Bihar election results : విజయంవైపు దూసుకెళుతున్న ఎన్డీఏ- కనిపించని పీకే ప్రభావం!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపువైపు దూసుకెళుతోంది. మెజారిటీ మార్క్ని దాటేసింది. విపక్ష పార్టీలేవీ ఎన్డీఏకి దగ్గరిలో కూడా లేవు.
ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపువైపు దూసుకెళుతోంది! శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైన బీహార్ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యంతో విజయంవైపు అడుగులు వేస్తోంది. ఎన్డీఏతో పోల్చితే విపక్ష మహాఘటబంధన్ చాలా వెనకజంలో ఉంది. ప్రశాంత కిశోర్కి చెందిన జన్ సురాజ్ పార్టీ బీహార్ ప్రజలను మెప్పించడంలో పూర్తిగా విఫలమైందని ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

బీహార్ ఎన్నికల ఫలితాలు- మెజారిటీ మార్క్ దాటేసిన ఎన్డీఏ..
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్ 122. ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు ఉన్న డేటా ప్రకారం..
- ఎన్డీఏ- 142 సీట్లల్లో ఆధిక్యంలో ఉంది.
- మహాఘటబంధన్- 66 స్థానాల్లో ముందంజలో ఉంది.
- జేఎస్పీ- కేవలం 3 సీట్లల్లో మాత్రమే లీడింగ్లో కొనసాగుతోంది.
- ఇతరులు- 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- జేడీయూతో కూడిన ఎన్డీఏ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే.
బీహార్ ఎన్నికల ఫలితాలు 2025- పార్టీల వారీగా..
ఎన్డీఏ కూటమిలో బీజేపీ 76 సీట్లో ఆధిక్యంలో ఉంది. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 63 చోట్ల ముందంజలో ఉంది. మరోవైపు మహాఘటబంధన్లో కీలకమైన, తేజస్వీ యాదవ్కి చెందిన ఆర్జేడీ 60 సీట్లల్లో లీడింగ్లో ఉంది. వాస్తవానికి ఎన్డీఏకి అత్యధిక సీట్లు లభిస్తున్నప్పటికీ, ఒకానొక సమయంలో ఆర్జేడీ ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉండి అతిపెద్ద పార్టీగా కొనసాగింది. ఆ తర్వాత చాలా సీట్లల్లో బీజేపీ ముందుకు కదిలింది.
మరోవైపు మహాఘటబంధన్లో మరో కీలక పార్టీ కాంగ్రెస్ కేవలం 11 స్థానాల్లోనే లీడింగ్లో కొనసాగుతోంది.
కనిపించని పీకే ప్రభావం..
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కి చెందిన జేెఎస్పీ.. తొలిసారి బీహార్ ఎన్నికల బరిలో నిలిచింది. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ జేఎస్పీకి 5 సీట్ల కన్నా ఎక్కువ రావు అని తేల్చెశాయి. కాగా బీహార్ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియను చూస్తుంటే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం అయ్యేలా కనిపిస్తోంది.
మొత్తం 243 సీట్లల్లో పోటీకి దిగిన జేఎస్పీ.. ఎన్డీఏ- మహాఘటబంధన్కు తాము ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకుంది. కానీ అది బీహార్ ప్రజలను ఆకట్టుకోలేదని స్పష్టమవుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


