Maruti Suzuki e Vitara బుక్​ చేశారా? వెయిటింగ్​ పీరియడ్ కాస్త​ ఎక్కువే!

Maruti Suzuki e Vitara waiting period : మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారు 'ఈ విటారా'ను ఎట్టకేలకు భారత మార్కెట్​లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్​ కారు వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవీ వేరియంట్లు, రంగులు, డెలివరీ టైమ్​లైన్​పై పూర్తి వివరాలు మీకోసం..

Published on: Feb 26, 2026, 09:11:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మారుతీ సుజుకీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ‘ఈ విటారా’ ఫిబ్రవరి 17, 2026న గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఆటో ఎక్స్‌పో 2025లో తొలిసారి మెరిసిన ఈ కారు కోసం ఏడాదికి పైగా ఎదురుచూసిన కస్టమర్ల నిరీక్షణకు తెరపడింది. అయితే, ఈ ఎలక్ట్రిక్​ కారును ఇప్పుడే బుక్ చేసుకుంటే మీ చేతికి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? డీలర్ వర్గాల సమాచారం ప్రకారం మారుతీ సుజుకీ ఈ విటారా వెయిటింగ్​ పీరియడ్​ వివరాలు మీకోసం..

మారుతీ సుజుకీ ఈ విటారా..
మారుతీ సుజుకీ ఈ విటారా..

మారుతీ సుజుకీ ఈ విటారా- వేరియంట్ ఏదైనా.. వెయిటింగ్ తప్పదు!

మారుతీ సుజుకీ ఈ విటారా ప్రస్తుతం డెల్టా , జీటా, ఆల్ఫా అనే మూడు వేరియంట్స్​లో లభిస్తోంది. మీరు ఏ వేరియంట్ ఎంచుకున్నా సరే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 నుంచి 8 వారాల (సుమారు 1.5 నుంచి 2 నెలలు) వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎక్కువమంది కస్టమర్లు బేస్ వేరియంట్ అయిన 'డెల్టా' వైపు మొగ్గు చూపుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు.

అంతేకాదు మీరు ఎంచుకునే కలర్​ ఆప్షన్​ని బట్టి కూడా ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ డెలివరీ టైమ్​లైన్​ మారుతుంది.

ఆపులెంట్ రెడ్, బ్లూయిష్ బ్లాక్ రంగులకు అత్యధిక డిమాండ్ ఉండటంతో, వీటికి 2 నెలల (8-9 వారాలు) వెయిటింగ్ పీరియడ్ ఉంది.

నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, గ్రాండ్యూర్ గ్రే వంటి మిగిలిన రంగులకు సుమారు 1.5 నెలల (6-7 వారాలు) సమయం పడుతుంది.

గమనిక: మీ నగరం లేదా డీలర్‌షిప్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్‌లో మార్పులు ఉండవచ్చు. ఖచ్చితమైన సమాచారం కోసం సమీపంలోని నెక్సా షోరూమ్‌ను సంప్రదించండి.

మారుతీ సుజుకీ ఈ విటారా- బ్యాటరీ, రేంజ్ వివరాలు..

డెల్టా (Delta): 49కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్, 440 కిమీ రేంజ్ (ఏఆర్​ఏఐ ప్రకారం).

జీటా అండ్​ ఆల్ఫా : 61 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్, 543 కిమీ రేంజ్.

మారుతీ సుజుకీ ఈ విటారా- బీఏఏఎస్​ స్కీమ్‌తో ధర భారీగా తగ్గింపు!

ఈ ఎలక్ట్రిక్​ కారుతో పాటు మారుతీ 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్​) స్కీమ్​ని కూడా ప్రవేశపెట్టింది. దీనివల్ల కారు కొనుగోలు చేసేటప్పుడు చెల్లించాల్సిన ప్రారంభ ధర చాలా తగ్గుతుంది. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ కోసం కిలోమీటరుకు రూ. 3.99 లేదా రూ. 4.39 (బ్యాటరీ ప్యాక్‌ను బట్టి) చెల్లించాల్సి ఉంటుంది.

సాధారణ ఎక్స్-షోరూమ్ ధర: రూ. 15.99 లక్షల నుంచి రూ. 20.01 లక్షలు.

బీఏఏఎస్​ స్కీమ్ కింద ధర: రూ. 10.99 లక్షల నుంచి రూ. 14.51 లక్షలు మాత్రమే (బ్యాటరీ ఫీజు అదనం).

తక్కువ డౌన్ పేమెంట్ కావాలనుకునే వారు ఈ బీఏఏఎస్​ స్కీమ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ఈ మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. ఎంజీ విండ్‌సర్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఈ విటారా బ్యాటరీ, రేంజ్ సామర్థ్యం ఎంత?

సమాధానం- మారుతీ ఈ విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది:

49 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ: ఇది సుమారు 440 కిమీ రేంజ్ ఇస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు అనువైనది.

61 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ: ఇది అత్యధికంగా 543 కిమీ రేంజ్ అందిస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది సరైన ఛాయిస్.

రెండు వెర్షన్లు కూడా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి, దీనివల్ల కేవలం 45 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు.

2. మారుతీ ఈ విటారాలో ఉన్న వారెంటీ, మెయింటెనెన్స్ ప్రయోజనాలు ఏంటి?

సమాధానం- కస్టమర్ల నమ్మకాన్ని పెంచేందుకు మారుతీ సుజుకీ ఈ కారుపై మంచి వారెంటీ ప్యాకేజీని ప్రకటించింది:

బ్యాటరీ వారెంటీ: 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్లు.

వెహికల్ వారెంటీ: స్టాండర్డ్ 3 ఏళ్ల వారెంటీ ఉంటుంది (దీనిని 8 ఏళ్ల వరకు పొడిగించుకునే ఆప్షన్ ఉంది).

అదనంగా, మొదటి ఏడాది పాటు మారుతీ డీలర్ పాయింట్ల వద్ద ఉచిత ఛార్జింగ్ (1,000 యూనిట్ల వరకు), ఉచితంగా 7.4 కేడబ్ల్యూ హోమ్ ఛార్జర్ ఇన్‌స్టాలేషన్ సౌకర్యం కూడా అందిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More