ఐపీఎల్ లవర్స్ కు కీలక అప్డేట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ ప్రారంభ తేదీలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం 2026 ఐపీఎల్ ఎడిషన్ మార్చి 28న ప్రారంభమై, మే 31న ముగియనుంది. గతేడాది డిసెంబర్లో జరిగిన వేలం తర్వాత.. టోర్నీ మార్చి 26నే మొదలవుతుందని భావించినప్పటికీ, అంతర్గత కారణాల వల్ల దీనిని రెండు రోజులు ముందుకు జరిపినట్లు తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకటనలో జాప్యం ఎందుకు?
ఐపీఎల్ 2026 పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. దీనికి ప్రధాన కారణం మూడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు. అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇంకా తేదీలను ప్రకటించలేదు.
గతంలో 2009, 2014, 2019, 2024లలో కూడా ఎన్నికల వల్ల షెడ్యూల్ను రెండు విడతల్లో ప్రకటించడం లేదా వేదికలను మార్చడం జరిగింది. అందుకే ఎన్నికల తేదీలు వెలువడే వరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 'వేచి చూసే ధోరణి'ని అవలంబిస్తోంది.
ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ సస్పెన్స్
డిఫెండింగ్ ఛాంపియన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈ సీజన్ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
గతేడాది ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ స్టేడియం భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ నెల ప్రారంభంలో కర్ణాటక ప్రభుత్వం స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు అనుమతి ఇచ్చినప్పటికీ, ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు.
ఒకవేళ చిన్నస్వామి స్టేడియం ఖరారు కాకపోతే.. నవీ ముంబై, రాయ్పూర్ లేదా పుణేలలో ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్లను ఆడే అవకాశం ఉంది.
డిఫెండింగ్ ఛాంపియన్గా ఆర్సీబీ
{{/usCountry}}ఒకవేళ చిన్నస్వామి స్టేడియం ఖరారు కాకపోతే.. నవీ ముంబై, రాయ్పూర్ లేదా పుణేలలో ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్లను ఆడే అవకాశం ఉంది.
డిఫెండింగ్ ఛాంపియన్గా ఆర్సీబీ
{{/usCountry}}గతేడాది అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. విరాట్ కోహ్లీ (43), కెప్టెన్ రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టోన్ రాణించడంతో ఆర్సీబీ మంచి స్కోరు సాధించింది.
పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్) వీరోచితంగా పోరాడినప్పటికీ, పంజాబ్ కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలవగా, కోల్కతా నైట్ రైడర్స్ మూడు టైటిళ్లతో తర్వాతి స్థానంలో ఉంది. 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. ఈసారి ఏం చేస్తుందో చూడాలి.