AIBE 21 : నేటి నుంచి ఏఐబీఈ 21 రిజిస్ట్రేషన్లు- పూర్తి వివరాలు..

భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) 21 రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేటి నుంచి (ఫిబ్రవరి 11, 2026) ప్రారంభించనుంది. భారతదేశంలో న్యాయవాద వృత్తిని చేపట్టాలనుకునే ఎల్ఎల్బీ గ్రాడ్యుయేట్లు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 11, 2026 6:45 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యాయశాస్త్రం పూర్తి చేసి ప్రాక్టీస్ చేయాలనుకునే అభ్యర్థులకు బిగ్​ అప్డేట్​! ఏఐబీఈ 21 (ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామినేషన్​ XXI) రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేడు ఫిబ్రవరి 11న ప్రారంభంకానుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులను స్వీకరించబోమని, అలాగే గడువు పొడిగింపు ఉండదని బీసీఐ (బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా) స్పష్టం చేసింది.

ఏఐబీఈ - 21 పరీక్ష
ఏఐబీఈ - 21 పరీక్ష

ఏఐబీఈ 21- ముఖ్యమైన తేదీలు ఇవే..

ఏఐబీఈ 21 రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 11, 2026

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 1, 2026

దరఖాస్తు సవరణ: మే 3, 2026

హాల్ టికెట్ల జారీ: మే 22, 2026

పరీక్ష తేదీ: జూన్ 7, 2026

ఏఐబీఈ 21- అర్హతలు ఎవరికి ఉన్నాయి?

ఈ ఏఐబీఈ 21 పరీక్ష రాయడానికి కింది వారు అర్హులు:

చివరి సెమిస్టర్ విద్యార్థులు: బీసీఐ గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో 3 ఏళ్ల లేదా 5 ఏళ్ల ఎల్ఎల్బీ చదువుతూ, మునుపటి సెమిస్టర్లలో ఎటువంటి బ్యాక్‌లాగ్స్ లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ పూర్తి చేసిన వారు: కోర్సు పూర్తయి, ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ చేతికి రాని వారు కూడా అప్లై చేయవచ్చు.

నమోదు చేసుకోని గ్రాడ్యుయేట్లు: ఎల్ఎల్బీ పూర్తి చేసినా ఇంకా స్టేట్ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోని వారు, లేదా గతంలో నమోదు చేసుకుని ఆ తర్వాత ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్‌ను వెనక్కి ఇచ్చేసిన వారు కూడా ఈ పరీక్ష రాయవచ్చు.

ఏఐబీఈ 21- దరఖాస్తు ప్రక్రియ ఇలా..

అభ్యర్థులు allindiabarexamination.com వెబ్‌సైట్ ద్వారా కింది పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి:

స్టెప్​ 1- వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఉన్న 'Registration' లింక్‌పై క్లిక్ చేసి ప్రాథమిక సమాచారం నమోదు చేయాలి.

స్టెప్​ 2- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌తో సైన్-ఇన్ అవ్వాలి.

స్టెప్​ 3- అప్లికేషన్ ఫారమ్‌లో పూర్తి వివరాలు నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

స్టెప్​ 4- నిర్ణీత దరఖాస్తు రుసుము చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.

ఏఐబీఈ 21- పరీక్ష ఫీజు..

జనరల్​/ ఓబీసీ- రూ. 3,500

జనరల్​- పీడబ్ల్యూడీ/ ఓబీసీ-పీడబ్ల్యూడీ రూ. 3,500

ఎస్సీ/ ఎస్టీ- రూ. 2,500

ఎస్సీ-పీడబ్ల్యూడీ/ ఎస్టీ-పీడబ్ల్యూడీ రూ. 2,500

ఈడబ్ల్యూఎస్​/ మహిళలు- రూ. 3,500

చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు గడువు వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.