Tata Punch EV vs MG Comet EV : ఒకటి బుడ్డి ఈవీ, ఇంకొకటి మైక్రో ఎలక్ట్రిక్ ఎస్యూవీ- ఏది వాల్యూ ఫర్ మనీ?
2026 Tata Punch EV vs MG Comet EV : 2026 టాటా పంచ్ ఈవీ ‘బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్’ ప్రోగ్రామ్తో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఈ ఎలక్ట్రిక్ కారుకు, ఎంజీ కామెట్ ఈవీ గట్టి పోటీనిస్తోంది. ఈ రెండింటిలో ఏది మీకు లాభదాయకమో ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకోండి..
భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో బడ్జెట్ ధరలో కార్లను కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎస్యూవీ ‘పంచ్’ని సరికొత్త అప్డేట్లతో 2026 వెర్షన్గా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, కొనుగోలు విధానంలోనూ సరికొత్త మార్పులు చేస్తూ 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) స్కీమ్ని సైతం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో మార్కెట్లో దీనికి ప్రధాన పోటీదారుగా ఉన్న ఎంజీ కామెట్ ఈవీతో పోలిస్తే ఏది వాల్యూ ఫర్ మనీ బై అవుతుంది? అనేది ఇక్కడ తెలుసుకోండి..

2026 టాటా పంచ్ ఈవీ వర్సెస్ ఎంజీ కామెట్ ఈవీ- బీఏఏఎస్ ప్లాన్స్..
బ్యాటరీ ధరను మినహాయించి కారును మాత్రమే కొనుగోలు చేసే ఈ విధానంలో ధరలు చాలా తక్కువగా ఉంటాయి:
టాటా పంచ్ ఈవీ: బీఏఏఎస్ ప్రోగ్రామ్ కింద దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని కోసం అభ్యర్థులు కిలోమీటరుకు రూ. 2.60 చొప్పున బ్యాటరీ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
ఎంజీ కామెట్ ఈవీ: ఈ కారు బీఏఏఎస్ ప్లాన్ కింద రూ. 4.99 లక్షల నుంచే లభిస్తుంది. అయితే, దీని బ్యాటరీ రెంటల్ కిలోమీటరుకు రూ. 3.20 గా ఉంది.
అంటే ప్రారంభ ధరలో కామెట్ తక్కువగా ఉన్నా, రన్నింగ్ కాస్ట్ విషయంలో పంచ్ ఈవీ కొంచెం చౌకగా కనిపిస్తోంది.
| 2026 టాటా పంచ్ వర్సెస్ ఎంజీ కామెట్ (బీఏఏఎస్ స్కీమ్) ధరలు | |||
|---|---|---|---|
| మోడల్ | బీఏఏఎస్ ధర (ఎక్స్షోరూం) | బ్యాటరీ రెంటల్ | రెగ్యులర్ ధర (ఎక్స్షోరూం) |
| 2026 టాటా పంచ్ ఈవీ | రూ. 6.49 లక్షలు | రూ. 2.60/కి.మీ | రూ. 9.69 లక్షలు - రూ. 12.59 లక్షలు |
| ఎంజీ కామెట్ ఈవీ | రూ. 4.99 లక్షలు - రూ. 7.63 లక్షలు | రూ. 3.20 /కి.మీ | రూ. 7.62 లక్షలు - రూ. 10 లక్షలు |
2026 టాటా పంచ్ ఈవీ వర్సెస్ ఎంజీ కామెట్ ఈవీ- అవుట్రైట్ (రెగ్యులర్) ధరలు..
బ్యాటరీతో కలిపి మొత్తం కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ధరలు ఇలా ఉన్నాయి:
టాటా పంచ్ ఈవీ: రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షల వరకు.
ఎంజీ కామెట్ ఈవీ: రూ. 7.62 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు.
2026 టాటా పంచ్ ఈవీ వర్సెస్ ఎంజీ కామెట్ ఈవీ- ఏది ఎంచుకోవాలి?
మీరు ఒక పూర్తి స్థాయి ఎస్యూవీ లుక్, విశాలమైన క్యాబిన్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకుంటే టాటా పంచ్ ఈవీ సరైన ఎంపిక. ముఖ్యంగా ఫిబ్రవరి 2026లో వచ్చిన ఫేస్లిఫ్ట్ అప్డేట్స్ దీనికి మరింత ప్రీమియం లుక్ ఇచ్చాయి. ఒకవేళ మీరు కేవలం సిటీ డ్రైవింగ్ కోసం, ఇరుకైన వీధుల్లో సులభంగా తిరిగే చిన్న కారు కావాలనుకుంటే ఎంజీ కామెట్ ఈవీని పరిశీలించవచ్చు.
టాటా మోటార్స్ తన తొలి బీఏఏఎస్ మోడల్గా పంచ్ను రంగంలోకి దించడం వల్ల మధ్యతరగతి వినియోగదారులకు ఎలక్ట్రిక్ కారు కల మరింత చేరువయ్యే అవకాశం ఉంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. అసలు బీఏఏఎస్ స్కీమ్ అంటే ఏంటి? దీనివల్ల ధర ఎందుకు తగ్గుతుంది?
బీఏఏఎస్ అంటే బ్యాటరీని ఒక సర్వీసుగా పొందడం. సాధారణంగా ఎలక్ట్రిక్ కారు ధరలో 30% నుంచి 40% వరకు ఖర్చు కేవలం బ్యాటరీదే ఉంటుంది. ఈ స్కీమ్ కింద, మీరు కారును కొనేటప్పుడు బ్యాటరీ ధరను చెల్లించాల్సిన అవసరం లేదు, కేవలం కారు బాడీకి మాత్రమే డబ్బులు కడతారు. దీనివల్ల కారు ప్రారంభ ధర భారీగా తగ్గుతుంది. ఉదాహరణకు, టాటా పంచ్ ఈవీ ధర రూ. 9.69 లక్షల నుంచి రూ. 6.49 లక్షలకు తగ్గుతుంది.
2. బ్యాటరీ కోసం నెలనెలా ఎంత చెల్లించాలి? ఆ ఛార్జీలు ఎలా లెక్కిస్తారు?
కారు కొన్న తర్వాత, మీరు వాడే బ్యాటరీకి గానూ కిలోమీటరు ప్రాతిపదికన అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
టాటా పంచ్ ఈవీ: కిలోమీటరుకు రూ. 2.60 ఛార్జ్ చేస్తుంది.
ఎంజీ కామెట్ ఈవీ: కిలోమీటరుకు రూ. 3.20 ఛార్జ్ చేస్తుంది.
కారులో ఉండే టెలిమాటిక్స్ పరికరం ద్వారా మీరు ఎన్ని కిలోమీటర్లు తిరిగారో లెక్కించి, నెల చివరలో బిల్లు పంపిస్తారు. కొన్ని ఫైనాన్స్ కంపెనీలు కనీసం 1,500 కి.మీల ఛార్జీని తప్పనిసరిగా వసూలు చేస్తాయి, కాబట్టి మీ డ్రైవింగ్ అలవాట్లను బట్టి ప్లాన్ ఎంచుకోవాలి.
3. బ్యాటరీ పాడైపోతే లేదా లైఫ్ తగ్గిపోతే బాధ్యత ఎవరిది?
ఇదే ఈ స్కీమ్లోని అతిపెద్ద ప్రయోజనం. బ్యాటరీ మీ సొంతం కాదు కాబట్టి, దాని నిర్వహణ, వారంటీ బాధ్యత మొత్తం కంపెనీదే. బ్యాటరీ పనితీరు తగ్గినా లేదా ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా, కంపెనీ ఉచితంగా రిపేర్ లేదా రీప్లేస్మెంట్ చేస్తుంది. టాటా పంచ్ ఈవీ వంటి మోడళ్లకు 'లైఫ్ టైమ్ బ్యాటరీ వారంటీ' లభిస్తుంది, దీనివల్ల బ్యాటరీ మార్చడానికి భవిష్యత్తులో లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందనే భయం ఉండదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


