...
...
Next Story

Gold vs Nifty 50 : పసిడి వర్సెస్ నిఫ్టీ 50.. 20ఏళ్ల ఇన్వెస్ట్​మెంట్​లో ఏది ఎంత రిటర్ను ఇచ్చింది?

గత 20 ఏళ్లలో బంగారం, నిఫ్టీ 50 చెరో రూ.1 లక్షను ఊహించని రీతిలో పెంచాయి. అయితే చేతికి వచ్చే అసలు రాబడిని పన్నుల భారం ఏ విధంగా మారుస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! పన్నుల తర్వాతి నికర లాభాల విశ్లేషణ ఇక్కడ చూడండి.

Published on: Sep 19, 2026, 05:26:11 IST
Advertisement

సాధారణంగా స్టాక్ మార్కెట్లే ఎక్కువ రాబడిని ఇస్తాయని మెజారిటీ పెట్టుబడిదారులు భావిస్తుంటారు. అయితే గత రెండు దశాబ్దాల గణాంకాలను గమనిస్తే బంగారం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రధాన సూచీల కంటే ఎక్కువ రాబడిని అందించింది!

20ఏళ్ల ఇన్వెస్ట్​మెంట్​లో ఏది ఎంత రిటర్ను ఇచ్చింది?
20ఏళ్ల ఇన్వెస్ట్​మెంట్​లో ఏది ఎంత రిటర్ను ఇచ్చింది?

ఇరవై ఏళ్ల క్రితం నిఫ్టీ 50, గోల్డ్ ఈటీఎఫ్ రెండింటిలోనూ చెరో రూ.1 లక్ష చొప్పున లంప్‌సమ్‌గా పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఖాతాను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. వార్షిక రాబడి (సీఏజీఆర్) ప్రాతిపదికన నిఫ్టీ 50లో పెట్టిన రూ.1 లక్ష నేడు రూ.8.98 లక్షలుగా మారగా, పసిడిలో పెట్టిన రూ.1 లక్ష ఏకంగా రూ.15 లక్షల మైలురాయిని చేరుకుంది.

Investment horizonNifty 50 TRI CAGR 1 lakh in Nifty 50Gold CAGR 1 lakh in gold
20 years11.6% 8,98,01614.5% 15,00,064

*Source: FundsIndia’s Wealth Conversations Report, Data as on 31 August 2026, Gold returns are adjusted for USD-INR Exchange Rate

పన్నుల సవాలు: చేతికొచ్చే నికర లాభం ఎంత?

కేవలం పన్నులకు ముందు వచ్చే రాబడి చూసి మురిసిపోతే సరిపోదు. పెట్టుబడులను విక్రయించే సమయంలో చెల్లించాల్సిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అసలు ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.

ఈ రెండు అసెట్ క్లాసులకు పన్ను నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి.

ఈక్విటీ ఆధారిత నిఫ్టీ 50 ఈటీఎఫ్ అమ్మకంపై వచ్చే లాభాల్లో ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్​టీసీజీ) మినహాయింపు లభిస్తుంది. ఆ పరిమితి దాటిన లాభంపై 12.5 శాతం పన్ను వర్తిస్తుంది.

ParticularsNifty 50 ETFGold ETF
Initial investment 1,00,000 1,00,000
Value before tax 8,98,016 15,00,064
Pre-tax gain 7,98,016 14,00,064
LTCG exemption 1,25,000Nil
Taxable LTCG 6,73,016 14,00,064
LTCG tax @ 12.5% 84,127 1,75,008
Post-tax gain 7,13,889 12,25,056
Final value after tax 8,13,889 13,25,056

*Investment Period: 20 years; Excludes surcharge and cess; Actual calculation may vary; Gold and Nifty 50 TRI returns are used as proxies for the respective ETFs, assuming the ETFs were available for investment 20 years ago.

View All

లెక్కింపు వివరాలు: నిఫ్టీ 50 వర్సెస్ గోల్డ్

నిఫ్టీ 50 ఈటీఎఫ్ లో రూ.1 లక్ష కాస్తా రూ.8.98 లక్షలుగా మారడంతో రూ.7.98 లక్షల మూలధన లాభం సమకూరింది. ఇందులో రూ.1.25 లక్షల పన్ను మినహాయింపు పోగా మిగిలిన రూ.6.73 లక్షలపై 12.5 శాతం చొప్పున సుమారు రూ.84,000 పన్ను రూపంలో చెల్లించాలి. దీనితో పెట్టుబడిదారుడికి నికరంగా రూ.8.14 లక్షలు చేతికి అందుతాయి.

పసిడి విషయానికి వస్తే, రూ.1 లక్ష పెరిగిన రూ.15 లక్షలలో మొత్తం రూ.14 లక్షలు మూలధన లాభమే అవుతుంది. ఎలాంటి మినహాయింపు లేకపోవడంతో మొత్తం రూ.14 లక్షలపై 12.5 శాతం చొప్పున దాదాపు రూ.1.75 లక్షలు పన్నుగా చెల్లించాలి. పన్నుల చెల్లింపు పూర్తయ్యాక నికరంగా రూ.13.25 లక్షలు పెట్టుబడిదారుడికి మిగులుతాయి.

రాబడి శాతంలో వ్యత్యాసాలు..

పన్నుల భారం పడిన తర్వాత వార్షిక సమ్మేళన రాబడి (సీఏజీఆర్) రేట్లలో స్వల్ప తగ్గింపు కనిపిస్తుంది:

నిఫ్టీ 50: పన్నులకు ముందు ఉన్న 11.6 శాతం వార్షిక రాబడి, పన్నులు చెల్లించిన తర్వాత 11.05 శాతానికి తగ్గుతుంది.

పసిడి : పన్నులకు ముందు ఉన్న 14.5 శాతం వార్షిక రాబడి, పన్నుల అనంతరం 13.79 శాతానికి పడిపోతుంది.

"పెట్టుబడి ఏ రకమైనదైనా, పైకి కనిపించే గ్రాస్ రాబడి కంటే పన్నులు మినహాయించగా వచ్చే నికర రాబడే అసలైన సంపదను నిర్ణయిస్తుంది," అని ఆర్థిక రంగానికి చెందిన విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఈ విశ్లేషణను నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్, బంగారం బెంచ్ మార్క్ ఆధారంగా లెక్కించారు. వాస్తవ ఈటీఎఫ్ రాబడులు ఎక్స్‌పెన్స్ రేషియోలు, ట్రాకింగ్ ఎర్రర్ల ఆధారంగా క్షేత్రస్థాయిలో స్వల్పంగా మారే అవకాశం ఉంటుంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించాల్సిన అవసరం ఉంది.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks