వరలక్ష్మి శరత్ కుమార్ కు కోపమొచ్చింది. పాపులర్ స్టోరీ రైటర్ సాయి మాధవ్ బుర్రాపై ఆమె ఫైర్ అయింది. నటి వరలక్ష్మి శరత్కుమార్ ఇటీవల 'ఎస్. సరస్వతి' చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమెతో పాటు ప్రకాష్ రాజ్, ప్రియమణి, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషించారు.
సాయి మాధవ్ బుర్రా స్టోరీ

ఎస్.సరస్వతి సినిమాకు ముందు పాపులర్ రైటర్ సాయి మాధవ్ బుర్రా స్టోరీ అందించాడు. కానీ ఈ స్టోరీ నచ్చకపోవడంతో వరలక్ష్మి దీన్ని మార్చింది. స్టోరీ మార్చడంపై సాయి మాధవ్ బుర్రా అసహనం వ్యక్తం చేశాడు. తీవ్రమైన మాటలు జారాడనే విమర్శలు వస్తున్నాయి.
"ఇది నా కథతో మొదలై మరో కథతో ముగుస్తుంది. ఒక్క మాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు.. కథని మానభంగం చేశారు. నాది రివెంజ్ డ్రామా కాదు.. నా సోల్ వేరు.. అసలా కథే వేరు’’ అని ఓ ఫేస్ బుక్ పోస్టులో సాయి మాధవ్ బుర్రా పేర్కొన్నాడు.
వరలక్ష్మి ఫైర్
తాజాగా హైదరాబాద్ లో సరస్వతి మూవీ టీమ్ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సాయి మాధవ్ బుర్రా కామెంట్లపై వరలక్ష్మిని రిపోర్టర్ ప్రశ్నించాడు. రచయితను సీనియర్గా గౌరవిస్తున్నానని, అయితే కథను ఎందుకు మార్చాల్సి వచ్చిందో వరలక్ష్మి వివరించింది. అంతేకాకుండా కథను తిరిగి రాయడానికి తనతో చర్చించడానికి రచయితకు సమయం లేదని, అతను 'పెద్ద సినిమాలతో' బిజీగా ఉన్నారని వరలక్ష్మి తెలిపింది.
రేప్ అని అంటారా?
{{/usCountry}}తాజాగా హైదరాబాద్ లో సరస్వతి మూవీ టీమ్ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సాయి మాధవ్ బుర్రా కామెంట్లపై వరలక్ష్మిని రిపోర్టర్ ప్రశ్నించాడు. రచయితను సీనియర్గా గౌరవిస్తున్నానని, అయితే కథను ఎందుకు మార్చాల్సి వచ్చిందో వరలక్ష్మి వివరించింది. అంతేకాకుండా కథను తిరిగి రాయడానికి తనతో చర్చించడానికి రచయితకు సమయం లేదని, అతను 'పెద్ద సినిమాలతో' బిజీగా ఉన్నారని వరలక్ష్మి తెలిపింది.
రేప్ అని అంటారా?
{{/usCountry}}"ఇంత సున్నితమైన విషయంలో 'రేప్' అనే పదాన్ని ఉపయోగించడం కరెక్ట్ కాదు. అలా ఎలా అంటారు. అది కూడా ఆయనలాంటి వ్యక్తి నుంచి రావడం సరికాదు. మీరు ఏ పదం వాడుతున్నారో మీకు తెలిసి ఉండాలి. ముఖ్యంగా సినిమాలో మీరు చర్చించిన అంశాన్ని బట్టి మీరు వాడే పదాల విషయంలో జాగ్రత్త వహించాలి. కథ కోసం నేనే కష్టపడ్డా. కానీ గౌరవం కోసం క్రెడిట్స్ ఆయనకు ఇచ్చా" అని వరలక్ష్మి మండిపడింది.
కథ మార్చాలని
ఈ కథను ఆరేళ్లుగా సాయి మాధవ్ బుర్రా దగ్గరే ఉంచుకున్నారని వరలక్ష్మి వెల్లడించింది. కథ బాగుంటే ఇప్పటికే సినిమా తీసేవాళ్లు కదా అని ప్రశ్నించింది. ‘‘కథ విన్నప్పుడే కాస్త మార్చాల్సి ఉంటుందని చెప్పా. క్లైమాక్స్ పూర్తిగా మార్చాల్సిన అవసరం వచ్చింది. స్టోరీ మార్పు గురించి ఆయనకు చెప్తామంటే అసలు దొరకలేదు’’ అని వరలక్ష్మి తెలిపింది.
తప్పిపోయిన తన 12 ఏళ్ల కూతురి కోసం వెతుకుతున్న తల్లి కథను సరస్వతి సినిమాలో చూపించారు. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.