టీ20 ప్రపంచకప్ 2026లో ఫ్యాన్స్ కు ఇండియన్ క్రికెట్ టీమ్ భలే కిక్ ఇచ్చింది. అత్యంత అవసరమైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం (ఫిబ్రవరి 26) రాత్రి ముగిసిన మ్యాచ్ లో జింబాబ్వేను 72 రన్స్ తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ గ్రాండ్ విక్టరీతో టీ20 ప్రపంచకప్ లో ఇండియా సెమీఫైనల్ ఛాన్స్ మరింత మెరుగయ్యాయి.
ఇండియా గ్రాండ్ విక్టరీ

టీ20 ప్రపంచకప్ సూపర్ 8 పోరులో భారత్ అదరగొట్టింది. 72 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. చెన్నైలోని చెపాక్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 256/4 భారీ స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ 55, హార్దిక్ పాండ్య 50 నాటౌట్, తిలక్ వర్మ 44 రన్స్ తో అదరగొట్టారు. ఛేజింగ్ లో జింబాబ్వే 184/6 స్కోరుకు పరిమితమైంది. అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు.
దక్షిణాఫ్రికా విజయంతో
ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ కంటే ముందు వెస్టిండీస్ ను దక్షిణాఫ్రికా ఓడించడమూ ఇండియాకు కలిసొచ్చింది. ఒకవేళ వెస్టిండీస్ గెలిచి ఉంటే నెట్ రన్ రేట్ పరంగా భారత్ కు షాక్ తగిలేది. ఇప్పుడు సూపర్ 8 గ్రూప్-1లో దక్షిణాఫ్రికా ఆడిన 2 మ్యాచ్ ల్లోనూ గెలిచి 4 పాయింట్లు, 2.890 నెట్ రన్ రేట్ తో టాప్ ప్లేస్ లో ఉంది. ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ ఓడిన వెస్టిండీస్ (2 పాయింట్లు, 1.791 నెట్ రన్ రేట్) రెండో ప్లేస్ లో ఉంది. ఇండియా ఏమో ఒక ఓటమి, ఒక విజయంతో 2 పాయింట్లు, -0.100 నెట్ రన్ రేట్ తో మూడో ప్లేస్ లో ఉంది.
భారత్ సెమీస్ చేరాలంటే
గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకుంది. జింబాబ్వే రేసు నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన ఒక బెర్త్ కోసం వెస్టిండీస్, ఇండియా మధ్య ఫైట్ నెలకొంది. ఈ రెండు టీమ్స్ మార్చి 1న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో తలపడతాయి. ఇందులో గెలిచిన టీమ్ సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ఓడిన టీమ్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సిందే.
{{/usCountry}}గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకుంది. జింబాబ్వే రేసు నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన ఒక బెర్త్ కోసం వెస్టిండీస్, ఇండియా మధ్య ఫైట్ నెలకొంది. ఈ రెండు టీమ్స్ మార్చి 1న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో తలపడతాయి. ఇందులో గెలిచిన టీమ్ సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ఓడిన టీమ్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సిందే.
{{/usCountry}}అంటే ఇప్పుడు భారత్ సెమీఫైనల్ చేరాలంటే వెస్టిండీస్ ను కచ్చితంగా ఓడించాలి. ఇక్కడ నెట్ రన్ రేట్ తో అవసరం లేదు. కేవలం ఇండియా విజయం సాధిస్తే సరిపోతుంది. ఈ మ్యాచ్ ఇండియాకు నాకౌట్ లాంటిదే. ఓడిపోతే ఇంటి ముఖం పట్టాల్సిందే. టీమిండియా సెమీస్ చేరుతుందో లేదా సూపర్ 8లోనే నిష్క్రమిస్తుందో అన్నది మార్చి 1, ఆదివారం తేలనుంది.