...
...
Next Story

మ్యూచువల్ ఫండ్స్ భారీ కొనుగోళ్లు.. జూలైలో ఏ షేర్లలో ఎంతెంత పెట్టుబడులంటే?

2026 జూలై నెలలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో విచ్చలవిడిగా పెట్టుబడులు పెట్టారు. వ్యాల్యూ రీసెర్చ్ సేకరించిన సమాచారం ప్రకారం ఫండ్ హౌస్‌లు అత్యధికంగా కొనుగోలు చేసిన ప్రధాన స్టాక్స్ వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Aug 24, 2026, 17:01:55 IST
Advertisement

భారతీయ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు తమ పెట్టుబడుల వ్యూహాలకు పదును పెట్టారు. 2026 జూలై నెలకు సంబంధించిన పోర్ట్‌ఫోలియో వివరాలను పరిశీలిస్తే ఫండ్ హౌస్‌లు లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపినట్లు స్పష్టమవుతోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, టెక్నాలజీ, వినియోగదారుల సేవల (కన్జ్యూమర్ సర్వీసెస్) రంగాలలోని కంపెనీలపై ఫండ్ మేనేజర్లు ఎక్కువ ఆసక్తి చూపించారు.

మ్యూచువల్ ఫండ్స్ భారీ కొనుగోళ్లు.. జూలైలో ఏ షేర్లలో ఎంతెంత పెట్టుబడులంటే?
మ్యూచువల్ ఫండ్స్ భారీ కొనుగోళ్లు.. జూలైలో ఏ షేర్లలో ఎంతెంత పెట్టుబడులంటే?

సమాచార విశ్లేషణ సంస్థ 'వ్యాల్యూ రీసెర్చ్' (Value Research) జూన్ 2026తో పోల్చి జూలై 2026 నాటి డేటాను సమీక్షించి ఈ వివరాలను వెల్లడించింది. సాధారణంగా లార్జ్ క్యాప్ షేర్లు పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని ఇస్తే, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అధిక రిస్క్‌తో కూడిన వేగవంతమైన వృద్ధి అవకాశాలను అందిస్తాయి. ఈ నేపథ్యంలో విభిన్న మార్కెట్ క్యాప్‌లలో ఫండ్లు ఎక్కడెక్కడ నిధులు గుమ్మరించారో చూద్దాం.

లార్జ్ క్యాప్‌లలో టోరెంట్ ఫార్మా అగ్రస్థానం

లార్జ్ క్యాప్ విభాగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు ఫండ్ మేనేజర్లను బాగా ఆకట్టుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకింగ్ షేర్లతో పాటు ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్‌లో కొనుగోళ్లు పెరిగాయి.

అయితే, లార్జ్ క్యాప్ విభాగంలో అందరికంటే ఎక్కువగా టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ (Torrent Pharmaceuticals) షేర్లలో మ్యూచువల్ ఫండ్లు జూలైలో రూ. 7,014 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడం విశేషం. ఆ తర్వాత స్థానంలో నిలిచిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ. 6,743 కోట్ల కొనుగోళ్లు జరిగాయి. అలాగే బ్యాంకింగ్ దిగ్గజాలైన యాక్సిస్ బ్యాంక్‌లో రూ. 3,522 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో రూ. 3,262 కోట్ల చొప్పున పెట్టుబడులు వెళ్లాయి.

మ్యూచువల్ ఫండ్స్ జులైలో కొనుగోలు చేసిన టాప్ లార్జ్ క్యాప్ స్టాక్స్

స్టాక్ పేరుషేర్ల కొనుగోలు (రూ. కోట్లలో)
Torrent Pharmaceuticals7,014
Adani Enterprises6,743
Axis Bank3,522
Kotak Mahindra Bank3,262
SBI Funds Management2,344
Hindalco Industries1,775
Hindustan Unilever1,334
Eicher Motors1,192
Adani Energy Solutions1,138
Union Bank of India1,002

సోర్స్: వాల్యూ రీసెర్చ్

View All

మిడ్ క్యాప్‌లో బయొకాన్, పీబీ ఫిన్‌టెక్ హవా

పాలసీబజార్ మాతృసంస్థ 'పీబీ ఫిన్‌టెక్' (PB Fintech)లో రూ. 2,875 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. మరోవైపు కొత్త తరం కంపెనీలైన లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్, స్విగ్గీలలో రూ. 1,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాగా, మీషో (Meesho) కంపెనీలో రూ. 860 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగాయి.

మ్యూచువల్ ఫండ్స్ జులైలో కొనుగోలు చేసిన టాప్ మిడ్ క్యాప్ స్టాక్స్

స్టాక్ పేరుషేర్ల కొనుగోలు (రూ. కోట్లలో)
Biocon3,234
PB Fintech2,875
Lenskart Solutions1,022
Swiggy1,001
360 One Wam912
Meesho860
MCX744
Coforge709
Havells India677
Steel Authority of India669

సోర్స్: వాల్యూ రీసెర్చ్

View All

మ్యూచువల్ ఫండ్స్ జులైలో కొనుగోలు చేసిన టాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్

వేగవంతమైన రాబడులను ఆశించే స్మాల్ క్యాప్ విభాగంలో 'డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' (Diamond Power Infrastructure) అగ్రస్థానంలో నిలిచింది. జూలై 2026లో ఈ కంపెనీ షేర్లలో ఫండ్ మేనేజర్లు రూ. 1,605 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.

ఈ జాబితాలో జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ రూ. 1,126 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, స్టెర్లైట్ టెక్నాలజీస్ రూ. 1,108 కోట్ల కొనుగోళ్లతో తదుపరి స్థానంలో నిలిచింది. మొత్తానికి జూలై నెలలో మార్కెట్ క్యాప్‌తో సంబంధం లేకుండా అన్ని విభాగాలలోనూ ఫండ్ మేనేజర్లు విస్తృతంగా పెట్టుబడులను పెంచినట్లు డేటా స్పష్టం చేస్తోంది.

స్టాక్ పేరుషేర్ల కొనుగోలు (రూ. కోట్లలో)
Diamond Power Infrastructure1,605
Jupiter Life Line Hospitals1,126
Sterlite Technologies1,108
Shadowfax Technologies710
TBO Tek673
Belrise Industries612
Manappuram Finance515
Kusumgar466
KFin Technologies438
Laser Power & Infra400

సోర్స్: వాల్యూరీసెర్చ్

View All
 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe