Kia seltos : బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీ కియా సెల్టోస్​లో రెండు కొత్త వేరియంట్లు?

మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుతున్న కియా సెల్టోస్, త్వరలో 'జీటీఎక్స్​ (ఓ)', 'ఎక్స్-లైన్ (ఓ)' పేరుతో మరిన్ని ఫీచర్లతో కూడిన కొత్త వేరియంట్లను లాంచ్ చేయనుంది. భరత్ ఎన్​సీఏపీ సేఫ్టీ టెస్ట్ డాక్యుమెంట్లలో ఈ పేర్లు బయటపడటంతో ఆటోమొబైల్ రంగంలో ఆసక్తి నెలకొంది.

Published on: Apr 1, 2026, 10:00:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్​లో కియా సెల్టోస్ తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే 6 లక్షల విక్రయాల మైలురాయిని దాటడమే కాకుండా, భరత్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి సత్తా చాటింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో కంపెనీ సెల్టోస్ లైనప్‌లో మరో రెండు ప్రీమియం వేరియంట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోందని సమాచారం అవే జీటీఎక్స్​ (ఓ), ఎక్స్​-లైన్​ (ఓ).

కియా సెల్టోస్​ ఎస్​యూవీ..
కియా సెల్టోస్​ ఎస్​యూవీ..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీటీఎక్స్​ (ఏ), ఎక్స్​-లైన్​ (ఏ) వేరియంట్లకు ఇవి మరింత అప్‌గ్రేడెడ్ వెర్షన్లుగా రానున్నాయి. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, భారత్​ ఎన్​సీఏపీ సేఫ్టీ టెస్ట్ పత్రాల్లో ఈ పేర్లు స్పష్టంగా కనిపించాయి.

కియా సెల్టోస్​లో కొత్త వేరియంట్లు- కొత్తగా రానున్న ఫీచర్లు ఇవే..

బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీ కియా సెల్టోస్​ కొత్త వేరియంట్లలో గతంలో మిస్ అయిన కొన్ని హై-ఎండ్ ఫీచర్లను సంస్థ మళ్లీ తీసుకువస్తోంది. అవి..

హెడ్-అప్ డిస్‌ప్లే (హెచ్​యూడీ): పాత సెల్టోస్‌లో ఉండి, కొత్త జనరేషన్‌లో తీసేసిన ఈ ఫీచర్ మళ్లీ రానుంది.

డ్యాష్‌కామ్: ఫ్యాక్టరీ ఫిటెడ్ లేదా డీలర్ ద్వారా అమర్చే డ్యాష్‌కామ్ సౌకర్యం.

పవర్డ్ ప్యాసింజర్ సీట్: డ్రైవర్‌తో పాటు పక్కన కూర్చునే వారికి కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్.

సీట్ మెమరీ ఫంక్షన్: డ్రైవర్ సౌకర్యార్థం సీట్ పొజిషన్‌ను సేవ్ చేసుకునే ఆప్షన్.

ఎయిర్ ప్యూరిఫైయర్, ఇన్-బిల్ట్ నావిగేషన్ వంటి అదనపు వసతులు.

కియా సెల్టోస్​లో కొత్త వేరియంట్లు- ఇంజిన్​ వివరాలు..

కియా సెల్టోస్​ జీటీఎక్స్​ శ్రేణిలో అగ్రెసివ్ బంపర్లు, క్రిస్టల్-కట్ అలాయ్ వీల్స్, గ్రీన్ బ్రేక్ కాలిపర్లు ఉండగా.. ఎక్స్​- లైన్ వేరియంట్ తన ట్రేడ్ మార్క్ మ్యాట్ ఫినిష్ పెయింట్, బ్లాక్డ్-అవుట్ స్టైలింగ్, రగ్గడ్ లుక్‌ను కొనసాగించనుంది. ఇక 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు అలాగే ఉంటాయి.

ఈ కొత్త వేరియంట్లు రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నాయి:

1.5ఎల్​ టర్బో పెట్రోల్: 160 హెచ్​పీ పవర్, 253 ఎన్​ఎం టార్క్ (7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్).

1.5L డీజిల్: 116 హెచ్​పీ పవర్, 250 ఎన్​ఎం టార్క్ (6-స్పీడ్ ఆటోమేటిక్).

కియా సెల్టోస్​ కొత్త వేరియంట్లు- లాంచ్ ఎప్పుడు?

కియా సెల్టోస్​లో రెండు కొత్త వేరియంట్లు మే లేదా జూన్ 2026 నాటికి మార్కెట్​లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న టాప్ వేరియంట్ల కంటే కొంచెం ఎక్కువగా అంటే రూ. 19 లక్షల నుంచి రూ. 22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండవచ్చని అంచనా.

ఫ్యామిలీ ఎస్​యూవీ కియా సెల్టోస్​కి 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్..

మరో వార్తలో భారత్​ ఎన్​సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో 2026 కియా సెల్టోస్​ ఎస్‌యూవీకి అద్భుతమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ లభించింది. అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో 32 పాయింట్లకు గాను 31.70 పాయింట్లు, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు సాధించి మెరిసింది.

భారత్ ఎన్​సీఏపీ ఈ పరీక్షల కోసం కియా సెల్టోస్ డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్లు హెచ్​టీఈ (ఓ), జీటీఎక్స్​ వేరియంట్లను ఉపయోగించింది. అయితే, ఈ 5-స్టార్ రేటింగ్ సెల్టోస్‌లోని అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. విశేషం ఏంటంటే, ఈ నెల ప్రారంభంలో పరీక్షించిన టాటా సియెర్రా కంటే సెల్టోస్ స్వల్పంగా మెరుగైన స్కోరు సాధించింది! అంతేకాకుండా, ఇప్పటివరకు భారత్ ఎన్​సీఏపీ పరీక్షించిన ఐసీఈ (ఇంధన శక్తితో నడిచే) వాహనాల్లో అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More