ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ అప్పీల్ చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది.
ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ పిటిషన్….

రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే సీబీఐ… తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా తాము సేకరించిన కీలక అంశాలను మరియు సాక్ష్యాలను ట్రయల్ కోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ) పేర్కొంది. దర్యాప్తు సంస్థ సమర్పించిన సాక్ష్యాధారాలను విస్మరించడం జరిగిందని… తక్షణమే ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని హైకోర్టును కోరింది.
రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయటంతో…. ఈ పిటిషన్ పై హైకోర్టు ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. సుమారు రెండేళ్లుగా సాగుతున్న ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్, సిసోడియా తదితరులు జైలు శిక్షను అనుభవించి బెయిల్పై బయటకు వచ్చారు. తాజాగా దిగువ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ గంటల వ్యవధిలోనే సీబీఐ… అప్పీల్ పిటిషన్ దాఖలు చేయటంతో ఈ కేసులో ఏమైనా కీలక పరిణామాలు ఉంటాయా అన్న చర్చ కూడా మొదలైంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా , మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులపై మోపిన అభియోగాలకు తగిన సాక్ష్యాధారాలు లేవని, నేరపూరిత కుట్ర జరిగినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని స్పష్టం చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అనేక లోపాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.
కోర్టు తీర్పును ఆమ్ అద్మీ పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు స్వాగతించాయి. లిక్కర్ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరిపితమైందని… ఇదే విషయాన్ని మొదట్నుంచి చెబుతున్నామని అంటున్నాయి.
{{/usCountry}}కోర్టు తీర్పును ఆమ్ అద్మీ పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు స్వాగతించాయి. లిక్కర్ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరిపితమైందని… ఇదే విషయాన్ని మొదట్నుంచి చెబుతున్నామని అంటున్నాయి.
{{/usCountry}}