Mahindra cars : 5ఏళ్లల్లో 16 కార్లు లాంచ్- ఇండియా కోసం మహీంద్రా క్రేజీ ప్లాన్!
Mahindra SUVs : మహీంద్రా సంస్థ తన పాత ప్రణాళికను మరింత విస్తరిస్తూ, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కొత్త మోడళ్లను సిద్ధం చేస్తోంది. ఈ 16 కొత్త వాహనాల్లో 10 ఐసీఈ మోడళ్లు ఉండగా, 6 ఈవీలు ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది.
Mahindra new cars : భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించి వాహన మార్కెట్లో సంచలనం సృష్టించింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో వివిధ సెగ్మెంట్లలో ఏకంగా 16 కొత్త ఎస్యూవీలను లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు అధునాతన ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉండటం విశేషం. గత రెండేళ్లలో ఇప్పటికే పలు విజయవంతమైన మోడళ్లను మార్కెట్లోకి తెచ్చిన సంస్థ ఇప్పుడు తన తదుపరి దశ ఎక్స్ప్యాన్షన్పై దృష్టి సారించింది.

ఇటీవల విడుదలైన మోడళ్లు ఇవే..
గత కొంతకాలంగా మహీంద్రా తన పోర్ట్ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది:
ఐసీఈ విబాగంలో: ఎక్స్యూవీ 3ఎక్స్ఓ, థార్ రాక్స్, బొలెరో ఫేస్లిఫ్ట్, బొలెరో నియో ఫేస్లిఫ్ట్, ఎక్స్యూవీ 7ఎక్స్ఓ వంటి శక్తివంతమైన ఎస్యూవీలను ప్రవేశపెట్టింది.
ఎలక్ట్రిక్ విభాగంలో: బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్ఈవీ 9ఎస్, ఎక్స్యూవీ 3ఎక్స్ఓ ఈవీ వంటి అధునాతన మోడళ్లను లాంచ్ చేసింది.
ఇప్పుడు వీటికి అదనంగా మరో 9 సరికొత్త మోడళ్లను తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది.
‘NU_IQ’ ప్లాట్ఫారమ్తో సరికొత్త విప్లవం!
మహీంద్రా రాబోయే కొత్త తరం వాహనాలు ప్రధానంగా NU_IQ ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉంటాయి. గతేడాది ఈ ప్లాట్ఫారమ్ను ఆవిష్కరించిన సంస్థ.. దీని ద్వారా విజన్ ఎస్, విజన్ టీ, విజన్ ఎక్స్, విజన్ ఎస్ఎక్స్టీ వంటి నాలుగు కాన్సెప్ట్ మోడళ్లను పరిచయం చేసింది.
ఈ ప్లాట్ఫారమ్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్.. ఇలా మూడు రకాల ఇంజన్లకు సపోర్ట్ చేస్తుంది. ఈ ప్లాట్ఫారమ్ ఆధారిత మొదటి వాహనం 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
నాగ్పూర్లో కొత్త ప్లాంట్.. భారీగా పెరగనున్న ఉత్పత్తి!
కొత్త మోడళ్ల ఉత్పత్తి కోసం మహీంద్రా తన తయారీ వ్యవస్థను బలోపేతం చేస్తోంది:
చాకన్ ఫెసిలిటీ: మహారాష్ట్రలోని చాకన్ ప్లాంట్ను NU_IQ ప్లాట్ఫారమ్ వాహనాల తయారీకి సిద్ధం చేస్తున్నారు.
నాగ్పూర్ ప్లాంట్: రాబోయే 'విజన్' మోడళ్లకు నాగ్పూర్ ప్లాంట్ కీలక హబ్గా మారనుంది. ఇది 2028 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
ఉత్పత్తి సామర్థ్యం: 2027 ఆర్థిక సంవత్సరం నాటికి నెలకు అదనంగా 17,500 వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నెలకు 60,000 ఐసీఈ వాహనాలు, 6,000 ఈవీలను తయారు చేస్తున్న మహీంద్రా, ఈవీల సంఖ్యను 8,000కు పెంచాలని యోచిస్తోంది.
భవిష్యత్తులో రాబోయే మరిన్ని మోడళ్లు!
ప్రస్తుతం ఉన్న పాపులర్ మోడళ్లలో కూడా మార్పులు రానున్నాయి. పాపులర్ ఎస్యూవీ స్కార్పియో-ఎన్ ఫేస్లిఫ్ట్, థార్ ఫేస్లిఫ్ట్ వెర్షన్లు ఈ ఏడాది చివరిలో వచ్చే అవకాశం ఉంది. అలాగే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థార్. ఈ (థార్ ఎలక్ట్రిక్), బీఈ 07 కాన్సెప్ట్ మోడళ్లు కూడా త్వరలో ఉత్పత్తి దశకు చేరుకోవచ్చని సమాచారం.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. మహీంద్రా ఎన్ని కొత్త ఎస్యూవీలను లాంచ్ చేయబోతోంది?
మహీంద్రా రాబోయే కొద్ది సంవత్సరాలలో మొత్తం 16 కొత్త ఎస్యూవీలను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో 10 పెట్రోల్/డీజిల్ ఇంజన్ మోడళ్లు, 6 ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి.
2. NU_IQ ప్లాట్ఫారమ్ ప్రత్యేకత ఏంటి?
ఇది మహీంద్రా అభివృద్ధి చేసిన సరికొత్త ప్లాట్ఫారమ్. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు ఎలక్ట్రిక్ పవర్ట్రైన్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. 2027 నుంచి దీనిపై ఆధారపడిన కార్లు రానున్నాయి.
3. మహీంద్రా కొత్త ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
మహీంద్రా తన కొత్త తయారీ కేంద్రాన్ని నాగ్పూర్లో ఏర్పాటు చేస్తోంది. ఇది 2028 క్యాలెండర్ ఇయర్ నాటికి ప్రారంభం కానుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


