Runanubandham Serial TV Premiere Date And Time: తెలుగు బుల్లితెరపై వైవిధ్యమైన కుటుంబ కథాచిత్రాలు, ఎమోషనల్ డ్రామాలతో అగ్రగామిగా దూసుకుపోతున్న జీ తెలుగు ఛానల్ మరో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది.
సూపర్ హిట్ సీరియల్స్తో

ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ఛానల్ ఇప్పుడు సరికొత్త కథ, ఉత్కంఠభరితమైన మలుపులతో సాగే 'రుణానుబంధం' అనే సీరియల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. జూన్ 22వ తేదీ నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు రోజువారీ ప్రైమ్ టైమ్ స్లాట్ అయిన రాత్రి 7 గంటలకు ఈ సరికొత్త ధారావాహిక ప్రసారం కానుంది.
రేటింగ్స్ యుద్ధం
సాధారణంగా రాత్రి 7 గంటల సమయం అంటే ఛానళ్ల మధ్య రేటింగ్స్ యుద్ధం నడుస్తుంది. ఈ కీలక సమయంలో జీ తెలుగు ఒక విభిన్నమైన సెంటిమెంట్ కథను నమ్ముకుని బరిలోకి దిగుతుండటం విశేషం.
తోలుబొమ్మలాట నేపథ్యం..
ఈ సీరియల్ కథాంశం చాలా భిన్నంగా, తెలుగు రాష్ట్రాల సాంప్రదాయక కళ అయిన తోలుబొమ్మలాట నేపథ్యంలో సాగుతుంది. మైనావతి (నటి నీలిమ) అనే ఒక అత్యంత ధనవంతురాలు, సమాజంలో పేరుప్రతిష్టలు ఉన్న ప్రతిభావంతమైన మహిళ.
మైనావతి వదిలేసిన బిడ్డ
ఒక వర్షం కురుస్తున్న చీకటి రాత్రి వేళ ఊహించని పరిస్థితుల్లో తనకు పుట్టిన ఆడబిడ్డను వదిలేస్తుంది మైనావతి. ఆ అనాథ బిడ్డను సాంప్రదాయ తోలుబొమ్మలాట కళాకారుడైన అప్పన్న (నటుడు ప్రభాకర్) చేరదీస్తాడు. ఆమెకు ధరణి (నటి అనగ) అని పేరు పెట్టి సొంత కూతురిలా పెంచుతాడు.
సమాజంలో జరిగే అన్యాయాలపై
తండ్రి నేర్పిన తోలుబొమ్మలాట కళ ద్వారా సమాజంలో జరిగే అన్యాయాలపై గొంతుకెత్తే ధైర్యవంతురాలిగా ధరణి ఎదుగుతుంది. అయితే ప్రశాంతంగా సాగుతున్న ఆమె జీవితంలోకి ఒకరోజు అనుకోకుండా తన గతానికి సంబంధించిన చేదు నిజాలు ఎదురవుతాయి.
కుట్రలు, పగ ప్రతీకారాల మధ్య ‘ధరణి’ పోరాటం
{{/usCountry}}తండ్రి నేర్పిన తోలుబొమ్మలాట కళ ద్వారా సమాజంలో జరిగే అన్యాయాలపై గొంతుకెత్తే ధైర్యవంతురాలిగా ధరణి ఎదుగుతుంది. అయితే ప్రశాంతంగా సాగుతున్న ఆమె జీవితంలోకి ఒకరోజు అనుకోకుండా తన గతానికి సంబంధించిన చేదు నిజాలు ఎదురవుతాయి.
కుట్రలు, పగ ప్రతీకారాల మధ్య ‘ధరణి’ పోరాటం
{{/usCountry}}ధరణి అసలు ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు, ఆమెపై పగ తీర్చుకునేందుకు మైనావతి కన్నకూతుళ్లు సంజన (నేహాల్), నయన (దివ్య) కలిసి అనేక కుట్రలు పన్నుతారు. అందులో భాగంగానే గ్రామాధినేత, మైనావతి సోదరుడైన ధర్మతేజ (సతీష్)తో బలవంతంగా ధరణికి వివాహం జరిపిస్తారు.
నాలుగు గోడల మధ్య
పెళ్లయిన తర్వాత అత్తగారింట్లో అడుగుపెట్టిన ధరణిని నాలుగు గోడల మధ్య బంధించి శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభిస్తారు. ద్రోహం, ప్రతీకారం, స్వార్థం నిండిన ఆ ఇంట్లో ధరణి ఒంటరిగా ఎలాంటి నరకాన్ని అనుభవించింది? ఆ కష్టాలను ఎదుర్కొని ఎలా నిలబడింది? అనే అంశాలను దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా మలిచారు.
క్షమాగుణం విజయం సాధిస్తుందా?
ధరణి తన కన్నకూతురేననే నిజాన్ని మైనావతి ఎప్పటికైనా గుర్తిస్తుందా? కన్నతల్లి ప్రేమ ఆ బిడ్డకు దక్కుతుందా? చివరకు పగ, ద్వేషంపై క్షమాగుణం ఎలా విజయం సాధించింది? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే జూన్ 22 నుంచి ప్రారంభం కానున్న 'రుణానుబంధం' సీరియల్ చూడాల్సిందే.
ప్రభాకర్, నీలిమ తదితరులు
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, నీలిమ వంటి పాపులర్ తారాగణం ఉండటం ఈ సీరియల్కు మరింత బలాన్ని ఇస్తోంది. వీరితోపాటు అనగ, నేహాల్, నయన, సతీష్ తదితరులు ఇతర పాత్రలు పుట్టిల్లే మెట్టినిల్లుగా మారే ఈ సీరియల్ రుణానుబంధంలో మెప్పించనున్నారు.