...
...
Next Story

అఖండ 2, మిరాయ్‌ల‌ను దాటేసిన రాజా సాబ్‌-మూడు రోజుల్లో ప్ర‌భాస్ సినిమా క‌లెక్ష‌న్లు ఎన్ని కోట్లంటే?

ది రాజా సాబ్ జోరు కాస్త తగ్గింది. బలమైన ఓపెనింగ్ సాధించిన ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూడో రోజు వసూళ్లు తగ్గాయి. అయినా అఖండ 2, మిరాయ్ లైఫ్ టైమ్ కలెక్షన్లను రాజా సాబ్ మూడు రోజుల్లో దాటేసింది.

Published on: Jan 12, 2026, 10:18:03 IST
Advertisement

బాక్సాఫీస్ దగ్గర ది రాజా సాబ్ కలెక్షన్ల బండి మెల్లగా సాగుతోంది. బలమైన ఓపెనింగ్ వసూళ్లు తర్వాత ఈ మూవీ జోరు కాస్త తగ్గింది. ఈ హారర్ థ్రిల్లర్ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే అఖండ 2, మిరాయ్ లైఫ్ టైమ్ కలెక్షన్లనూ దాటింది.

ది రాజా సాబ్ కలెక్షన్లు

ది రాజా సాబ్ లో ప్రభాస్
ది రాజా సాబ్ లో ప్రభాస్

ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజా సాబ్. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ రిలీజైంది. బంపర్ స్టార్ట్ తర్వాత బాక్సాఫీస్ వద్ద రాజా సాబ్ కాస్త స్లో అయింది. ఈ చిత్రం దాని ఓపెనింగ్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగారూ. 150 కోట్ల వసూళ్లను దాటింది. ఇది సంక్రాంతి నాటికి రూ.200 కోట్ల మార్కును దాటుతుందని భావిస్తున్నారు.

రూ.158 కోట్లు

రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర మూడు రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.158 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ది రాజా సాబ్ దాని ప్రారంభ రోజు, శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు సంపాదించింది. అయితే శనివారం ఈ చిత్రం విదేశాలలో క్రాష్ అయింది. ఇండియాలో 51% తగ్గుదలను నమోదు చేసింది. ఆదివారం (జనవరి 11) దేశీయ వసూళ్లు మరో 20 శాతం తగ్గాయి. ఆదివారం నాటికి ది రాజా సాబ్ ఇండియాలో రూ.109 కోట్ల నెట్ (రూ.130 కోట్ల గ్రాస్) అందుకుంది.

ఓవర్సీస్ లో ఇలా

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 బాక్సాఫీస్ వద్ద రూ.128 కోట్లకు పైగా వసూలు చేసింది. మరోవైపు తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ రూ.150 కోట్లను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రాజా సాబ్ మూడు రోజుల్లోనే ఈ సినిమాలను దాటేసింది.

రాజా సాబ్ గురించి

మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేసిన మూవీ ది రాజా సాబ్. ప్రభాస్ కెరీర్ లో ఇది ఫస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్. చాలా కాలం తర్వాత రెబల్ స్టార్ కామెడీ, డ్యాన్స్ తో ఇరగదీశాడు. ఈ చిత్రంలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్ తదితరులు నటించారు. ఈ చిత్రం విమర్శకుల నుండి ఎక్కువగా ప్రతికూల సమీక్షలు అందుకుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe