Rajdhani express fire today : కేరళ నుంచి దిల్లీకి వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం (మే 17) ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. కోట డివిజన్ పరిధిలోని లుని రిచ్ఛా - విక్రమ్గఢ్ ఆలోట్ రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో రైలులోని ఒక ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని రైల్వే శాఖ ప్రకటించింది.
రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం- అసలేం జరిగింది?

ఉదయం 5:15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కేరళలోని తిరువనంతపురం నుంచి దిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు వెళుతున్న రైలు నంబర్ 12431 రాజధాని ఎక్స్ప్రెస్.. రత్లాం దాటిన తర్వాత ఈ ఘోర ప్రమాదానికి గురైంది. రైలులోని బీ-1 ఏసీ కోచ్లో మొదట మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో సదరు కోచ్లో మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలను గమనించిన రైలు గార్డ్ వెంటనే లోకో పైలట్ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేశారు.
రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే కోచ్లోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. ఆ తర్వాత ప్రమాద తీవ్రత పెరగకుండా ఉండేందుకు వెస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ సప్లై (ఓహెచ్ఈ) విద్యుత్ కనెక్షన్ను నిలిపివేశారు. మంటలు అంటుకున్న బీ-1 కోచ్ను రైలు నుంచి విజయవంతంగా వేరు చేశారు.
{{/usCountry}}రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే కోచ్లోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. ఆ తర్వాత ప్రమాద తీవ్రత పెరగకుండా ఉండేందుకు వెస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ సప్లై (ఓహెచ్ఈ) విద్యుత్ కనెక్షన్ను నిలిపివేశారు. మంటలు అంటుకున్న బీ-1 కోచ్ను రైలు నుంచి విజయవంతంగా వేరు చేశారు.
{{/usCountry}}అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
అసలు కోచ్లో మంటలు ఎలా చెలరేగాయి అనేదానిపై రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు దిల్లీ చేరుకోవాల్సి ఉంది. ప్రమాదం జరిగే సమయానికి రైలు అప్పటికే 2,600 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది.
రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు- ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
రైలులో నుంచి దించేసిన 68 మంది ప్రయాణికులను ప్రస్తుతానికి అదే రైలులోని ఇతర కోచ్లలో సర్దుబాటు చేసి కోట స్టేషన్ వరకు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. కోట రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత రైలుకు అదనంగా మరో ఏసీ కోచ్ను అమర్చి ప్రయాణికులకు పూర్తి సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ మధ్య రైల్వే పీఆర్ఓ రవీంద్ర లఖారా తెలిపారు.
కాగా, ఈ ప్రమాదం కారణంగా దిల్లీ-ముంబై రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను వేర్వేరు స్టేషన్లలో నిలిపివేశారు.
మొన్న మరో రైలులో..
శుక్రవారమే మరో రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్లోని ఒక రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న హైదరాబాద్- జైపూర్ స్పెషల్ ట్రైన్లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు ఎక్కేందుకు ప్లాట్ఫామ్ మీదకు తీసుకొస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో రైలులో ఎవరూ లేకపోవడంతో ఎవరికి గాయాలవ్వలేదు.
అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రభావితమైన బోగీలను తప్పించి రైలును సిద్ధం చేశారు.