Gundu Sudarshan About Mr Work From Home Movie And Agriculture: తెలుగులో సీనియర్ నటుడుగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు గుండు సుదర్శన్. ఎన్నో చిత్రాల్లో తన కామెడీ టైమింగ్తో అలరించిన గుండు సుదర్శన్ నటించిన లేటెస్ట్ టాలీవుడ్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.
చాలా గ్రాండ్గా రిలీజ్

ఈ సినిమాలో హీరో త్రిగుణ్, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ జోడీగా నటించారు. మధుదీప్ చెలికాని కథ, దర్శకత్వం వహించిన ఈ సినిమాను లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై అరవింద్ మండెం నిర్మించారు. ఇవాళ (మే 15) థియేటర్లలో చాలా గ్రాండ్గా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ విడుదల అయింది.
మిస్టర్ వర్క్ ఫ్రమ్ పైసా వసూల్ ట్రైలర్ లాంచ్
అయితే, రిలీజ్కు రెండు రోజుల ముందు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ పైసా వసూల్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ మధుదీప్, వ్యవసాయం గురించి సీనియర్ నటుడు గుండు సుదర్శన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది
గుండు సుదర్శన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమాతో నాకు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ఇది అగ్రికల్చర్కు సంబంధించిన సబ్జెక్ట్. తన కన్నీటితో ఈ పంట పండించాడు దర్శకుడు. ఇలాంటి మంచి సినిమా తీయడానికి చాలా సంఘర్షణ పడ్డారు" అని చెప్పారు.
చాలా మంచి ఫీల్గుడ్ మూవీ
"తప్పకుండా ఈ సినిమాను అందరూ సపోర్ట్ చేసి టీమ్ అందరికీ ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి ఫీల్గుడ్ మూవీ. ఇది 100 శాతం ఎంటర్టైనర్. తప్పకుండా అందరూ థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను" అని గుండు సుదర్శన్ కోరారు.
ఆ మాట ఎందుకు చెప్పారో ఈరోజు అర్థమైంది
{{/usCountry}}"తప్పకుండా ఈ సినిమాను అందరూ సపోర్ట్ చేసి టీమ్ అందరికీ ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి ఫీల్గుడ్ మూవీ. ఇది 100 శాతం ఎంటర్టైనర్. తప్పకుండా అందరూ థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను" అని గుండు సుదర్శన్ కోరారు.
ఆ మాట ఎందుకు చెప్పారో ఈరోజు అర్థమైంది
{{/usCountry}}ఇదే ఈవెంట్లో డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. జీవితంలో ఏం చేసినా పెద్దవాళ్లను గౌరవించాలని చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు. ఆయన ఎందుకు ఆ మాట చెప్పారో ఈరోజు నాకు అర్థమైంది. మా నాన్న చెప్పిన మాట ఈరోజు నిజమైంది" అని అన్నారు.
ఓపెన్ మైండ్తో చూస్తే నచ్చుతుంది
"రాందాస్ గారు లేకపోతే ఈ సినిమా బయటకు వచ్చి ఇంతమందిని అలరించేది కాదు. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. సినిమా ఓపెన్ మైండ్తో చూస్తే కచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఇది సమ్మర్ సినిమా. అందరూ ఎంజాయ్ చేసే సినిమా" అని దర్శకుడు మధుదీప్ తెలిపారు.
మనసుల్లో నిలిచిపోతుంది
"ఈ సినిమాను ఆదరిస్తే ఒక మంచి సినిమాను సమాజానికి అందించిన వాళ్లం అవుతాం. ఇది కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా మీ అందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే 15న మీరందరూ థియేటర్స్లో చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు" అని మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ డైరెక్టర్ మధుదీప్ చెలికాని పేర్కొన్నారు.