దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న తరుణంలో వాతావరణ శాఖ చేదువార్త చెప్పింది. ఈక్వటోరియల్ పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్నినో' (El Niño) ప్రభావం మొదలైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ధృవీకరించింది. రాబోయే రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని, దీనివల్ల దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు

తాజాగా విడుదల చేసిన ఎల్నినో సదరన్ ఆసిలేషన్ (ENSO), ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) బులెటిన్ ప్రకారం.. కేంద్ర పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్నినో పరిమితిని దాటేశాయి. సముద్రపు నీరు వేడెక్కడానికి అనుగుణంగా వాతావరణంలోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సముద్రం, వాతావరణం కలిసికట్టుగా ఎల్నినో లక్షణాలను ప్రదర్శిస్తున్నాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. జపాన్ వాతావరణ సంస్థ కూడా రెండు రోజుల క్రితమే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది. ఇప్పటివరకు ఈ పరిమితికి దగ్గరగా ఉందని చెబుతూ వచ్చిన ఐఎండీ, ఇప్పుడు అధికారిక ముద్ర వేసింది.
సాధారణం కంటే తక్కువ వర్షపాతం
ఎల్నినో ముప్పును ముందే ఊహించిన ఐఎండీ, మే 29న తన ముందస్తు అంచనాలను సవరించింది. ఈ ఏడాది రుతుపవనాల కాలంలో దీర్ఘకాలిక సగటు (LPA)లో కేవలం 90 శాతం మాత్రమే వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఏప్రిల్లో ఈ అంచనా 92 శాతంగా ఉండేది. సీజన్ రెండో సగభాగంలో (ఆగస్టు, సెప్టెంబర్) ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వర్షాలు బాగా తగ్గుతాయని స్పష్టం చేసింది. 1971-2020 మధ్య డేటా ఆధారంగా దేశ సగటు వర్షపాతం (LPA) 87 సెంటీమీటర్లుగా ఉంది. ఈసారి వర్షాలు లోపించే అవకాశం 60 శాతం వరకు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒకవైపు రుతుపవనాలు.. మరోవైపు ఎండలు
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు పశ్చిమ బెంగాల్, బిహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, ఒడిశా, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. పశ్చిమ అక్షాంశాల అలజడి (Western Disturbance) కారణంగా వాయవ్య భారతదేశంలో జూన్ 13 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో తెలంగాణ, రాజస్థాన్, మరాఠ్వాడాల్లో జూన్ 13 వరకు తీవ్రమైన ఎండలు, వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. విదర్భలో జూన్ 16 వరకు వడగాల్పుల తీవ్రత కొనసాగనుంది.
గత ఏడాది లానినా.. ఇప్పుడు ఎల్నినో
{{/usCountry}}ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు పశ్చిమ బెంగాల్, బిహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, ఒడిశా, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. పశ్చిమ అక్షాంశాల అలజడి (Western Disturbance) కారణంగా వాయవ్య భారతదేశంలో జూన్ 13 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో తెలంగాణ, రాజస్థాన్, మరాఠ్వాడాల్లో జూన్ 13 వరకు తీవ్రమైన ఎండలు, వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. విదర్భలో జూన్ 16 వరకు వడగాల్పుల తీవ్రత కొనసాగనుంది.
గత ఏడాది లానినా.. ఇప్పుడు ఎల్నినో
{{/usCountry}}గత ఏడాది ఆగస్టు 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు పసిఫిక్లో 'లానినా' (La Niña) ప్రభావం కొనసాగింది. ఆ తర్వాత మార్చి నుంచి మే వరకు సాధారణ (Neutral) పరిస్థితులు ఉన్నాయి. అయితే జూన్ నాటికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 0.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటి ఎల్నినో వైపు మళ్లింది. 'మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్కాస్ట్ సిస్టమ్' (MMCFS) అంచనాల ప్రకారం, జూలై-సెప్టెంబర్ నాటికి పసిఫిక్ మహాసముద్రంలో ఈ వేడి మరింత పెరిగి తీవ్ర రూపం దాల్చనుంది.
ఐఓడీ (IOD) కూడా కలిసి రావడం లేదు
భారతదేశంలో ఎల్నినో అంటే బలహీనమైన రుతుపవనాలు, తీవ్రమైన ఎండలకు సంకేతం. హిందూ మహాసముద్రంలో ఏర్పడే 'ఇండియన్ ఓషన్ డైపోల్' (IOD) సానుకూలంగా (Positive) ఉంటే, అది ఎల్నినో ప్రభావాన్ని కొంతవరకు అడ్డుకుని ఉపఖండానికి తేమను అందిస్తుంది. కానీ ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో సాధారణ (Neutral) పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. ఐఓడీ తటస్థంగా ఉండటం వల్ల ఎల్నినో అడ్డంకులు లేకుండా మరింత బలంగా మారుతుందని, ఫలితంగా రుతుపవనాల పురోగతి నెమ్మదించి వర్షాలు తగ్గుతాయని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు. ఐఓడీ సానుకూలంగా ఉంటే కొంత ఉపశమనం లభించేదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో పూర్తి ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.