ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులు ప్రపంచ ఉద్యోగ మార్కెట్ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు విదేశాల్లో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల కోర్సుల ఎంపికపై స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఉన్నత విద్య అనగానే పరుగులెత్తిన సంప్రదాయ MBA డిగ్రీల స్థానంలో.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.
అమెరికాలో STEM కోర్సుల హవా

ఐఐఈ ఓపెన్ డోర్స్ (IIE Open Doors) తాజా గణాంకాల ప్రకారం, 2024/25 విద్యాసంవత్సరంలో అమెరికా వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థుల్లో 57 శాతం మంది 'స్టెమ్' (STEM) కోర్సులనే ఎంచుకున్నారు. ఇందులో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ వాటా 26 శాతం కాగా, ఇంజనీరింగ్ 18 శాతంగా నమోదు కావడం విశేషం.
అమెరికాకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారతీయ విద్యార్థుల్లో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాలే అన్ని కోర్సులను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాయి.
టెక్నాలజీతో కూడిన బిజినెస్ వ్యూహాలు
2026 విద్యా సంవత్సరంలో కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు సాధారణ మేనేజ్మెంట్ కోర్సుల కంటే AI, డేటా సైన్స్ రంగాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
"ఐదేళ్ల క్రితం వరకు విదేశీ విద్యను కోరుకునే ప్రతీ విద్యార్థికీ ఎంబీఏ మొదటి ప్రాధాన్యంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మాస్టర్స్ ఇన్ AI, డేటా సైన్స్ లేదా అనలిటిక్స్ కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొందరు విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను (Technical Skills) ముందుగా నేర్చుకుని, ఆ పైన బిజినెస్ స్ట్రాటజీలను జోడించుకుంటున్నారు" అని ప్రోడిజీ ఫైనాన్స్ గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సోనాల్ కపూర్ విశ్లేషించారు.
భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా కోర్సులు
కేవలం కోర్సు పూర్తయిన వెంటనే వచ్చే జీతాలనే కాకుండా, రాబోయే 15 ఏళ్ల పాటు మార్కెట్లో మనుగడ సాగించేలా ఉండే కోర్సులను విద్యార్థులు ఎంచుకుంటున్నారు. దీనివల్ల పర్యావరణ సైన్స్ (Environmental Science), హెల్త్కేర్, పబ్లిక్ పాలసీ కోర్సులతో పాటు క్లైమేట్ అండ్ ఎనర్జీ ప్రోగ్రామ్లకు ఆదరణ పెరుగుతోంది.
{{/usCountry}}కేవలం కోర్సు పూర్తయిన వెంటనే వచ్చే జీతాలనే కాకుండా, రాబోయే 15 ఏళ్ల పాటు మార్కెట్లో మనుగడ సాగించేలా ఉండే కోర్సులను విద్యార్థులు ఎంచుకుంటున్నారు. దీనివల్ల పర్యావరణ సైన్స్ (Environmental Science), హెల్త్కేర్, పబ్లిక్ పాలసీ కోర్సులతో పాటు క్లైమేట్ అండ్ ఎనర్జీ ప్రోగ్రామ్లకు ఆదరణ పెరుగుతోంది.
{{/usCountry}}కరోనా తెచ్చిన డిజిటల్ మార్పులు, ఏఐ వల్ల మారుతున్న ఉద్యోగ సమీకరణాలను కళ్లారా చూసిన 2026 బ్యాచ్ విద్యార్థులు రాబోయే రోజుల్లో వెనుకబడిపోకూడదనే పట్టుదలతో ఉన్నారు. అందుకే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యాపార నైపుణ్యాలు రెండూ కలగలిసిన డిగ్రీలకే ఓటు వేస్తున్నారు.
రూపాయి క్షీణత.. పెరుగుతున్న ఆర్థిక భారం
టెక్నికల్ మాస్టర్స్ డిగ్రీల ఫీజులు సాధారణ ఎంబీఏ కోర్సులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండటం విద్యార్థులకు ఆర్థికంగా సవాలుగా మారింది. దీనికి తోడు భారతీయ రూపాయి మారకపు విలువ గణనీయంగా పడిపోవడం విద్యార్థుల బడ్జెట్ను ప్రభావితం చేస్తోంది. జూలై 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక లెక్కల ప్రకారం డాలర్ మారకపు విలువ రూ. 95 దాటడం గమనార్హం.
ఈ ఆర్థిక వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి విద్యార్థులు కుటుంబ పొదుపులు, స్కాలర్షిప్లతో పాటు అంతర్జాతీయ రుణ సంస్థలపై ఆధారపడుతున్నారు. పూచీకత్తు (Collateral) లేదా గ్యారెంటర్ లేకపోయినా, విద్యార్థుల భవిష్యత్ సంపాదన సామర్థ్యాన్ని (Future Earning Potential) బట్టి ప్రోడిజీ ఫైనాన్స్ వంటి సంస్థలు రుణాలు అందిస్తున్నాయి.