Vijay Classmate: సీఎం ప్రమాణస్వీకారంలో పేదరికంపై దళపతి విజయ్ ప్రసంగం- పచ్చి అబద్ధం అంటూ కొట్టిపారేసిన క్లాస్‌మేట్

Writer Manu Joseph Slams Vijay CM Speech On Poverty: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ తన తొలి ప్రసంగంలో పేదరికం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. విజయ్ మాటలు పచ్చి అబద్ధమంటూ ఆయన చిన్ననాటి మిత్రుడు మను జోసెఫ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Published on: May 12, 2026, 12:46:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Writer Manu Joseph Slams Vijay CM Speech On Poverty: చెన్నై వేదికగా ఆదివారం (మే 10) నాడు తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వేలాది మంది అభిమానులు, రాజకీయ ఉద్దండుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో దళపతి విజయ్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

సీఎం ప్రమాణస్వీకారంలో పేదరికంపై దళపతి విజయ్ ప్రసంగం- పచ్చి అబద్ధం అంటూ కొట్టిపారేసిన క్లాస్‌మేట్ (PTI)
సీఎం ప్రమాణస్వీకారంలో పేదరికంపై దళపతి విజయ్ ప్రసంగం- పచ్చి అబద్ధం అంటూ కొట్టిపారేసిన క్లాస్‌మేట్ (PTI)

తొలి ప్రసంగం

ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ చేసిన తొలి ప్రసంగం అక్కడ ఉన్నవారందరినీ కదిలించింది. ముఖ్యంగా హీరోయిన్ త్రిష కృష్ణన్, విజయ్ మాటలు వింటూ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

"ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు"

అయితే, విజయ్ తన ప్రసంగంలో తన గతాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. "నాకు పేదరికం అంటే ఏంటో తెలుసు.. ఆకలి విలువ బాగా తెలుసు. నేను ఒక సామాన్య అసిస్టెంట్ డైరెక్టర్ కొడుకును. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. నా వెనుక ఎలాంటి రాజవంశ చరిత్ర లేదు. నేను మీలో ఒకడిని.. మీ ఇంట్లోని కొడుకును, మీ సోదరుడిని" అంటూ విజయ్ పేర్కొన్నారు.

క్లాస్‌మేట్ బాంబు: "అదంతా వట్టి భ్రమ!"

తన పాలనలో సామాజిక న్యాయం, లౌకికవాదం ప్రధాన అజెండాగా ఉంటాయని దళపతి విజయ్ స్పష్టం చేశారు. అయితే, విజయ్ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఆయన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ రచయిత మను జోసెఫ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

"తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తన తొలి ప్రసంగంలో పేదరికంలో పెరిగానని చెప్పడం ఒక పెద్ద అబద్ధం. మేము లోయోలా స్కూల్‌లో మూడో తరగతి కలిసి చదువుకున్నాం. అతను నా క్లాస్‌మేట్. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ అప్పట్లోనే పేరున్న దర్శకుడు. తన కొడుకును హీరోగా నిలబెట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు" అని క్రియేటర్ మను జోసెఫ్ బాంబ్ పేల్చారు.

"సినీ రంగంలో ఒడిదుడుకులు ఉండటం వేరు, అసలైన పేదరికం వేరు. ధనవంతులైన అబ్బాయిలు ఒక్కోసారి చేతిలో డబ్బులు లేకపోవడాన్ని పేదరికంగా పొరబడతారు" అంటూ మను జోసెఫ్ ఎద్దేవా చేశారు. మను జోసెఫ్ కూడా సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఆయన తండ్రి జోసెఫ్ మడపల్లి మలయాళ దర్శకుడు.

అవినీతిపై ఉక్కుపాదం

విమర్శలు ఎలా ఉన్నా, విజయ్ తన పరిపాలనపై స్పష్టమైన హామీ ఇచ్చారు. "ప్రజల సొమ్ము నుంచి ఒక్క పైసా కూడా నేను ముట్టుకోను. నా అవసరం ఏంటో మీకు బాగా తెలుసు. నా ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైనా సరే.. అవినీతికి పాల్పడితే అస్సలు సహించను" అని దళపతి విజయ్ హెచ్చరించారు.

ఎంజీఆర్, జయలలిత తరహాలో సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్.. ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి. మరోవైపు విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' త్వరలోనే విడుదల కానుంది. సెన్సార్ ఇబ్బందుల వల్ల ఆలస్యమైన ఈ సినిమాపై ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

రచయిత, స్క్రీన్ ప్లే రైటర్

ఇక సీఎం ప్రమాణస్వీకారంలో పేదరికంపై విజయ్ చేసిన కామెంట్స్ పచ్చి అబద్దం అన్న మను జోసెఫ్ రచయిత, స్క్రీన్ ప్లే రైటర్.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న డీకపుల్డ్ సిరీస్‌ను ఆయనే రూపొందించారు. ఆర్ మాధవన్, సుర్విన్ చావ్లా నటించిన ఈ ఓటీటీ సిరీస్‌కు హార్ధిక్ మెహతా దర్శకత్వం వహించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More