Wedding Menu: విరోష్ పెళ్లి విందు మెనూ తెలుసా? స్పెషల్ గా పంది కూర.. అవును ఆ ఆచారం ప్రకారం!

wedding Menu: డ్రీమ్ వెడ్డింగ్ తో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఒక్కటయ్యారు. ఈ రోజు ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ లో వీళ్ల వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పెళ్లి విందులో ఓ ఐటెం హాట్ టాపిక్ గా మారింది. 

Published on: Feb 26, 2026 2:24 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విరోష్ వెడ్డింగ్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ మెనూలోని ఓ ఐటెం మరింత వైరల్ గా మారింది. ఈ రోజు ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ లో విరోష్ వెడ్డింగ్ జరిగిందని తెలిసింది. ఈ నేపథ్యంలో అతిథులకు వడ్డించే విందులో పంది మాంసంతో చేసిన స్పెషల్ పాండీ కూర కూడా ఉందని సమాచారం.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

విరోష్ వెడ్డింగ్ మెనూ

ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారని సమాచారం. ఉదయం 10.10 గంటల ముహూర్తంలో వీళ్ల పెళ్లి జరిగిందని తెలిసింది. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారని టాక్. వీళ్ల కోసం ఏర్పాటు చేసిన విందులో పంది మాంసం కూడా ఉంది.

పంది మాంసం

విరోష్ వెడ్డింగ్ విందు మోనూలో పంది మాంసాన్ని చేర్చడానికి ఓ బలమైన కారణం ఉందని తెలిసింది. రష్మిక మందన్నది కర్ణాటకలోని కూర్గ్ జిల్లా. కొడవ సంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ రోజు సాయంత్రం మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. కొడవ ఆచారం ప్రకారం వాళ్లు పెళ్లిలో పంది మాంసం వడ్డిస్తారు.

గతంలో వేటాడి

కొడవ వర్గానికి చెందిన ప్రజలు గతంలో అడవి పందులను వేటాడేవాళ్లు. ఏదైనా శుభకార్యాలు జరిగితే ఆ పంది మాంసాన్ని విందుగా లాగించేవాళ్లు. ఇప్పుడు వేటాడటం మానేశారు కానీ ఇంటి దగ్గరే పెంచుకుంటున్న పందుల మాంసంతో మాత్రం విందు ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిలో పంది మాంసంతో చేసిన పాండీ కర్రీ అనేది స్పెషల్ గా మారింది.

టేస్ట్ ఇలా

పంది మాంసంతో కొడవ ప్రజలు చేసిన పాండీ కర్రీ టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుందని తెలిసింది. ఇది కొంచెం పుల్లగా, చాలా కారంగా ఉంటుందని అంటున్నారు. ప్రత్యేక మసాలాలతో దీన్ని వండుతారంటా.

ఇక విరోష్ పెళ్లి విందులో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, కర్ణాటక స్పెషల్ అయిన బిసిబేళా బాత్ కూడా అతిథుల కోసం సిద్ధం చేశారని సమాచారం. తమ పెళ్లికి వచ్చిన గెస్ట్ ల కోసం జపనీస్ వంటకాలను కూడా విరోష్ జోడీ రెడీ చేయించిందంటా. అలాగే స్వీట్లు, డీజర్ట్ లతో ఫుల్ ఫుడ్ ఫెస్ట్ అరెంజ్ చేశారని తెలిసింది.