దాదాపు 15 రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి, రిసెప్షన్ వార్తలు ట్రెండింగ్ లో కొనసాగాయి. మార్చి 4న హైదరాబాద్ లో విరోష్ రిసెప్షన్ ముగిసింది. సెలబ్రేషన్స్ ఓవర్ ఇక అండర్ గ్రౌండ్ వెళ్లిపోతామని రిసెప్షన్ ముగిసిన తర్వాత విజయ్ దేవరకొండ చెప్పాడు. విజయ్ సరదాకే చెప్పాడేమో అనుకున్నారు కానీ ఆ తర్వాత విరోష్ జోడీ ఎక్కడా కనిపించలేదు.
హనీమూన్ ఓవర్

రిసెప్షన్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హనీమూన్ వెళ్లారనే వార్తలు వచ్చాయి. మరోవైపు పెళ్లి, రిసెప్షన్ సందడి తర్వాత విరోష్ జోడీ రెస్ట్ తీసుకుంటుందని కొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడనే బజ్ క్రేజీగా మారింది.
రణబాలి
విజయ్ దేవరకొండ ప్రస్తుతం హీరోగా చేస్తున్న సినిమాల్లో ‘రణబాలి’ ఒకటి. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్. ఈ రణబాలి మూవీ షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ మళ్లీ సెట్ లో అడుగుపెట్టబోతున్నాడని తెలిసింది. మార్చి 12 నుంచి అతను షూటింగ్ పాల్గొనబోతున్నాడని ఫిల్మ్ వర్గాలు చెప్తున్నాయి.
ఫస్ట్ మూవీ షూటింగ్
రష్మిక మందన్నతో పెళ్లి తర్వాత తిరిగి విజయ్ దేవరకొండ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న ఫస్ట్ మూవీ రణబాలి. దీనికి రాహుల్ సాంకృత్యాన్ డైరెక్టర్. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్, విరోష్ వెడ్డింగ్ సందర్భంగా రిలీజ్ చేసిన ‘ఏందయ్యా సామి’ సాంగ్ అదిరిపోయాయి.
హ్యాట్రిక్ మూవీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రణబాలి’. ఈ జోడీ ఇప్పటివరకూ గీత గోవిందం (2018), డియర్ కామ్రేడ్ (2019) సినిమాల్లో కలిసి నటించింది. గీత గోవిందం సినిమా చేసేటప్పుడే ఈ జంట లవ్ లో పడిందని టాక్. డియర్ కామ్రేడ్ షూటింగ్ విరోష్ జోడీ మరింత దగ్గరైందని అంటున్నారు.
విరోష్ వెడ్డింగ్
{{/usCountry}}విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రణబాలి’. ఈ జోడీ ఇప్పటివరకూ గీత గోవిందం (2018), డియర్ కామ్రేడ్ (2019) సినిమాల్లో కలిసి నటించింది. గీత గోవిందం సినిమా చేసేటప్పుడే ఈ జంట లవ్ లో పడిందని టాక్. డియర్ కామ్రేడ్ షూటింగ్ విరోష్ జోడీ మరింత దగ్గరైందని అంటున్నారు.
విరోష్ వెడ్డింగ్
{{/usCountry}}విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో గ్రాండ్ గా జరిగింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో అత్యంత సన్నిహితంగా జరిగిన ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, ఆషికా రంగనాథ్, సందీప్ రెడ్డి వంగా తదితరులు హాజరయ్యారు. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో వెడ్డింగ్ రిసెప్షన్ ను భారీగా నిర్వహించారు. దీనికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.