక్షన్‌కు పేరుగాంచిన ఈ చిత్రం నవంబర్ 28 నుండి జీ5 ఓటీటీలో ప్రసారం కానుంది. 'ది పెట్ డిటెక్టివ్' ఇప్పటికే దాని సరదా కథాంశం, ఉత్సాహభరితమైన నటనతో ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టుకుంది.

ది పెట్ డిటెక్టివ్ కథ

ప్రణీష్ విజయన్ డైరెక్షన్ లో వచ్చిన ది పెట్ డిటెక్టివ్ ఓ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్. టోనీ జోస్ (శరఫుద్దీన్) ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. తన తండ్రి ప్రారంభించిన ఆ ఏజెన్సీ నష్టాల్లో ఉంటుంది. టోనీ పెద్ద కేసు విచారణ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ కేసులు రావు. మరోవైపు కైకేయి (అనుపమ పరమేశ్వరన్)ను లవ్ చేస్తాడు టోనీ.

లవ్ కోసం

కైకేయి, టోనీ ప్రేమించుకుంటారు. కానీ ఆర్మీ ఆఫీసర్ అయిన కైకేయి తండ్రి తన కూతురిని మంచి ఉద్యోగం లేదా ఆర్మీలో ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే తన లవ్ గెలిపించుకోవడం కోసం గొప్ప డిటెక్టివ్ అని నిరూపించుకుంటానని టోనీ అనుకుంటాడు. తప్పిపోయిన పెంపుడు జంతువు కుక్కను వెతికిపెట్టే కేసు తీసుకుంటాడు. కానీ అది చివరకు అంతర్జాతీయ మాఫియాలోకి దారితీస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది ది పెట్ డిటెక్టివ్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

అక్టోబర్ 16, 2025న థియేటర్లలో రిలీజైన మలయాళ కామెడీ థ్రిల్లర్ ది పెట్ డిటెక్టివ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రంలో శరఫుద్దీన్, అనుపమ పరమేశ్వరన్, వినాయకన్, వినయ్ ఫోర్ట్, శ్యామ్ మోహన్, జోమోన్ జ్యోతిర్ తదితరులు నటించారు. శరఫుద్దీన్ ఈ చిత్రంతో నిర్మాతగా కూడా అరంగేట్రం చేశాడు. ఇది ఇండియాతో పాటు యూకే, ఐర్లాండ్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, కువైట్, బహ్రెయిన్ వంటి కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe