క్రికెట్ లవర్స్ గెట్ రెడీ.. రెండు నెలల పాటు ఐపీఎల్ వినోదంలో మునిగిపోయేందుకు సిద్ధమైపోండి. ఐపీఎల్ 2026 వచ్చేస్తోంది. మార్చి 28నే ఐపీఎల్ కొత్త సీజన్ కు తెరలేవనుంది. మరో రెండు రోజుల్లోనే ఐపీఎల్ 19 ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడే ఫస్ట్ హోం గేమ్ టికెట్లు ఇవాళే సేల్ కు వస్తున్నాయి.
సన్రైజర్స్ టికెట్లు

ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ తన హోం గ్రౌండ్ లో ఆడే ఫస్ట్ మ్యాచ్ టికెట్ సేల్స్ ఈ రోజు (మార్చి 26) స్టార్ట్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
మ్యాచ్ ఎప్పుడంటే?
ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఏప్రిల్ 5న మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ టికెట్లు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సేల్ కు వస్తున్నాయి. ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ యాప్ లో ఈ టికెట్లు కొనుగోలు చేయొచ్చు. ఈ మేరకు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పంచుకుంది.
స్పెషల్ ఆఫర్
తమ ఫ్యాన్స్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ స్పెషల్ ఆఫర్ కూడా ప్రకటించింది. రెండు టికెట్లు కొన్న వాళ్లకు ఒక జెర్సీ ఫ్రీగా ఇవ్వనుంది. ఉప్పల్ స్టేడియంలో ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఏప్రిల్ 5న జరుగుతుంది. ఇందులో సన్రైజర్స్ హైదరాబాద్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది.
గ్రాండ్ ఓపెనింగ్
{{/usCountry}}తమ ఫ్యాన్స్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ స్పెషల్ ఆఫర్ కూడా ప్రకటించింది. రెండు టికెట్లు కొన్న వాళ్లకు ఒక జెర్సీ ఫ్రీగా ఇవ్వనుంది. ఉప్పల్ స్టేడియంలో ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఏప్రిల్ 5న జరుగుతుంది. ఇందులో సన్రైజర్స్ హైదరాబాద్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది.
గ్రాండ్ ఓపెనింగ్
{{/usCountry}}ఐపీఎల్ 2026 గ్రాండ్ ఓపెనింగ్ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. మార్చి 28న ఐపీఎల్ కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది.
డిఫెండింగ్ ఛాంపియన్
ఐపీఎల్ 2026లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగింది. గత సీజన్ లో ఆర్సీబీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి ఇదే ఫస్ట్ ట్రోఫీ.
మరోసారి ధోని, కోహ్లి, రోహిత్ లాంటి దిగ్గజాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఐపీఎల్ 2026కు రెడీ అవుతున్నారు. ధోని పూర్తిగా క్రికెట్ కు వీడ్కోలు పలకగా.. కోహ్లి, రోహిత్ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.