Maruti Suzuki Brezza : మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్లిఫ్ట్.. మైలేజ్లో తోపు! ఇంధన ఖర్చులు భారీగా ఆదా..
Maruti Suzuki Brezza facelift : కొత్త మారుతీ సుజుకీ బ్రెజా ఫేస్లిఫ్ట్ మైలేజ్ వివరాలు వెల్లడయ్యాయి. లీటరుకు సీఎన్జీ వర్షన్ 26.90 కి.మీ, పెట్రోల్ మాన్యువల్ 21.09 కి.మీ, టర్బో-పెట్రోల్ 20.47 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుండటంతో కస్టమర్లలో భారీ ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న 2026 మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ కేవలం సరికొత్త లుక్స్, ఫీచర్లతోనే కాదు.. ఇంజన్ ఆప్షన్ల పరంగానూ మైలేజ్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఈసారి కంపెనీ బ్రెజ్జాలో రెగ్యులర్ పెట్రోల్, సీఎన్జీలతో పాటు కొత్తగా టర్బో-పెట్రోల్ వేరియంట్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వాహన పనితీరు కావాలా లేక నిత్యం అయ్యే ఇంధన ఖర్చు తగ్గాలా అనే దానిబట్టి కస్టమర్లు తమకు నచ్చిన మోడల్ను ఎంచుకునే అవకాశాన్ని మారుతీ సుజుకీ కల్పించింది. ఈ నేపథ్యంలో కొత్త బ్రెజ్జా అధికారిక మైలేజ్ గణాంకాలు ఆసక్తికరంగా మారాయి.

మారుతీ సుజుకీ బ్రెజ్జా టర్బో మైలేజ్- లీటరుకు 20.47 కి.మీ వరకు..
మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్లిఫ్ట్లో పరిచయమైన టర్బో-పెట్రోల్ ఇంజన్ పవర్ఫుల్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తూనే మంచి ఇంధన పొదుపును అందిస్తోంది. అయితే వేరియంట్లను బట్టి దీని మైలేజ్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
బ్రెజ్జా ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ టర్బో వేరియంట్లు లీటరుకు 20.47 కి.మీ మైలేజ్ ఇస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
ఇక టాప్-ఎండ్ మోడళ్లయిన జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ టర్బో వేరియంట్లు లీటరుకు 19.96 కి.మీ మైలేజ్ ఇస్తాయి.
రెండు వేరియంట్ల మధ్య పెద్దగా తేడా లేకపోయినప్పటికీ, టర్బో ఇంజన్ పవర్ అనుభవిస్తూనే ఎక్కువ ఇంధన పొదుపు కోరుకునే వారికి బేస్, మిడ్ వేరియంట్లు మంచి ఆప్షన్గా నిలుస్తాయి.
మారుతీ సుజుకీ బ్రెజ్జా- పెట్రోల్ మాన్యువల్ మైలేజ్..
సాధారణ పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ గేర్బాక్స్ కాంబినేషన్ను ఎంచుకునే వారికి బ్రెజ్జా ఇప్పటికీ లీటరుకు 20 కిలోమీటర్లకు పైగానే మైలేజ్ అందిస్తోంది.
ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ మాన్యువల్ వేరియంట్లు లీటరుకు 21.09 కి.మీ మైలేజ్ ఇస్తూ ఈ కేటగిరీలోనే అత్యధిక ఇంధన పొదుపు అందించే మోడళ్లుగా నిలిచాయి.
జెడ్ఎక్స్ఐ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.81 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
మారుతీ సుజుకీ బ్రెజ్జా- ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్..
ట్రాఫిక్లో సులభంగా డ్రైవింగ్ చేయడానికి ఆటోమేటిక్ వెర్షన్ కోరుకునే వారి కోసం వచ్చిన వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆటోమేటిక్ (ఏటీ) వేరియంట్లు లీటరుకు 20.17 కి.మీ మైలేజ్ ఇస్తాయి. మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల మధ్య మైలేజ్లో పెద్దగా తేడా లేకపోవడం ఇక్కడ విశేషం.
మారుతీ సుజుకీ బ్రెజ్జా మైలేజ్ కింగ్.. సీఎన్జీ వర్షెన్!
ఎప్పటిలాగే అత్యధిక మైలేజ్ విషయంలో సీఎన్జీ బ్రెజ్జా టాప్లో నిలిచింది. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ సీఎన్జీ మాన్యువల్ వేరియంట్లు కేజీ సీఎన్జీకి ఏకంగా 26.90 కి.మీ మైలేజ్ ఇస్తాయి. నెలకు ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే వారికి, రన్నింగ్ కాస్ట్ బాగా తగ్గాలనుకునే వారికి బ్రెజ్జా సీఎన్జీనే బెస్ట్ ఛాయిస్.
మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ మైలేజ్ వివరాలు ఒక చూపులో:
| వేరియంట్ | అధికారిక మైలేజ్ |
|---|---|
| LXi / VXi టర్బో | 20.47 kmpl |
| ZXi / ZXi+ టర్బో | 19.96 kmpl |
| LXi / VXi పెట్రోల్ MT | 21.09 kmpl |
| ZXi పెట్రోల్ MT | 20.81 kmpl |
| VXi / ZXi / ZXi+ పెట్రోల్ AT | 20.17 kmpl |
| LXi / VXi / ZXi CNG MT | 26.90 km/kg |
ఇవి కంపెనీ అధికారికంగా వెల్లడించిన క్లెయిమ్డ్ మైలేజ్ గణాంకాలు. నిజమైన రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్, డ్రైవింగ్ విధానం, కారులోని బరువును బట్టి నిజమైన మైలేజ్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి.
అయితే పేపర్ మీద ఉన్న ఆధారాల ప్రకారం చూస్తే.. టర్బో ఇంజన్ రాక వల్ల మైలేజ్ విషయంలో ఎలాంటి పెద్ద తగ్గుదల కనిపించలేదు. అదే సమయంలో మైలేజ్ మాత్రమే ప్రధానంగా చూసేవారికి రెగ్యులర్ పెట్రోల్ మాన్యువల్, సీఎన్జీ మోడళ్లు సరిజోడిగా నిలుస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


