అండర్-19 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన యంగ్ టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ ను ఆరుసార్లు గెలుచుకున్న ఏకైక దేశం భారత్. శుక్రవారం (ఫిబ్రవరి 6) రాత్రి ఫైనల్లో ఇంగ్లాండ్ ను 100 రన్స్ తేడాతో ఓడించి యువ భారత్ విశ్వ విజేతగా నిలిచింది. కప్ దక్కించుకున్న యంగ్ టీమ్ పై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది.
బీసీసీఐ ప్రైజ్ మనీ

అండర్-19 ప్రపంచకప్ 2026 టైటిల్ దక్కించుకున్న భారత యువ జట్టుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అదిరిపోయే న్యూస్ చెప్పింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి 2026 అండర్-19 ప్రపంచ కప్ను సొంతం చేసుకున్న భారత అండర్-19 క్రికెట్ జట్టుకు రూ.7.5 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. 2026 అండర్-19 ప్రపంచ కప్ను అజేయంగా ముగించినందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా భారత అండర్-19 జట్టుపై గర్వం వ్యక్తం చేశారు.
అందరికీ గర్వకారణం
ఏఎన్ఐతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. "2026 అండర్-19 ప్రపంచకప్ గెలుపుతో మా అండర్-19 జట్టు పట్ల యావత్ దేశం, బీసీసీఐ గర్విస్తోంది. ఫైనల్లో మా జట్టు ఇంగ్లాండ్ను ఓడించిన విధానం, టోర్నమెంట్లో అజేయంగా నిలిచిన తీరు అందరికీ గర్వకారణం. ఈ యువ జట్టుకు బీసీసీఐ రూ.7.5 కోట్ల నగదు బహుమతిని అందిస్తుంది" అని ప్రకటించారు.
ప్రధాని ఏమన్నారంటే?
ప్రపంచ కప్లో అండర్-19 జట్టు అద్భుత ప్రదర్శన పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. "భారత క్రికెట్ ప్రతిభ వెలిగిపోతోంది! ప్రపంచ కప్ను స్వదేశానికి తీసుకువచ్చిన మా U-19 జట్టు పట్ల గర్విస్తున్నా. ఈ జట్టు టోర్నమెంట్లో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ చాలా బాగా ఆడింది. ఈ విజయం ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది’’ అని ప్రధాని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఆట అదుర్స్
అండర్-19 ప్రపంచకప్ లో యంగ్ టీమిండియా ఆట అదిరింది. టోర్నీ మొత్తంలో ఒక్క ఓటమి కూడా లేకుండా భారత జట్టు కప్ సొంతం చేసుకుంది. జింబాబ్వేలోని హరారేలో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ U19 ను 100 పరుగుల తేడాతో ఓడించి, ఆరో టైటిల్ను గెలుచుకుంది భారత్.
{{/usCountry}}అండర్-19 ప్రపంచకప్ లో యంగ్ టీమిండియా ఆట అదిరింది. టోర్నీ మొత్తంలో ఒక్క ఓటమి కూడా లేకుండా భారత జట్టు కప్ సొంతం చేసుకుంది. జింబాబ్వేలోని హరారేలో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ U19 ను 100 పరుగుల తేడాతో ఓడించి, ఆరో టైటిల్ను గెలుచుకుంది భారత్.
{{/usCountry}}ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు చేసింది. యంగ్ గన్ వైభవ్ సూర్యవంశీ స్టేడియంలో పరుగుల సునామీతో చెలరేగిపోయాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 51 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ అండర్-19 టీమ్ 311 పరుగుల చేసింది. ఇండియా గతంలో 2000, 2008, 2012, 2018, 2022లోనూ అండర్-19 ప్రపంచ కప్ దక్కించుకుంది.