తెలుగులో యాంకర్గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఉదయభాను చాలా కాలం తర్వాత వరుసగా సినీ ప్రాజెక్ట్స్తో బిజీ అవుతున్నారు. త్రిబాణధారి బార్బరిక్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను రీసెంట్గా తెలుగు ఓటీటీ సిరీస్తో డిజిటల్ వేదికపై అలరించారు.
ఉదయ భానుతోపాటు రాజీవ్ కనకాల

ఉదయ భాను నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ఉదయ భానుతోపాటు రాజీవ్ కనకాల, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఓటీటీ సిరీస్కు కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ స్ట్రీమింగ్
ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. ఈ క్రమంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ సక్సెస్ ఈవెంట్కు హాజరైన ఉదయభాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇంత ఆనందాన్ని ఇస్తుందా?
ఉదయభాను మాట్లాడుతూ .. "ఓ సక్సెస్ ఇంత ఆనందాన్ని ఇస్తుందా? అని నాకు ఇప్పుడు తెలుస్తోంది. ఈ ఓటీటీ సిరీస్కు అందరూ వందకు వంద శాతం ఎఫెర్ట్ పెట్టారు. మా సిరీస్ గురించి, మా నటన గురించి వందల, వేల మెసెజ్లు వస్తున్నాయి" అని అన్నారు.
జీ5 ఓటీటీకి థ్యాంక్స్
"మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్గా నిలిచిన జీ5 ఓటీటీ టీంకు థాంక్స్. ఇంత మంచి పాత్రను ఇచ్చిన శ్రీరామ్కి రుణపడిపోయాను. దర్శకుడు కృష్ణ గారు సిరీస్ను అద్భుతంగా హ్యాండిల్ చేశారు" అని అందరిపై ప్రశంసలు కురిపించారు ఉదయభాను.
సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నా
{{/usCountry}}"మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్గా నిలిచిన జీ5 ఓటీటీ టీంకు థాంక్స్. ఇంత మంచి పాత్రను ఇచ్చిన శ్రీరామ్కి రుణపడిపోయాను. దర్శకుడు కృష్ణ గారు సిరీస్ను అద్భుతంగా హ్యాండిల్ చేశారు" అని అందరిపై ప్రశంసలు కురిపించారు ఉదయభాను.
సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నా
{{/usCountry}}"రెబెకా పోలీస్ ఆఫీసర్ పాత్ర అందరికీ కనెక్ట్ అయింది. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ సిరీస్ సీక్వెల్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. రాజీవ్ కనకాల సత్తాకు తగ్గ పాత్ర ఇన్ని రోజులకు వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇంత మంచి సక్సెస్ను ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్" అని తన స్పీచ్ ముగించారు ఉదయ భాను.
సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్పై
ఇదిలా ఉంటే, ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన వెబ్ సిరీస్ ఇది. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు కథలోకి వెళితే.. కూతురు స్వాతిని పుట్టినప్పటి నుంచి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు తండ్రి.
హాస్టల్లో ఉంటూ
స్వాతి బాగా చదవుకును హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించి హాస్టల్లో ఉంటుంది. ఓ రోజు స్వాతి మిస్ అవుతుంది. స్వాతి మిస్సింగ్ కేసును పోలీస్ ఆఫీసర్ రెబెకా డీల్ చేస్తుంది.
జీ5 ఓటీటీలో
ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో రెబెకా తెలుసుకుంది ఏంటీ?, స్వాతి కోసం తండ్రి ఎంత దూరం వెళ్లాడు? అసలు హాస్టల్లో, స్వాతి జీవితంలో జరిగింది ఏంటీ? అనేది తెలియాలంటో జీ5 ఓటీటీలో ప్రీమియర్ అవుతోన్న ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు సిరీస్ చూడాల్సిందే.