పశ్చిమాసియా దాడులు, ప్రతీకార దాడులతో అట్టుడుకుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. రాయబార కార్యాలయాలపై కూడా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ డ్రోన్ దాడులతో అనేక ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి.

ఒమన్లో ఇరాన్ డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. ఒమన్ గల్ఫ్లో ఒక ఇరాన్ డ్రోన్ ఆయిల్ ట్యాంకర్పై దాడి చేసింది. ఆ నౌకను MKD VYOMగా గుర్తించారు. హార్ముజ్ జలసంధిని సమీపిస్తున్న ఓడలను ఇరాన్ బెదిరిస్తోంది. ఒమన్ గల్ఫ్లో జరిగిన దాడిని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఒమన్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. చనిపోయిన సిబ్బంది భారతదేశానికి చెందినవారని తెలిపింది.
వార్తా సంస్థ రాయిటర్స్ MKD VYOMను ఒక డ్రోన్ ఢీకొట్టిందని తెలిపింది. ఆ ప్రమాదంలో ఓడ ఒమన్ తీరం వెంబడి ప్రయాణిస్తుండగా అందులో ఉన్న ఒక సిబ్బంది మరణించారని పేర్కొంది. మెుదటగా బాధితుడిని గుర్తించలేదు, తర్వాత భారతీయుడని తెలిసింది. సంఘటన జరిగిన సమయంలో ఇంజిన్ గదిలో ఉన్న భారతదేశానికి చెందిన వ్యక్తి మరణించారు.
నెతన్యాహు కార్యాలయంపై దాడి!
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ మిస్సైల్స్ దాడి చేసిందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నివేదించింది. ఆపరేషన్ ట్రూప్ ప్రామిస్ 4లో భాగంగా ఇరాన్ అటాక్ చేసినట్టుగా ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టుగా వెల్లడించింది. ప్రస్తుతం నెతన్యాహు ఎక్కడ ఉన్నారో తెలియని పేర్కొంది. అయితే ఇరాన్ చేసిన ప్రకటనను మాత్రం ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఇరాన్లో ఇద్దరు సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులను చంపేసినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటన చేసింది.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యతో ఇరాన్ ప్రతీకారదాడులు చేస్తోంది. గల్ఫ్ ప్రాంతం అంతా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులపై వరుసగా దాడులు కొనసాగిస్తోంది ఇరాన్.
ప్రధాని మోదీ ఆందోళన
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశం శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉందని అన్నారు.
{{/usCountry}}పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశం శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉందని అన్నారు.
{{/usCountry}}ఇటువంటి వివాదాలను పరిష్కరించడానికి భారతదేశం ఎల్లప్పుడూ చర్చలు, దౌత్యం కోసం సలహా ఇస్తుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. భారత ప్రభుత్వం అన్ని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందని, భారత పౌరుల భద్రతను నిర్ధారించడానికి ఈ ప్రాంతంలోని దేశాలతో సంప్రదింపులు జరుపుతోందని కూడా మోదీ వ్యాఖ్యానించారు.