8th Pay Commission : 8వ వేతన సంఘం అసలు ఏం చేస్తోంది? ఉద్యోగులు తెలుసుకోవాల్సిన 5 విషయాలు..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, భత్యాలను సవరించేందుకు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన 8వ వేతన సంఘం తన పనులను వేగవంతం చేసింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, జీతాల పెంపుపై తాజా అధికారిక వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 27, 2026, 07:29:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం పనులు వేగవంతమయ్యాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలను సమీక్షించి నివేదిక అందించడానికి కమిషన్‌కు 18 నెలల వ్యవధిని నిర్దేశించారు.

8వ వేతన సంఘం అసలు ఏం చేస్తోంది?
8వ వేతన సంఘం అసలు ఏం చేస్తోంది?

ఆగస్టు 3 నాటికి కమిషన్ తన కేటాయించిన గడువులో సగానికి పైగా, అంటే తొమ్మిది నెలల కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోబోతోంది. ప్రస్తుతం కమిషన్ ఒక కీలకమైన దశలోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు మరియు ఇతర భాగస్వామ్య వర్గాలతో విస్తృత స్థాయి సంప్రదింపులను ముమ్మరం చేసింది.

8వ వేతన సంఘం వెబ్‌సైట్‌లోని టాప్ 5 ముఖ్యాంశాలు..

కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన ప్రకారం.. నివేదికను ఆమోదించే ముందు భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దిల్లీ, చెన్నై, పుదుచ్చేరిలలో ప్రత్యేక సమావేశాలను షెడ్యూల్ చేసింది. ఉద్యోగ యూనియన్లు, పెన్షనర్ల నుంచి నేరుగా సూచనలు, సలహాలు స్వీకరించడమే ఈ భేటీల ముఖ్య ఉద్దేశం.

చర్చకు రానున్న ప్రధాన అంశాలు:

ఈ సంప్రదింపుల సమావేశాలలో ప్రధానంగా ప్రాధాన్యత లభించే అంశాలు:

  • ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఖరారు
  • బేసిక్ పే, జీతాల సవరణ
  • పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమస్యలు, అలవెన్సుల పెంపు
  • పెన్షన్ సంస్కరణలు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం

తేదీ

అధికారిక అప్డేట్

ఎందుకు ముఖ్యం?

జులై 24, 20269 సెప్టెంబర్​ 2026న పుదుచ్చెరి పర్యటన కోసం నోటీసు జారీ అయ్యింది.ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ప్రత్యక్షంగా కమిషన్​కి తెలియజేయవచ్చు.
జులై 24, 2026సెప్టెంబర్​ 7-8 తేదీల్లో చెన్నై పర్యటన కోసం నోటీసు జారీ అయ్యింది.తమిళనాడులోని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలు, అంచనాలను చెప్పుకోవచ్చు.
జులై 23, 2026ఆగస్ట్​ 7-10 మధ్య దిల్లీలో సమావేశాలుదిల్లీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
మే 29, 2026మెమొరాండమ్ సమర్పణ గడువు పొడిగింపుఫలితంగా ఉద్యోగ సంఘాలు, పింఛనుదారులకు తమ సిఫార్సులను చెప్పేందుకు మరింత సమయం లభించింది.
మే 29, 2026జులైలో కోల్​కతా పర్యటనకు నోటీసు జారీ అయ్యింది.పశ్చిమ బెంగాల్​ ఉద్యోగులకు తమ వాదనలు వినిపించే అవకాశం లభించింది.

జీతాల పెంపును నిర్ణయించే ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’..

8వ వేతన సంఘం ద్వారా ఉద్యోగుల జీతాల పెంపులో 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' అత్యంత కీలకమైనది. గతంలో 6వ వేతన సంఘంలో ఇది 1.86గా, 7వ వేతన సంఘంలో 2.57గా నిర్ణయించారు. ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలు, విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 8వ వేతన సంఘం కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఖరారు చేయనుంది. ఈ నిర్ణయం రాబోయే దశాబ్ద కాలం పాటు ఉద్యోగుల జీతభత్యాలను, ఆ తర్వాత రాబోయే 9వ వేతన సంఘం వరకు ఆర్థిక స్థితిగతులను నిర్దేశిస్తుంది.

బీపీఎంఎస్, ఎన్​సీ జేసీఎం వంటి ప్రముఖ ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.5 రెట్లకు పైగా పెంచాలని బలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే, దీనిపై కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా సిఫార్సులను వెల్లడించలేదు.

తేదీ

మైలురాయి

జనవరి 16, 20258వ పే కమిషన్​ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అక్టోబర్​ 28, 20258వ పే కమిషన్​ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
నవంబర్ 3, 20258వ పే కమిషన్​ అధికారికంగా ఏర్పడింది.
ఫిబ్రవరి 7, 2026అధికారిక వెబ్​సైట్, ఆన్​లైన్ డేటా పోర్టల్, కన్సల్టేషన్ ప్లాట్​ఫామ్​లు అందుబాటులోకి వచ్చాయి.
ఏప్రిల్- జులై 2026వివిధ రాష్ట్రాల్లోని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలతో చర్చలు
20278వ పే కమిషన్ తన రిపోర్టును 2027 రెండో భాగంలో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.

అధికారిక సమాచారం కోసమే చూడండి..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని, కేవలం 8వ వేతన సంఘం అధికారిక వెబ్‌సైట్ https://8cpc.gov.in/ ను మాత్రమే సంప్రదించి సమాచారాన్ని ధృవీకరించుకోవాలని సూచించారు.

కమిషన్ తన తుది నివేదికను మే-జూన్ 2027 నాటికి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి లోబడి, ఈ సవరించిన కొత్త వేతనాలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More