టీమిండియా అదరగొట్టింది. కొత్త చరిత్ర సృష్టించింది. హిస్టరీ అందుకుంది. వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి జట్టుగా రికార్డు ఖాతాలో వేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఇండియా 96 రన్స్ తేడాతో ఓడించింది.
విశ్వ విజేత భారత్

టీమిండియా మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఆదివారం (మార్చి 8) టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజు శాంసన్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52), శివమ్ దూబె (8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) చెలరేగారు.
కివీస్ ఛేజింగ్
ఛేజింగ్ లో న్యూజిలాండ్ ను భారత బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు. డేంజరస్ బ్యాటర్లతో నిండిన కివీస్ కు బ్రేక్ వేశారు. ఛేజింగ్ లో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా 4 వికెట్లతో చెలరేగాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు.
స్పిన్ తో బ్రేక్
న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ ఈ ప్రపంచకప్ లోనే మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ వీళ్లకు తెలివిగా స్పిన్నర్ అక్షర్ పటేల్ తో ఇండియా బ్రేక్ వేసింది. అలెన్ (9)ను అక్షర్ ఔట్ చేశాడు. ఆ వెంటనే రచిన్ (1)ను బుమ్రా, ఫిలిప్స్ (5)ను అక్షర్ పెవిలియన్ చేర్చారు. ఓ ఎండ్ లో సీఫర్ట్ (26 బంతుల్లో 52) పోరాడాడు. కానీ చాప్ మన్ (3)ను హార్దిక్, సీఫర్ట్ ను వరుణ్ వరుస ఓవర్లలో ఔట్ చేశారు.
గెలుపు ఖాయం
{{/usCountry}}న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ ఈ ప్రపంచకప్ లోనే మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ వీళ్లకు తెలివిగా స్పిన్నర్ అక్షర్ పటేల్ తో ఇండియా బ్రేక్ వేసింది. అలెన్ (9)ను అక్షర్ ఔట్ చేశాడు. ఆ వెంటనే రచిన్ (1)ను బుమ్రా, ఫిలిప్స్ (5)ను అక్షర్ పెవిలియన్ చేర్చారు. ఓ ఎండ్ లో సీఫర్ట్ (26 బంతుల్లో 52) పోరాడాడు. కానీ చాప్ మన్ (3)ను హార్దిక్, సీఫర్ట్ ను వరుణ్ వరుస ఓవర్లలో ఔట్ చేశారు.
గెలుపు ఖాయం
{{/usCountry}}న్యూజిలాండ్ 11 ఓవర్లలో 103/5తో నిలవడంతో ఇండియా విక్టరీ ఖాయమైంది. కానీ మిచెల్ శాంట్నర్, డరిల్ మిచెల్ కలిసి కొన్ని భారీ షాట్లు కొట్టారు. అయితే మిచెల్ ను అక్షర్ బుట్టలో వేసుకున్నాడు. చివరకు కివీస్ ఆలౌటైంది.
ఇండియా రికార్డులు
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో గెలిచిన ఇండియా కొన్ని రికార్డులు ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ లు గెలిచిన ఫస్ట్ టీమ్ భారత్. అలాగే టీ20 ప్రపంచకప్ నెగ్గిన తొలి ఆతిథ్య దేశం కూడా ఇండియానే. ఈ పొట్టి కప్ ను అత్యధిక సార్లు (3) గెలుచుకున్న టీమ్ భారత్. 2007, 2024లోనూ భారత్ గెలిచింది. ధోని, రోహిత్ శర్మ తర్వాత ఇండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ గా సూర్యకుమార్ నిలిచాడు.
కివీస్ కన్నీళ్లు
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇండియా చేతిలో ఓటమితో కివీస్ ఆటగాళ్లు కన్నీళ్లలో మునిగిపోయారు. న్యూజిలాండ్ టీమ్ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలుచుకోలేదు. ఇప్పుడు తుదిపోరులో మళ్లీ ఓడింది. కివీస్ ఫ్యాన్స్ కూడా ఈ బాధ తట్టుకోలేకపోయారు.