దశాబ్ద కాలంలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ పతనాన్ని మూటగట్టుకున్న తర్వాత, బంగారం ధరలు సోమవారం మరింత క్షీణించాయి. అదే సమయంలో రికార్డు స్థాయి గరిష్టాల నుంచి అమాంతం వెనక్కి తగ్గిన వెండి ధరలు సైతం తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతున్నాయి.

సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఏకంగా 6.3% మేర పడిపోయింది. వెండి ధర కూడా తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనైంది. ఒక దశలో 3.2% మేర లాభపడిన వెండి, ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి ఒక ఔన్సు ధర దాదాపు 75 డాలర్ల వద్దకు పడిపోయింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో వెండి తన చరిత్రలోనే అత్యధిక ‘ఇంట్రాడే’ నష్టాన్ని నమోదు చేసింది.
ఎంసీఎక్స్లో బంగారం, వెండి ధరలు ఇలా..
దేశీయ ఎంసీఎక్స్లో కూడా బంగారం, వెండి ధరలు నష్టాల్లో కొనసాగుతున్నయి. ఎంసీఎక్స్ గోల్డ్ ప్రైజ్ 1.5శాతం నష్టాలతో రూ. 1,40,000 వద్ద ఉంది. ఎంసీఎక్స్ సిల్వర్ ధర 4శాతం పతనమై రూ. 2,55,652 వద్ద కొనసాగుతోంది.
గురువారం నమోదు చేసిన రికార్డు స్థాయి (రూ. 4,20,000) నుంచి వెండి ధర దాదాపు 40శాతం డౌన్లో ఉంది. గత రెండు సెషన్స్లోనే వెండి ధర భారీగా పతనమైంది.
నిపుణుల మాటలు..
"ఇది ఇంకా ముగియలేదు," అని జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కో మాజీ ప్రెషియస్ మెటల్స్ ట్రేడర్, ప్రస్తుత ఇండిపెండెంట్ మార్కెట్ విశ్లేషకుడిగా ఉన్న రాబర్ట్ గాట్లీబ్ పేర్కొన్నారు. రిస్క్ తీసుకోవడానికి ఎవరూ సుముఖంగా లేకపోవడం వల్ల మార్కెట్ లిక్విడిటీ తగ్గుతుందని ఆయన తెలిపారు.
"ధరలు ఎక్కడైనా నిలకడగా ఉంటాయో లేదో మనం చూడాలి. అసలు విషయం ఏంటంటే, ఈ ట్రేడ్ విపరీతమైన రద్దీతో నిండిపోయింది," అని అన్నారు.
{{/usCountry}}"ధరలు ఎక్కడైనా నిలకడగా ఉంటాయో లేదో మనం చూడాలి. అసలు విషయం ఏంటంటే, ఈ ట్రేడ్ విపరీతమైన రద్దీతో నిండిపోయింది," అని అన్నారు.
{{/usCountry}}గత ఏడాది కాలంగా, పసిడి లోహాలు ఆల్టైమ్ రికార్డు గరిష్టాలకు చేరుకుని అనుభవజ్ఞులైన ట్రేడర్లను సైతం ఆశ్చర్యపరిచాయి. జనవరిలో ఈ ర్యాలీ మరింత వేగవంతమైంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, కరెన్సీ విలువల పతనం, ఫెడరల్ రిజర్వ్ స్వయంప్రతిపత్తిపై ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై భారీగా పెట్టుబడులు పెట్టారు. చైనాకు చెందిన స్పెక్యులేటర్ల కొనుగోళ్లు ఈ ర్యాలీకి మరింత ఊపునిచ్చాయి.
కానీ గత వారం రోజులుగా మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. బంగారం, వెండి అత్యత భారీ పతనాన్ని చూస్తున్నాయి.
గత కొన్ని రోజుల పతనానికి ప్రధాన కారణం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడ్ అధ్యక్షుడిగా కెవిన్ వార్ష్ పేరును ప్రతిపాదించడంతో బంగారం, వెండి ధరలు పడ్డాయి. ఈ వార్త.. డాలర్ విలువను పెంచి, ట్రంప్ హయాంలో కరెన్సీ బలహీనపడుతుందని ఆశించిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో వార్ష్ చాలా కఠినంగా ఉంటారని ట్రేడర్లు భావిస్తున్నారు. దీనివల్ల డాలర్ మరింత బలోపేతం అవుతుందని, ఫలితంగా డాలర్లో ధర నిర్ణయించే బంగారం బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే, పసిడి అప్పటికే తీవ్రమైన మార్పులకు సిద్ధంగా ఉంది. పెరిగిన ధరలు, ఒడిదుడుకులు ట్రేడర్ల రిస్క్ మోడల్స్, బ్యాలెన్స్ షీట్లపై ఒత్తిడి పెంచాయి. ‘కాల్ ఆప్షన్ల’ కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరగడం వల్ల ధరల పెరుగుదల వేగం కృత్రిమంగా పెరిగిందని గోల్డ్మన్ సాక్స్ గ్రూప్ ఇంక్ ఒక నోట్లో తెలిపింది.
ఇక సింగపూర్ సమయం ప్రకారం ఉదయం 9:21 గంటలకు, బంగారం 4.4% తగ్గి ఒక ఔన్సు ధర 4,680.76 డాలర్లకు చేరింది. వెండి 2.2% తగ్గి 83.2965 డాలర్ల వద్దకు పడిపోయింది. ప్లాటినం, పల్లాడియం ధరలు కూడా క్షీణించాయి. అమెరికా కరెన్సీని కొలిచే బ్లూమ్బెర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్, గత సెషన్లో 0.9% పెరిగిన తర్వాత నేడు మరో 0.1% వృద్ధి చెందింది.