...
...
Next Story

భారత్​ ఎలక్ట్రానిక్స్​లో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు- పూర్తి వివరాలు ఇవి..

ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్​) వివిధ విభాగాల్లో ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ని విడుదల చేసింది. మొత్తం 119 ఖాళీల కోసం అర్హత గల అభ్యర్థులు జనవరి 9, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే..

Published on: Jan 4, 2026, 15:01:08 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్​).. నిరుద్యోగ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం కల్పిస్తోంది. ఘజియాబాద్ యూనిట్‌లో ట్రైనీ ఇంజనీర్-I, ట్రైనీ ఆఫీసర్-I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

బీఈఎల్​ రిక్రూట్​మెంట్​ అప్డేట్స్​..
బీఈఎల్​ రిక్రూట్​మెంట్​ అప్డేట్స్​..

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు బీఈఎల్​ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్​కి చివరి తేదీ జనవరి 9.

బీఈఎల్​ రిక్రూట్​మెంట్​- విభాగాల వారీగా ఖాళీలు..

బీఈఎల్​ రిక్రూట్​మెంట్​లో భాగంగా మొత్తం 119 పోస్టులను వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు కేటాయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

ఎలక్ట్రానిక్స్: 65 పోస్టులు (జనరల్-30, ఓబీసీ-20, ఈడబ్ల్యూఎస్-4, ఎస్సీ-7, ఎస్టీ-4)

మెకానికల్: 37 పోస్టులు (జనరల్-15, ఓబీసీ-10, ఈడబ్ల్యూఎస్-3, ఎస్సీ-6, ఎస్టీ-3)

ఎలక్ట్రికల్: 8 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-2, ఈడబ్ల్యూఎస్-1, ఎస్సీ-1)

కంప్యూటర్ సైన్స్: 6 పోస్టులు (ఈడబ్ల్యూఎస్-3, ఎస్టీ-3)

కెమికల్: 1 పోస్టు (జనరల్-1)

ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్): 2 పోస్టులు (ఎస్సీ-1, ఈడబ్ల్యూఎస్-1)

బీఈఎల్​ రిక్రూట్​మెంట్​- అర్హత ప్రమాణాలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో నాలుగేళ్ల బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: జనవరి 1, 2026 నాటికి.. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 ఏళ్లు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

  • బ్యాంక్​ ఉద్యోగాల అలర్ట్​- ఎస్బీఐ రిక్రూట్​మెంట్​లో వేకెన్సీ సంఖ్య పెంపు- పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

బీఈఎల్​ రిక్రూట్​మెంట్​- దరఖాస్తు రుసుము..

ఫీజును కేవలం ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు బీఈఎల్​ ట్రైనీ ఇంజనీర్​ రిక్రూట్​మెంట్​ దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ఫామ్‌లో ఇచ్చిన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీనే ఫీజు చెల్లించేటప్పుడు కూడా ఉపయోగించాలని అధికారులు సూచించారు.

బీఈఎల్​ రిక్రూట్​మెంట్​- ఎంపిక విధానం..

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాత పరీక్ష ఆధారంగానే జరుగుతుంది. ఈ పరీక్ష ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాంగణంలోనే నిర్వహిస్తారు. దరఖాస్తులో అభ్యర్థులు సమర్పించిన సమాచారం ఆధారంగా స్క్రీనింగ్ నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.

బీఈఎల్​ ట్రైనీ ఇంజనీర్​ రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ని చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

మరిన్ని వివరాల కోసం, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం అభ్యర్థులు బీఈఎల్​ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe