భారత సైన్యంలో పనిచేసే అధికారులు, జవాన్లకు సోషల్ మీడియా వినియోగంపై ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్ వినియోగం అనివార్యమైనప్పటికీ, దేశ భద్రత, క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠిన నిబంధనలను విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (DGMI) ఈ ఉత్తర్వులను తక్షణమే అమలులోకి తెచ్చింది.
ఏ యాప్.. ఎలా వాడాలి?

కొత్త పాలసీ ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వినియోగాన్ని సైన్యం వర్గీకరించింది.
- ఇన్స్టాగ్రామ్ (Instagram): సైనికులు ఇన్స్టాగ్రామ్ను కేవలం చూడటానికి (Viewing only) మాత్రమే ఉపయోగించాలి. పోస్టులపై ఎలాంటి కామెంట్స్ చేయకూడదు, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదు.
- వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్: ఈ మెసేజింగ్ యాప్స్ ద్వారా కేవలం తెలిసిన వ్యక్తులతో మాత్రమే సంభాషించాలి. సాధారణ సమాచారాన్ని మాత్రమే పంచుకోవాలి. ఎవరికి మెసేజ్ పంపిస్తున్నారో ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని, రహస్య సమాచారం (Classified Info) అస్సలు పంపకూడదని ఆర్మీ హెచ్చరించింది.
- యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), క్వోరా: వీటిని కేవలం జ్ఞాన సముపార్జన కోసం లేదా సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే వాడాలి. సొంతంగా కంటెంట్ను అప్లోడ్ చేయడం లేదా మెసేజ్లను షేర్ చేయడం నిషిద్ధం.
- లింక్డ్ఇన్ (LinkedIn): కేవలం ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం, రెజ్యూమెలను అప్లోడ్ చేయడానికి మాత్రమే దీనిని అనుమతించారు.
జనరల్ ఉపేంద్ర ద్వివేది అభిప్రాయం
ఇటీవల జరిగిన ‘చాణక్య డిఫెన్స్ డైలాగ్’లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి యువత స్మార్ట్ఫోన్లకు ఎంతలా అలవాటు పడ్డారో ఆయన వివరిస్తూ..
"ఎన్డీఏ (NDA)లో చేరే యువకులు కూడా మొదట తమ క్యాబిన్లలో ఫోన్లు ఎక్కడ దాచుకోవాలో అని వెతుకుతూ ఉంటారు. వారికి ఫోన్ లేకుండా కూడా జీవితం ఉంటుందని నమ్మించడానికి మాకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది" అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు.
{{/usCountry}}"ఎన్డీఏ (NDA)లో చేరే యువకులు కూడా మొదట తమ క్యాబిన్లలో ఫోన్లు ఎక్కడ దాచుకోవాలో అని వెతుకుతూ ఉంటారు. వారికి ఫోన్ లేకుండా కూడా జీవితం ఉంటుందని నమ్మించడానికి మాకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది" అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు.
{{/usCountry}}అయితే, సైనికులకు స్మార్ట్ఫోన్ ఒక అవసరమని కూడా ఆయన అంగీకరించారు. సరిహద్దుల్లో కుటుంబానికి దూరంగా ఉండే జవాన్లకు.. తమ పిల్లల ఫొటోలు చూడటానికి, క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫోన్ ఒక వారధిలా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రియాక్షన్ వద్దు.. రెస్పాన్స్ ముఖ్యం
సోషల్ మీడియాలో ఏదైనా విషయం చూడగానే వెంటనే స్పందించడం (React) కంటే, ఆలోచించి స్పందించడం (Respond) ముఖ్యమని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. సైనికులు ఆవేశంతో ఏదైనా పోస్ట్ చేస్తే అది శత్రువులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని, అందుకే 'వ్యూ ఓన్లీ' (View Only) పాలసీని తెచ్చామని వివరించారు. ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటే అది రిటైర్మెంట్ తర్వాతే చేయాలని ఆయన హితవు పలికారు. ఈ క్రమశిక్షణ సైన్యం యొక్క పటిష్టతను చాటిచెబుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.