నటి త్రిష కృష్ణన్ ఆదివారం (మార్చి 8) రాత్రి 'ఎక్స్' వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆమె మాటల్లోని పదును చూస్తుంటే అది తన 'పొన్నియిన్ సెల్వన్' కో-స్టార్ ఆర్. పార్థిబన్ను ఉద్దేశించినదేనని స్పష్టమవుతోంది. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది వాగొద్దు అన్నట్లుగా ఆమె కామెంట్స్ ఉన్నాయి. తాను కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలన్న కామెంట్స్ కు ఇది కౌంటర్ అని భావిస్తున్నారు.
త్రిష ఏమన్నదంటే?

ఇటీవల జరిగిన ఒక అవార్డు వేడుకలో తన గురించి చేసిన వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించింది. "ఒక కార్యక్రమ నిర్వాహకులు నాకు తెలిపిన సమాచారం ప్రకారం.. ఒక వ్యక్తి తన అసిస్టెంట్ ద్వారా కోరడం వల్లే చివరి నిమిషంలో నా పేరును, ఫోటోను ఆ ఈవెంట్లో చేర్చారు" అని ఆమె పేర్కొంది.
అనంతరం తనపై వచ్చిన కామెంట్లకు కౌంటర్ ఇస్తూ.. "చేతిలో మైక్రోఫోన్ ఉన్నంత మాత్రాన చేసే కామెంట్స్ తెలివైనవిగానో లేదా కామెడీగానో మారిపోవు. అది కేవలం మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపించేలా చేస్తుంది. అవతలి వ్యక్తి గురించి తెలియకుండా వాడే అసభ్యకర పదజాలం.. ఆ వ్యక్తి గురించి కంటే, మాట్లాడే వారి సంస్కారం గురించే ఎక్కువగా చెబుతుంది" అని త్రిష ఘాటుగా సమాధానమిచ్చింది.
వివాదానికి కారణం ఇదే
గలాటా అవార్డ్స్ వేడుకలో పార్థిబన్ స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. స్క్రీన్ పై త్రిష ఫోటో కనిపించింది. అప్పుడు అతడు స్పందిస్తూ.. "ఈ కుందవైని (పొన్నియిన్ సెల్వన్లో త్రిష పాత్ర పేరు) కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలి" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఒక వివాహ వేడుకకు త్రిష, నటుడు-రాజకీయ నాయకుడు విజయ్తో కలిసి జంటగా హాజరుకావడంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఉద్దేశించే పార్థిబన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆ పెళ్లి వేడుకలో వీరిద్దరూ సాధారణంగానే కొత్త జంటను ఆశీర్వదించి వెళ్లినప్పటికీ, కొందరు దీనిని వివాదాస్పదం చేశారు.
విజయ్ - సంగీత విడాకుల కేసులో తాజా పరిణామాలు
మరోవైపు విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం దాఖలు చేసిన విడాకుల పిటిషన్ తమిళనాడులో సంచలనంగా మారింది. చెంగల్పట్టు మహిళా కోర్టు ఈ కేసును ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి బదిలీ చేసింది. ఏప్రిల్ 20న జరిగే తదుపరి విచారణకు విజయ్ వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
{{/usCountry}}మరోవైపు విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం దాఖలు చేసిన విడాకుల పిటిషన్ తమిళనాడులో సంచలనంగా మారింది. చెంగల్పట్టు మహిళా కోర్టు ఈ కేసును ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి బదిలీ చేసింది. ఏప్రిల్ 20న జరిగే తదుపరి విచారణకు విజయ్ వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
{{/usCountry}}2021 ఏప్రిల్లో విజయ్కు ఒక నటితో ఉన్న సంబంధం గురించి తనకు తెలిసిందని, అది తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని సంగీత తన పిటిషన్లో పేర్కొన్నారు. విడాకుల విచారణ కొనసాగుతుండగానే, చెన్నై నీలాంకరైలోని తమ ఇంట్లోనే ఉండే హక్కు కల్పించాలని, అలాగే తనకు, తన ఇద్దరు పిల్లల పోషణ కోసం భరణం చెల్లించాలని కోరుతూ సంగీత తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు.
విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కీలక సమయంలో ఈ వ్యక్తిగత వివాదాలు ఆయన ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.